TG Rythu Bharosa Scheme : రైతు భరోసా స్కీమ్ కొత్త దరఖాస్తులు - చివరి తేదీ ఎప్పుడంటే...?
TG Rythu Bharosa Scheme Applications : రైతు భరోసా స్కీమ్ కు కొత్త దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అర్హులైన రైతులు మార్చి 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది.
రైతు భరోసా పంట పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తేదీని కూడా ప్రకటించారు. ఈ నెల 22 నుంచి రైతుల ఖాతాల్లో రైతుభరోసా నిధులు జమ చేస్తారు.
రైతు భరోసా నిధుల విడుదల నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఇప్పటి వరకు రైతు భరోసా పంట పెట్టుబడి సాయం అందని రైతులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
కొత్తగా పట్టా పొందిన రైతులు అంటే 28.02.2026 లోపు పట్టా పొందిన రైతులు కొత్తగా రైతు భరోసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. స్థానిక వ్యవసాయ విస్తరణ అధికారులను కలిసి దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
కొత్తగా వ్యవసాయ భూములకు పట్టాదార్ పాస్పుస్తకాలు పొందిన వారికి కూడా రైతు భరోసా పథకం నిధులు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం అర్హులైన వారు మార్చి 21వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఇవ్వాల్సి ఉంటుంది. రైతు ఆధార్ కార్డుతో పాటు రైతు భరోసా అప్లికేషన్ ఫారంతో పాటు సమర్పించాలి. అప్లికేషన్ ఫారంలో పూర్తి వివరాలు నింపి రైతు వేదికల వద్ద లేదా మండలాల్లోని వ్యవసాయ విస్తరణ అధికారులకు అందజేయాలి. ఇలాంటి వారి వివరాలు వెంటనే నమోదు చేసి లబ్ధిదారుల జాబితాలో చేర్చాలని ఏఈవోలు, వ్యవసాయాధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
E-Paper

