Padma Awards 2026 : ఏపీ, తెలంగాణ నుంచి పద్మ అవార్డు గ్రహీతలు.. ఫొటోలు చూడండి
కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల నుంచి మెుత్తం 11 మందికి పద్మ పురస్కారాలు వరించాయి. వారి ఫొటోలు ఇక్కడ చూడండి..
2026కి సంబంధించి.. కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా ఒకరోజు ముందుగానే ఈ పురస్కారాల లిస్ట్ను విడుదల చేసింది. ఐదుగురికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మ భూషణ్, 113మందికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. పద్మశ్రీ వచ్చిన వారిలో 11 మంది తెలుగు వారు ఉన్నారు. ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు(యూఎస్) పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు. యూజీసీ మాజీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్కు దిల్లీ కోటాలో పద్మశ్రీ వరించింది.
ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు(యూఎస్) పద్మభూషణ్ అవార్డుకు ఎంపికయ్యారు.
పద్మశ్రీ : సినీనటుడు గద్దె బాబు రాజేంద్ర ప్రసాద్- కళలు(ఆంధ్రప్రదేశ్)
పద్మశ్రీ : గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ - కళలు(ఆంధ్రప్రదేశ్)
పద్మశ్రీ : వెంపటి కుటుంబ శాస్త్రి - సాహిత్యం, విద్యా(ఆంధ్రప్రదేశ్)
పద్మశ్రీ : మాగంటి మురళీ మోహన్ - కళలు(ఆంధ్రప్రదేశ్)
పద్మశ్రీ : గద్దమనుగు చంద్రమౌళి - సైన్స్ విభాగం(తెలంగాణ)
పద్మశ్రీ : దీపికారెడ్డి - నృత్యకారిణి(తెలంగాణ)
పద్మశ్రీ : గూడూరు వెంకట్రావు - వైద్యం(తెలంగాణ)
పద్మశ్రీ : కృష్ణమూర్తి బాల సుబ్రహ్మణియన్ - సైన్స్ అండ్ ఇంజినీరింగ్(తెలంగాణ)
పద్మశ్రీ : డాక్టర్ కుమారస్వామి తంగరాజ్ - సైన్స్(తెలంగాణ)
పద్మశ్రీ : రామారెడ్డి మామిడి(మరణానంతరం) - పశుసంవర్థక, పాడి పరిశ్రమ(తెలంగాణ)
పద్మశ్రీ : పాల్కొండ విజయ్ ఆనంద్రెడ్డి - వైద్యం(తెలంగాణ)
E-Paper

