నవంబర్ 3 నుంచి తెలంగాణలో ప్రైవేట్ కాలేజీలు బంద్..!
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల కోసం మళ్లీ తెలంగాణలోని ప్రైవేట్ కాలేజీలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఇంజినీరింగ్తో పాటు ఇతర వృత్తి విద్యా కళాశాలలు నవంబరు 3 నుంచి బంద్ పాటిస్తామని ప్రైవేటు కాలేజీల సమాఖ్య తెలిపింది.
తెలంగాణలో నవంబర్ 3వ తేదీ నుంచి ప్రైవేట్ వృత్తి విద్యా కాలేజీల బంద్ కానున్నాయి. ఈ మేరకు ప్రైవేటు కాలేజీల యాజామన్యం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం ప్రతినిధులు వెల్లడించారు.
(image source @airnews_hyd)
తెలంగాణలో నవంబర్ 3వ తేదీ నుంచి ప్రైవేట్ వృత్తి విద్యా కాలేజీల బంద్ కానున్నాయి. ఈ మేరకు ప్రైవేటు కాలేజీల యాజామన్యం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం ప్రతినిధులు వెల్లడించారు.
ఇటీవలనే బంద్ కు పిలుపునిచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి హామీ రావటంతో కాలేజీలు వెనక్కి తగ్గాయి. అయితే బకాయిల చెల్లింపుల విషయంలో జాప్యం నెలకొందని… ఇదే విషయంపై ఈ నెల 22న ప్రభుత్వానికి నోటీసు అందజేస్తామని సంఘ ప్రతినిధులు తెలిపారు.
బంద్ కు సంబంధించి ప్రైవేటు కాలేజీల యాజామన్యం కార్యాచరణను కూడా ప్రకటించింది. అక్టోబర్ 25వ తేదీన విద్యార్థి సంఘాలతో భేటీ అవుతారు. 26వ తేదీన ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని…. నవంబరు 1వ తేదీ నాటికి అన్ని పార్టీల నేతలతో కలిసి సమావేశం జరపాలని నిర్ణయించారు.
ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని… వెంటనే బకాయిలు చెల్లించాలని ఆయా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హామీ మేరకు వెంటనే చెల్లించకపోతే నవంబర్ 3వ తేదీ నుంచి కాలేజీలను మూసివేస్తామని స్పష్టం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 1500కుపైగా వృత్తి విద్యా కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో లక్షలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయంబర్స్ మెంట్ తో పాటు ఇతర ఫీజులు కాలేజీలకు చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు రూ.10 వేల కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నాయని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. తక్షణమే ప్రభుత్వం స్పందించి… ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరుతున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 1500కుపైగా వృత్తి విద్యా కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో లక్షలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయంబర్స్ మెంట్ తో పాటు ఇతర ఫీజులు కాలేజీలకు చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు రూ.10 వేల కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నాయని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. తక్షణమే ప్రభుత్వం స్పందించి… ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరుతున్నాయి.
E-Paper

