నవంబర్‌ 3 నుంచి తెలంగాణలో ప్రైవేట్‌ కాలేజీలు బంద్‌..!

Published on Oct 21, 2025 03:39 pm IST

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల కోసం మళ్లీ తెలంగాణలోని ప్రైవేట్ కాలేజీలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. ఇంజినీరింగ్‌తో పాటు ఇతర వృత్తి విద్యా కళాశాలలు నవంబరు 3 నుంచి బంద్‌ పాటిస్తామని ప్రైవేటు కాలేజీల సమాఖ్య తెలిపింది.

1 / 5
<div><p>తెలంగాణలో నవంబర్ 3వ తేదీ నుంచి ప్రైవేట్ వృత్తి విద్యా కాలేజీల బంద్ కానున్నాయి. ఈ మేరకు ప్రైవేటు కాలేజీల యాజామన్యం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం ప్రతినిధులు వెల్లడించారు.</p></div>(image source @airnews_hyd) expand-icon View Photos in a new improved layout
Published on Oct 21, 2025 03:39 pm IST

తెలంగాణలో నవంబర్ 3వ తేదీ నుంచి ప్రైవేట్ వృత్తి విద్యా కాలేజీల బంద్ కానున్నాయి. ఈ మేరకు ప్రైవేటు కాలేజీల యాజామన్యం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఫీజు రీయంబర్స్ మెంట్ బకాయిలు చెల్లించకపోవటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంఘం ప్రతినిధులు వెల్లడించారు.

(image source @airnews_hyd)

2 / 5
<p>ఇటీవలనే బంద్ కు పిలుపునిచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి హామీ రావటంతో కాలేజీలు వెనక్కి తగ్గాయి. అయితే బకాయిల చెల్లింపుల విషయంలో జాప్యం నెలకొందని… ఇదే విషయంపై ఈ నెల 22న ప్రభుత్వానికి నోటీసు అందజేస్తామని సంఘ ప్రతినిధులు తెలిపారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 21, 2025 03:39 pm IST

ఇటీవలనే బంద్ కు పిలుపునిచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి హామీ రావటంతో కాలేజీలు వెనక్కి తగ్గాయి. అయితే బకాయిల చెల్లింపుల విషయంలో జాప్యం నెలకొందని… ఇదే విషయంపై ఈ నెల 22న ప్రభుత్వానికి నోటీసు అందజేస్తామని సంఘ ప్రతినిధులు తెలిపారు.

3 / 5
<p>బంద్ కు సంబంధించి ప్రైవేటు కాలేజీల యాజామన్యం కార్యాచరణను కూడా ప్రకటించింది. అక్టోబర్ 25వ తేదీన విద్యార్థి సంఘాలతో భేటీ అవుతారు. 26వ తేదీన ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని…. నవంబరు 1వ తేదీ నాటికి అన్ని పార్టీల నేతలతో కలిసి సమావేశం జరపాలని నిర్ణయించారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 21, 2025 03:39 pm IST

బంద్ కు సంబంధించి ప్రైవేటు కాలేజీల యాజామన్యం కార్యాచరణను కూడా ప్రకటించింది. అక్టోబర్ 25వ తేదీన విద్యార్థి సంఘాలతో భేటీ అవుతారు. 26వ తేదీన ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని…. నవంబరు 1వ తేదీ నాటికి అన్ని పార్టీల నేతలతో కలిసి సమావేశం జరపాలని నిర్ణయించారు.

4 / 5
<p>ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని… వెంటనే బకాయిలు చెల్లించాలని ఆయా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హామీ మేరకు వెంటనే చెల్లించకపోతే నవంబర్ 3వ తేదీ నుంచి కాలేజీలను మూసివేస్తామని స్పష్టం చేశారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 21, 2025 03:39 pm IST

ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని… వెంటనే బకాయిలు చెల్లించాలని ఆయా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హామీ మేరకు వెంటనే చెల్లించకపోతే నవంబర్ 3వ తేదీ నుంచి కాలేజీలను మూసివేస్తామని స్పష్టం చేశారు.

5 / 5
<div><p>రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 1500కుపైగా వృత్తి విద్యా కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో లక్షలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయంబర్స్ మెంట్ తో పాటు ఇతర ఫీజులు కాలేజీలకు చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు రూ.10 వేల కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నాయని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. తక్షణమే ప్రభుత్వం స్పందించి… ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని కోరుతున్నాయి.</p></div> expand-icon View Photos in a new improved layout
Published on Oct 21, 2025 03:39 pm IST

రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 1500కుపైగా వృత్తి విద్యా కాలేజీలు ఉన్నాయి. వీటిల్లో లక్షలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విద్యార్థులకు సంబంధించిన ఫీజు రీయంబర్స్ మెంట్ తో పాటు ఇతర ఫీజులు కాలేజీలకు చెల్లించాల్సి ఉంటుంది. దాదాపు రూ.10 వేల కోట్ల వరకు పెండింగ్ లో ఉన్నాయని కాలేజీల యాజమాన్యాలు చెబుతున్నాయి. తక్షణమే ప్రభుత్వం స్పందించి… ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను విడుదల చేయాలని కోరుతున్నాయి.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!