ఏపీ, తెలంగాణ వెదర్ రిపోర్ట్ : ఓవైపు భానుడి ప్రతాపం.... మరోవైపు ఈదురుగాలులతో వర్షాలు - ఇవాళ్టి అంచనాలు

Published on May 26, 2026 08:26 am IST

AP Telangana Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఉదయం 9 గంటల నుంచే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తుండటంతో జనం బయటకు రావడానికే భయపడుతున్నారు. మరోవైపు పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.

1 / 8
<p>ఏపీ, తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. భానుడి భగభగలు, ఉక్కపోతతో జనం అల్లాడిపోతుండగా, వాతావరణ శాఖ ఒకే సమయంలో అటు వడగాల్పుల హెచ్చరికలను, ఇటు వర్ష సూచనను జారీ చేసింది. రాబోయే నాలుగైదు రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.</p><p> </p> expand-icon View Photos in a new improved layout
Published on May 26, 2026 08:26 am IST

ఏపీ, తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. భానుడి భగభగలు, ఉక్కపోతతో జనం అల్లాడిపోతుండగా, వాతావరణ శాఖ ఒకే సమయంలో అటు వడగాల్పుల హెచ్చరికలను, ఇటు వర్ష సూచనను జారీ చేసింది. రాబోయే నాలుగైదు రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది.

2 / 8
<p>రాబోయే మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలలో ఎలాంటి భారీ మార్పులు ఉండవు. ఆ తర్వాత నాలుగు రోజుల్లో మాత్రం ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల మేర క్రమంగా తగ్గుముఖం పడతాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.</p><p> </p>(image istock) expand-icon View Photos in a new improved layout
Published on May 26, 2026 08:26 am IST

రాబోయే మూడు రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలలో ఎలాంటి భారీ మార్పులు ఉండవు. ఆ తర్వాత నాలుగు రోజుల్లో మాత్రం ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీల మేర క్రమంగా తగ్గుముఖం పడతాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.

(image istock)

3 / 8
<p>ఏపీలోని మధ్య కోస్తా జిల్లాల్లో ఎండల తీవ్రత అత్యధికంగా నమోదు కానుంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుండి 46 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ జిల్లాల ప్రజలు మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచించారు.</p><p> </p> expand-icon View Photos in a new improved layout
Published on May 26, 2026 08:26 am IST

ఏపీలోని మధ్య కోస్తా జిల్లాల్లో ఎండల తీవ్రత అత్యధికంగా నమోదు కానుంది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల నుండి 46 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ జిల్లాల ప్రజలు మధ్యాహ్నం వేళల్లో అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని అధికారులు సూచించారు.

4 / 8
<p>ఇవాళ(మే 26) ఉత్తర కోస్తా, గోదావరి జిల్లాల్లో కూడా ఎండల వేడి బలంగా ఉంటుంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిసర ప్రాంతాలు, కాకినాడ, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి మరియు నెల్లూరు జిల్లాల్లో 42 డిగ్రీల నుండి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలతో పాటు రాయలసీమ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుండి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 26, 2026 08:26 am IST

ఇవాళ(మే 26) ఉత్తర కోస్తా, గోదావరి జిల్లాల్లో కూడా ఎండల వేడి బలంగా ఉంటుంది. విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం పరిసర ప్రాంతాలు, కాకినాడ, డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి మరియు నెల్లూరు జిల్లాల్లో 42 డిగ్రీల నుండి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలతో పాటు రాయలసీమ పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల నుండి 42 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండే అవకాశం ఉంది.

5 / 8
<p>ఏపీలో ఎండలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉపద్రవంగా మారిన వడగాల్పులు జనాలను మరింత ఇబ్బంది పెట్టనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 26 మండలాల్లో తీవ్ర వడగాల్పులు (Severe Heat Wave), మరో 137 మండలాల్లో సాధారణ వడగాల్పులు (Heat Wave) వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.</p>(istock images) expand-icon View Photos in a new improved layout
Published on May 26, 2026 08:26 am IST

ఏపీలో ఎండలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉపద్రవంగా మారిన వడగాల్పులు జనాలను మరింత ఇబ్బంది పెట్టనున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 26 మండలాల్లో తీవ్ర వడగాల్పులు (Severe Heat Wave), మరో 137 మండలాల్లో సాధారణ వడగాల్పులు (Heat Wave) వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.

(istock images)

6 / 8
<p>తీవ్రమైన ఎండల నడుమ ద్రోణి ప్రభావంతో ఏపీలోని కొన్ని ప్రాంతాలకు ఉపశమనం లభించనుంది. వాతావరణంలో ఏర్పడిన ద్రోణి మార్పుల వల్ల పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, మరియు చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షం పడే సమయంలో గాలి వేగంగా వీస్తుందని, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని అధికారులు హెచ్చరించారు.</p><p> </p> expand-icon View Photos in a new improved layout
Published on May 26, 2026 08:26 am IST

తీవ్రమైన ఎండల నడుమ ద్రోణి ప్రభావంతో ఏపీలోని కొన్ని ప్రాంతాలకు ఉపశమనం లభించనుంది. వాతావరణంలో ఏర్పడిన ద్రోణి మార్పుల వల్ల పల్నాడు, మార్కాపురం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, మరియు చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. వర్షం పడే సమయంలో గాలి వేగంగా వీస్తుందని, పిడుగులు పడే ప్రమాదం ఉన్నందున రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఆశ్రయం పొందవద్దని అధికారులు హెచ్చరించారు.

7 / 8
<p>ఇక తెలంగాణలో చూస్తే నాలుగైదు రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. ఇవాళ(మే 26) ఖమ్మం, నల్గొండ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చు. మరికొన్ని జిల్లాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి.భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల వడగాల్పుల పరిస్థితులు ఉంటాయి. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.<br> </p> expand-icon View Photos in a new improved layout
Published on May 26, 2026 08:26 am IST

ఇక తెలంగాణలో చూస్తే నాలుగైదు రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉంది. ఇవాళ(మే 26) ఖమ్మం, నల్గొండ, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చు. మరికొన్ని జిల్లాలకు వడగాల్పుల హెచ్చరికలు జారీ అయ్యాయి.భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల వడగాల్పుల పరిస్థితులు ఉంటాయి. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.

8 / 8
<p><strong>మే 27 నుండి 29 వరకు </strong>వర్షాల ప్రభావం మరింత విస్తరించనుంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలున్నాయి.</p><p> </p>(image source @APSDMA) expand-icon View Photos in a new improved layout
Published on May 26, 2026 08:26 am IST

మే 27 నుండి 29 వరకు వర్షాల ప్రభావం మరింత విస్తరించనుంది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లో ఉరుములతో కూడిన జల్లులు పడే సూచనలున్నాయి.

(image source @APSDMA)

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!