Telangana Weather : తెలంగాణకు రెయిన్ అలర్ట్ - 4 రోజులపాటు వర్షాలు..! ఐఎండీ అంచనాలివే
తెలంగాణకు వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. మార్చి 15వ తేదీ నుంచి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉంది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. వెదర్ అప్డేట్స్ వివరాలను ఇక్కడ తెలుసుకోండి……
తెలంగాణలో ఎండల ప్రభావం మొదలైంది. మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతల నమోదు ఎక్కువగా ఉంటుంది. అయితే ఈనెల 15వ తేదీ నుంచి రాష్ట్రంలో వాతావరణంలో మార్పులు ఉండనున్నాయి. ఈ తేదీ నుంచి పలు జిల్లాల్లో వర్షాలు పడుతాయని వాతావరణశాఖ అంచనా వేసింది.
మార్చి 15వ తేదీ నుంచి రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. కొన్ని జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను కూడా జారీ చేసింది.
మార్చి 15వ తేదీన ఆదిలాబాద్, కొమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మెదక్ మరియు కామారెడ్డి జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. ఆయా జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడొచ్చు.
మార్చి 16వ తేదీన ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల,నిర్మల్, జగిత్యాల, నిజామబా్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్ , నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడొచ్చు. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
మార్చి 17, 18 తేదీల్లో కూడా రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ తేదీల్లో ఎలాంటి హెచ్చరికలు జారీ కాలేదు.
(AFP File )
ఈనెల 15వ తేదీ నుంచి తెలంగాణలో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండగా… ఆ తేదీ నుంచి కొంత మేర తగ్గుతాయని వాతావరణశాఖ అంచనా వేస్తోంది.
(image source @APSDMA)
E-Paper

