Raksha Bandhan : రాఖీ పండుగ తేదీ, శుభ ముహూర్తం పూర్తి వివరాలు ఇవే..
Raksha Bandhan 2026 date : ఈ ఏడాది రక్షాబంధన్ పండుగ తేదీపై ఉన్న గందరగోళానికి తెరపడింది. ఆగస్టు 28నే రాఖీ పండగ జరుపుకోవాలని పండితులు స్పష్టం చేస్తున్నారు. శుభ ముహూర్తాలు, ఇతర ముఖ్యమైన వివరాలను ఇక్కడ తెలుసుకోండి.
అన్నాచెల్లెళ్లు, తోబుట్టువుల మధ్య అప్యాయతానురాగాలకు ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగ ఎప్పుడనే దానిపై స్పష్టత వచ్చేసింది. హిందూ క్యాలెండర్ ప్రకారం శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రక్షాబంధన్ జరుపుకుంటారు. అయితే ఈసారి పౌర్ణమి తిథి రెండు రోజుల్లోకి రావడం వల్ల కొద్దిగా గందరగోళం నెలకొంది. ఆగస్టు 27న ఉదయం 9:08 గంటలకు ప్రారంభమయ్యే పౌర్ణమి తిథి, ఆగస్టు 28న ఉదయం 9:48 గంటలకు ముగుస్తుంది. అయితే సంప్రదాయం ప్రకారం సూర్యోదయ సమయంలో ఏ తిథి ఉంటే ఆ రోజే పండుగను నిర్ణయిస్తారు. ఆగస్టు 28న సూర్యోదయ సమయంలో పౌర్ణమి తిథి ఉండి ఉదయం 9:48 వరకు కొనసాగుతుంది. అందువల్ల ఆగస్టు 28నే రాఖీ పండుగ జరుపుకోవాలని పండితులు నిర్ధారించారు.
రాఖీ పండుగలో అత్యంత కీలకమైన అంశం భద్రా కాలం. ఏ శుభకార్యాలనైనా ఈ సమయంలో చేయకూడదని సాంప్రదాయంగా నమ్ముతారు. ఈ ఏడాది భద్ర కాలం ఆగస్టు 27నే వచ్చి, ఆగస్టు 28 సూర్యోదయానికి ముందే ముగిసిపోతుంది. దీనివల్ల ఆగస్టు 28న రాఖీ కట్టే ప్రధాన సమయానికి భద్రా కాలానికి ఎలాంటి సంబంధం లేదు. ఉదయాన్నే పండుగ జరుపుకునే కుటుంబాలు భద్రా కాలం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
హిందూ సంప్రదాయంలో ఏ శుభకార్యం తలపెట్టినా సరైన ముహూర్తం చూసుకోవడం చాలా ముఖ్యం. రక్షా బంధన్ రోజున రాఖీ కట్టడానికి రెండు ప్రత్యేక ముహూర్తాలు అందుబాటులో ఉన్నాయి. మొదటిది ఉదయం 05:57 నిమిషాల నుంచి ఉదయం 09:48 నిమిషాల వరకు రాఖీ కట్టడానికి అత్యంత అనుకూలమైన సమయం. ఉదయం పూట కుదరని వారి కోసం మధ్యాహ్నం 01:52 నిమిషాల నుంచి సాయంత్రం 04:35 నిమిషాల వరకు మరో మంచి ముహూర్తం ఉంది.
హిందూ సంప్రదాయంలో ఏ శుభకార్యం తలపెట్టినా సరైన ముహూర్తం చూసుకోవడం చాలా ముఖ్యం. రక్షా బంధన్ రోజున రాఖీ కట్టడానికి రెండు ప్రత్యేక ముహూర్తాలు అందుబాటులో ఉన్నాయి. మొదటిది ఉదయం 05:57 నిమిషాల నుంచి ఉదయం 09:48 నిమిషాల వరకు రాఖీ కట్టడానికి అత్యంత అనుకూలమైన సమయం. ఉదయం పూట కుదరని వారి కోసం మధ్యాహ్నం 01:52 నిమిషాల నుంచి సాయంత్రం 04:35 నిమిషాల వరకు మరో మంచి ముహూర్తం ఉంది.
ముఖ్యమైన సమయాలు: తేదీ: శుక్రవారం, ఆగస్టు 28, 2026,
పౌర్ణమి తిథి: ఆగస్టు 27 ఉదయం 9:08 నుంచి ఆగస్టు 28 ఉదయం 9:48 వరకు,
భద్రా కాలం: ఆగస్టు 27న ఉండి, ఆగస్టు 28 సూర్యోదయానికి ముందే ముగుస్తుంది,
ప్రధాన శుభ ముహూర్తం : ఉదయం 5:57 నుంచి 9:48 వరకు,
అపరాహ్న సమయం: మధ్యాహ్నం 1:46 నుంచి 4:20 వరకు,
ప్రదోష కాలం: సాయంత్రం వేళలో ప్రత్యామ్నాయ సమయం,
పూజా కార్యక్రమాల్లో భాగంగా ముందుగా తయారుచేసిన రాఖీని బాలగోపాలుడికి లేదా ఇష్ట దైవానికి సమర్పించాలి. అనంతరం కుటుంబం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకోవాలి. రాఖీ కట్టే సమయంలో సోదరుడి ముఖం తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ఉండేలా చూసుకోవాలి. సోదరుడి నుదుటిన కుంకుమ తిలకం దిద్ది, దీపం వెలిగించి ముందుగా దేవుడికి, ఆ తర్వాత సోదరుడికి హారతి ఇవ్వాలి.
పూజా కార్యక్రమాల్లో భాగంగా ముందుగా తయారుచేసిన రాఖీని బాలగోపాలుడికి లేదా ఇష్ట దైవానికి సమర్పించాలి. అనంతరం కుటుంబం అంతా సుభిక్షంగా ఉండాలని కోరుకోవాలి. రాఖీ కట్టే సమయంలో సోదరుడి ముఖం తూర్పు లేదా ఉత్తర దిశ వైపు ఉండేలా చూసుకోవాలి. సోదరుడి నుదుటిన కుంకుమ తిలకం దిద్ది, దీపం వెలిగించి ముందుగా దేవుడికి, ఆ తర్వాత సోదరుడికి హారతి ఇవ్వాలి.
అనంతరం సోదరుడి కుడి చేతి మణికట్టుకు రాఖీ కట్టి, మిఠాయి తినిపించి నోరు తీపి చేయాలి. సోదరుడు తన శక్తి కొద్దీ కానుకలు లేదా బహుమతులు అందించి చెల్లి/అక్కకు ఆశీస్సులు ఇవ్వాలి.
E-Paper

