విజయవాడ : సరికొత్తగా రాయనపాడు రైల్వే స్టేషన్ - ఈ ఫొటోలపై ఓ లుక్కేయండి
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఏపీలోని రాయనపాడు రైల్వేస్టేషన్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. రూ.12.13 కోట్ల ఖర్చుతో ఈ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు చేపట్టారు.విజయవాడ రైల్వే జంక్షన్ రద్దీని తగ్గించేందుకు వీలుగా ఇక్కడ కొనసాగించారు. రైల్వే శాఖ పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలపై ఓ లుక్కేయండి…
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఏపీలోని రాయనపాడు రైల్వేస్టేషన్ ను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు. రూ.12.13 కోట్ల ఖర్చుతో ఈ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు చేపట్టారు.విజయవాడ రైల్వే జంక్షన్ రద్దీని తగ్గించేందుకు వీలుగా ఇక్కడ కొనసాగించారు.
తాజాగా ఈ రైల్వే స్టేషన్ కు సంబంధించిన కొన్ని ఫొటోలను భారతీయ రైల్వేశాఖ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఎలివేషన్ తో పాటు రంగు రంగుల పెయింటిగ్స్, నూతన టాయిలెట్స్ తో పాటు నూచ ఫ్లాట్ ఫామ్స్ ను ఏర్పాటు చేశారు.
2025 ఆఖరి కల్లా ఈ పనులను పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకూ ప్లాట్ ఫామ్ సర్ఫేసింగ్, షెల్టర్లు, వెయిటింగ్ హాల్, అధునాతన టాయిలెట్లు, లిఫ్టులు వంటి నిర్మాణాలు పూర్తి చేశారు. దాదాపుగా పనులన్నీ పూర్తయ్యాయి.
రైల్వే స్టేషన్ అభివృద్ధిలో భాగంగా విశాలవంతమైన వెయిటింగ్ హాల్ ను నిర్మించారు. ప్రయాణికుల కోసం లిఫ్ట్స్ ను ఏర్పాటు చేశారు. విజయవాడ రైల్వే జంక్షన్ రద్దీని తగ్గించేందుకు వీలుగా ఈ రాయనపాడు శాటిలైట్ రైల్వేస్టేషన్ అభివృద్ధి పనులు చేపట్టారు.
E-Paper

