Andhrapradesh : ప్రయాణికులకు సరికొత్త అనుభూతి - నయా లుక్ లో ‘కంభం’ రైల్వే స్టేషన్, ఫొటోలు

Published on Jun 28, 2026 10:04 am IST

Cumbum Railway Station in Andhrapradesh : ఆంధ్రప్రదేశ్‌లోని కంభం రైల్వే స్టేషన్ రూ.11.72 కోట్ల వ్యయంతో ఆధునిక హంగులతో పునర్నిర్మితమైంది. అత్యాధునిక మౌలిక సదుపాయాలతో పాటు స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా ఒంగోలు గిత్తల ప్రతిమలతో ఈ స్టేషన్ ఇప్పుడు ప్రయాణికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

1 / 6
<p>ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కంభం రైల్వే స్టేషన్‌ను (Cumbum Railway Station) దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) రూ.11.72 కోట్ల భారీ వ్యయంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనతో పాటు స్థానిక సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టేలా ఈ స్టేషన్ రూపురేఖలను పూర్తిగా మార్చివేశారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 28, 2026 10:04 am IST

ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కంభం రైల్వే స్టేషన్‌ను (Cumbum Railway Station) దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) రూ.11.72 కోట్ల భారీ వ్యయంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. ఆధునిక మౌలిక సదుపాయాల కల్పనతో పాటు స్థానిక సాంస్కృతిక వైభవానికి అద్దం పట్టేలా ఈ స్టేషన్ రూపురేఖలను పూర్తిగా మార్చివేశారు.

2 / 6
<p>పునర్నిర్మాణంలో భాగంగా రైల్వే స్టేషన్ ప్రధాన భవనాన్ని, దాని ముందు భాగాన్ని (Facade) ఎంతో ఆకర్షణీయంగా మార్చారు. ప్రయాణికుల రాకపోకలకు వీలుగా సర్క్యులేటింగ్ ఏరియాను విస్తరించడంతో పాటు విశాలమైన పార్కింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. </p><h3> </h3> expand-icon View Photos in a new improved layout
Published on Jun 28, 2026 10:04 am IST

పునర్నిర్మాణంలో భాగంగా రైల్వే స్టేషన్ ప్రధాన భవనాన్ని, దాని ముందు భాగాన్ని (Facade) ఎంతో ఆకర్షణీయంగా మార్చారు. ప్రయాణికుల రాకపోకలకు వీలుగా సర్క్యులేటింగ్ ఏరియాను విస్తరించడంతో పాటు విశాలమైన పార్కింగ్ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు.

3 / 6
<p>రైళ్ల కోసం వేచి ఉండే ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక వెయిటింగ్ హాళ్లు, ఒక ప్లాట్‌ఫారమ్ నుండి మరో ప్లాట్‌ఫారమ్‌కు సులభంగా వెళ్లేందుకు వీలుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (FOB), వృద్ధులు మరియు దివ్యాంగుల కోసం లిఫ్టుల సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు రైల్వే ప్లాట్‌ఫారమ్‌లను మరింత పొడిగించి, వాటి ఉపరితలాన్ని (Surface) ప్రయాణికులకు అనుకూలంగా ఆధునికీకరించారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 28, 2026 10:04 am IST

రైళ్ల కోసం వేచి ఉండే ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక వెయిటింగ్ హాళ్లు, ఒక ప్లాట్‌ఫారమ్ నుండి మరో ప్లాట్‌ఫారమ్‌కు సులభంగా వెళ్లేందుకు వీలుగా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ (FOB), వృద్ధులు మరియు దివ్యాంగుల కోసం లిఫ్టుల సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. వీటితో పాటు రైల్వే ప్లాట్‌ఫారమ్‌లను మరింత పొడిగించి, వాటి ఉపరితలాన్ని (Surface) ప్రయాణికులకు అనుకూలంగా ఆధునికీకరించారు.

4 / 6
<p>ఈ ఆధునికీకరణలో అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలిచింది స్టేషన్ ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఒంగోలు జాతి ఎద్దుల ప్రతిమలు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, ప్రకాశం జిల్లా గర్వకారణమైన రెండు ఒంగోలు జాతి ఎద్దుల నిలువెత్తు విగ్రహాలను స్టేషన్ ఎదుట అత్యంత కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఇవి చూసేందుకు అచ్చం నిజమైన ఎద్దుల్లాగే భ్రమింపజేస్తూ, రాజసం ఉట్టిపడేలా కనిపిస్తున్నాయి.</p><p> </p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 28, 2026 10:04 am IST

ఈ ఆధునికీకరణలో అత్యంత ప్రధాన ఆకర్షణగా నిలిచింది స్టేషన్ ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఒంగోలు జాతి ఎద్దుల ప్రతిమలు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన, ప్రకాశం జిల్లా గర్వకారణమైన రెండు ఒంగోలు జాతి ఎద్దుల నిలువెత్తు విగ్రహాలను స్టేషన్ ఎదుట అత్యంత కళాత్మకంగా తీర్చిదిద్దారు. ఇవి చూసేందుకు అచ్చం నిజమైన ఎద్దుల్లాగే భ్రమింపజేస్తూ, రాజసం ఉట్టిపడేలా కనిపిస్తున్నాయి.

5 / 6
<p>కంభం మరియు దాని పరిసర ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులు ఎక్కువగా ఉంటారని, అందుకే ఈ ప్రాంత ప్రాధాన్యతను, రైతుల శ్రమను గౌరవిస్తూ ఈ ఒంగోలు గిత్తల ప్రతిమలను ప్రత్యేకంగా రూపొందించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. </p><h2> </h2> expand-icon View Photos in a new improved layout
Published on Jun 28, 2026 10:04 am IST

కంభం మరియు దాని పరిసర ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడి జీవించే రైతులు ఎక్కువగా ఉంటారని, అందుకే ఈ ప్రాంత ప్రాధాన్యతను, రైతుల శ్రమను గౌరవిస్తూ ఈ ఒంగోలు గిత్తల ప్రతిమలను ప్రత్యేకంగా రూపొందించినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

6 / 6
<p>రాత్రి వేళల్లో సరికొత్త విద్యుద్దీపాల అలంకరణతో (Lighting) ఈ రైల్వే స్టేషన్ సరికొత్త కాంతులీనుతూ, ప్రయాణికులకు కనువిందు చేస్తోంది. ఈ ఆధునిక మార్పుల పట్ల స్థానిక ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jun 28, 2026 10:04 am IST

రాత్రి వేళల్లో సరికొత్త విద్యుద్దీపాల అలంకరణతో (Lighting) ఈ రైల్వే స్టేషన్ సరికొత్త కాంతులీనుతూ, ప్రయాణికులకు కనువిందు చేస్తోంది. ఈ ఆధునిక మార్పుల పట్ల స్థానిక ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!