ఇదేం కెప్టెన్సీ.. ప్లాన్ లేదా? కెప్టెన్గా పంత్ డెబ్యూ-దక్షిణాఫ్రికాతో టెస్టు- నిర్ణయాలపై విమర్శలు- సఫారీ టీమ్ స్కోరు
భారత రెగ్యులర్ టెస్టు కెప్టెన్ శుభ్ మన్ గిల్ మెడ గాయం కారణంగా దూరమవడంతో పంత్ సారథిగా డెబ్యూ చేశాడు. కానీ దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు ఫస్ట్ రోజు అతని నిర్ణయాలపై విమర్శలు వస్తున్నాయి. సఫారీ టీమ్ ను భారత్ తొలి రోజు ఆలౌట్ చేయలేకపోయింది.
భారత టెస్టు కెప్టెన్ గా రిషబ్ పంత్ డెబ్యూ చేశాడు. శుభ్ మన్ గిల్ గాయంతో దక్షిణాఫ్రికాతో రెండో టెస్టుకు దూరమయ్యాడు. ఈ మ్యాచ్ కు పంత్ నాయకుడిగా వ్యవహరించాడు. కానీ అతని నిర్ణయాలకు విమర్శలు తప్పలేదు.
(AFP)
శనివారం (నవంబర్ 22) ఇండియా, సౌతాఫ్రికా మధ్య రెండో టెస్టు స్టార్ట్ అయింది. ఇందులో టాస్ గెలిచిన సౌతాఫ్రికా ఫస్ట్ బ్యాటింగ్ కు దిగింది. ఆ టీమ్ 6 వికెట్లకు 247 పరుగులతో ఫస్ట్ డే ఆటను ముగించింది.
(Pitamber Newar)
సఫారీతో రెండో టెస్టు ఫస్ట్ రోజు ఆటలో భారత బౌలర్లలో కుల్ దీప్ యాదవ్ 3 వికెట్లతో సత్తాచాటాడు. బుమ్రా, సిరాజ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ తీసుకున్నారు.
(PTI)
ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా ఫస్ట్ ఇన్నింగ్స్ లో ట్రిస్టన్ స్టబ్స్ టాప్ స్కోరర్. అతను 49 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ బవుమా 41, ఐడెన్ మార్ క్రమ్ 38, ర్యాకిల్టన్ 35 రన్స్ చొప్పున చేశారు.
(AFP)
ఫస్ట్ డే ఆటలో పంత్ కెప్టెన్సీపై విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా ఫీల్డింగ్ ప్లేస్ మెంట్స్ పై మాజీ ఆటగాళ్లు అనిల్ కుంబ్లే, ఆకాశ్ చోప్రా పంత్ పై విమర్శలు గుప్పించారు. పంత్ కు ప్లాన్ లేనట్లు ఉందని అన్నారు. ఆధునిక టెస్టు కెప్టెన్సీ గురించి పంత్ తెలుసుకోవాలని చురకలు అంటించారు.
(PTI)
E-Paper

