Godavari Express : 52 ఏళ్లుగా అత్యుత్తమ సేవలు - 'గోదావరి ఎక్స్ప్రెస్'కు అరుదైన అవార్డు
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గోదావరి ఎక్స్ ప్రెస్ 52 ఏళ్లుగా రాకపోకలు సాగిస్తోంది.హైదరాబాద్ -విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలుకు ఎంతో డిమాండ్ ఉంటుంది. అయితే మెయింటెనెన్స్, రాకపోకల సమయాల నిబద్ధత వంటి అంశాల్లో అత్యుత్తమంగా నిర్వహిస్తున్న ఈ ట్రైన్ కు దక్షిణ మధ్య రైల్వే అవార్డు ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు గోదావరి ఎక్స్ ప్రెస్ 52 ఏళ్లుగా రాకపోకలు సాగిస్తోంది.హైదరాబాద్ -విశాఖపట్నం మధ్య నడిచే ఈ రైలుకు ఎంతో డిమాండ్ ఉంటుంది.
1974లో ప్రారంభమైనప్పటి నుంచి ఈ రైలు తరాలుగా ప్రయాణికుల మనసులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ‘నిజానికి ఈ ట్రైన్ అంటేనే తెలుగు ప్రజలకు ఓ గొప్ప ఎమోషన్ అని చెప్పొచ్చు.
హైదరాబాద్ - విశాఖపట్నం మధ్య 52 ఏళ్లుగా నిరంతరం సేవలందిస్తున్న గోదావరి ఎక్స్ప్రెస్ తాజాగా మరో అరుదైన గౌరవాన్ని అందుకుంది. 2025 సంవత్సరానికి బెస్ట్ మెయింటేన్డ్ ట్రైన్ అవార్డుకు ఎంపికైనట్లు సౌత్ సెంట్రల్ రైల్వే (SCR) అధికారికంగా ప్రకటించింది.
“ఇదొక ట్రైన్ మాత్రం కాదు ఓ గొప్ప ఎమోషన్. ఎన్నో జ్ఞాపకాలు సొంతం చేసుకుంది” అంటూ దక్షిణ మధ్య రైల్వే ట్వీట్ చేసింది. కొన్ని ఫొటోలను కూడా జత చేసింది.1974 వ సంవత్సరంలో ఫిబ్రవరి 1వ తేదీన స్టీమ్ ఇంజన్తో మొదటిాసారిగా గోదావరి ఎక్స్ ప్రెస్ పట్టాలు ఎక్కింది.ప్రస్తుతం గోదావరి ఎక్స్ ప్రెస్ 12727, 12728 ట్రైన్ నంబర్లతో విశాఖ పట్నం – సికింద్రాబాద్ మద్య రాకపోకలు సాగిస్తోంది.
E-Paper

