ఫొటోలు : ఇక సరికొత్తగా 'మలక్పేట్' రైల్వే స్టేషన్ - 2026లో ఇలా మారబోతుంది..!
అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద.. హైదరాబాద్ సిటీలోని మలక్ పేట రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయనున్నారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటన విడుదల చేసింది. 2026 జూన్ నాటికి పనులు పూర్తి చేసేలా కార్యాచరణను రూపొందినట్లు తెలిపింది.
'అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని మలక్ పేట రైల్వే స్టేషన్ను అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక వివరాలను దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
26.6 కోట్ల ప్రాజెక్ట్ వ్యయంతో మలక్ పేట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను పూర్తి చేస్తారు. త్వరలో అభివృద్ధి చేయనున్న మలక్ పేట రైల్ే స్టేషన్ ప్రతిపాదిత డిజైన్ లను కూడా సౌత్ సెంట్రల్ రైల్వే విడుదల చేసింది.
మలక్ పేట రైల్వే స్టేషన్ అభివృద్ధి పనులను వచ్చే ఏడాది అంటే 2026 జూన్ నాటికి పూర్తి చేస్తామని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. డిజైన్లకు అనుగుణంగా ప్రస్తుతం కొన్ని పనులు కూడా కొనసాగుతున్నాయి.
రైల్వే శాఖ తీసుకొచ్చిన అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద…. స్టేషన్ ఆవరణ ప్రాంత అభివృద్ధి, పార్కింగ్ షెడ్ల ఏర్పాటు/స్థల మార్పిడి వంటివి చేస్తారు.ప్రవేశ ద్వారాల ఏర్పాటు, రెండు ప్రవేశాలలో స్టేషన్ ముఖభాగానికి మెరుగుదలలు, పుట్ ఓవర్ బ్రిడ్జి.
ప్లాట్ఫారమ్లపై పై కప్పు ఏర్పాటు, ఎస్కలేటర్లు, లిఫ్టులను అందుబాటులో ఉంచారు.
స్టేషన్ ముఖభాగం లైటింగ్ తో పాటు రైళ్లకు సంబందించిన సమాచార బోర్డులను ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే తెలంగాణలో పలు రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. మరికొన్నిచోట్ల కొనసాగుతున్నాయి.
E-Paper

