సర్వీస్‌లో ఉన్న టీచర్లకూ ‘టెట్’ తప్పనిసరి - ఏ క్షణమైనా నోటిఫికేషన్..!

By , Andhrapradesh
Published on Oct 22, 2025 01:36 pm IST

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో సర్వీస్ లో ఉన్న టీచర్లు తప్పనిసరిగా టెట్ పాస్ కావాల్సి ఉంది. దీంతో నోటిఫికేషన్ ఇచ్చేందుకు ఏపీ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఏ క్షణంలోనైనా నోటిఫికేషన్ ను విడుదల చేసే అవకాశం ఉంది.

1 / 5
<p>సర్వీసులో ఉన్న టీచర్లు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఎన్‌సిటిఇ కూడా స్పష్టం చేసింది. దీంతో సర్వీస్ లో ఉన్న టీచర్లు తప్పకుండా టెట్ రాసి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 22, 2025 01:36 pm IST

సర్వీసులో ఉన్న టీచర్లు ఉద్యోగంలో కొనసాగాలంటే టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1న తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఎన్‌సిటిఇ కూడా స్పష్టం చేసింది. దీంతో సర్వీస్ లో ఉన్న టీచర్లు తప్పకుండా టెట్ రాసి ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది.

2 / 5
<p>సుప్రీం తీర్పు ప్రకారం ఐదేళ్లలో పదవీ విరమణ చేయబోయేవారికి మాత్రమే టెట్ అవసరం లేదు. అయితే వారు పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ పాస్ కావాల్సి ఉంటుంది. టెట్ పరీక్షను 2010 నుంచి నిర్వహిస్తూ వస్తున్నారు. 2010 తర్వాత నియామకమైన ఉపాధ్యాయులందరూ టెట్ ఉత్తీర్ణత సాధించి ఉన్నారు. అంతకుముందు నియమితులై సర్వీసులో కొనసాగుతున్న వారిలో కొందరు మాత్రమే టెట్ ఉత్తీర్ణత సాధించగా, మరికొందరు టెట్ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 22, 2025 01:36 pm IST

సుప్రీం తీర్పు ప్రకారం ఐదేళ్లలో పదవీ విరమణ చేయబోయేవారికి మాత్రమే టెట్ అవసరం లేదు. అయితే వారు పదోన్నతి పొందాలంటే మాత్రం టెట్ పాస్ కావాల్సి ఉంటుంది. టెట్ పరీక్షను 2010 నుంచి నిర్వహిస్తూ వస్తున్నారు. 2010 తర్వాత నియామకమైన ఉపాధ్యాయులందరూ టెట్ ఉత్తీర్ణత సాధించి ఉన్నారు. అంతకుముందు నియమితులై సర్వీసులో కొనసాగుతున్న వారిలో కొందరు మాత్రమే టెట్ ఉత్తీర్ణత సాధించగా, మరికొందరు టెట్ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంది.

3 / 5
<p>సుప్రీంకోర్టు తీర్పుపై ఇప్పటికే కొన్ని ఉపాధ్యాయ సంఘాలు రివ్యూ పిటిషన్లు వేశాయి. ఈ తీర్పు కోసం వేచి ఉండేవారికీ వెసులుబాటు కల్పిస్తారు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ షెడ్యూల్‌ను విడుదల చేయనుంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 22, 2025 01:36 pm IST

సుప్రీంకోర్టు తీర్పుపై ఇప్పటికే కొన్ని ఉపాధ్యాయ సంఘాలు రివ్యూ పిటిషన్లు వేశాయి. ఈ తీర్పు కోసం వేచి ఉండేవారికీ వెసులుబాటు కల్పిస్తారు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్‌ షెడ్యూల్‌ను విడుదల చేయనుంది.

4 / 5
<p>ఈ రెండు మూడు రోజుల్లో టీచర్ల కోసం టెట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇందుకోసం ఏపీ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఏ క్షణమైనా నోటిఫికేషన్ రావొచ్చు.</p><p> </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 22, 2025 01:36 pm IST

ఈ రెండు మూడు రోజుల్లో టీచర్ల కోసం టెట్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.ఇందుకోసం ఏపీ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఏ క్షణమైనా నోటిఫికేషన్ రావొచ్చు.

5 / 5
<p>సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు విద్యార్హతల్లో కనీస మార్కులు ఉండాలనే దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. దీనిపై నోటిఫికేషన్ లో క్లారిటీ ఇస్తారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 22, 2025 01:36 pm IST

సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు విద్యార్హతల్లో కనీస మార్కులు ఉండాలనే దానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. దీనిపై నోటిఫికేషన్ లో క్లారిటీ ఇస్తారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!