స్పిన్ వలలో చిక్కి-ఇండియాకు దిమ్మతిరిగే షాక్-124 రన్స్ చేయలేక దారుణ పరాజయం-బ్యాటింగ్కు రాని కెప్టెన్ శుభ్మన్
సొంతగడ్డపై టీమిండియాకు దిమ్మతిరిగే షాక్ తగిలింది. అలవోకగా గెలుస్తుందనుకున్న మ్యాచ్ లో బొక్కబోర్లా పడింది. ప్రపంచ ఛాంపియన్ సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయింది భారత్.
1 / 7
Published on Nov 16, 2025 02:49 pm IST
కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్లో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్ మూడో రోజు దక్షిణాఫ్రికా భారత్ను 30 పరుగుల తేడాతో ఓడించింది.
(PTI)
2 / 7
Published on Nov 16, 2025 02:49 pm IST
124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, 35 ఓవర్లలో 93/9 వద్ద కుప్పకూలింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ గాయపడటంతో బ్యాటింగ్ కు రాలేదు.
(AP)
3 / 7
Published on Nov 16, 2025 02:49 pm IST
మొదటి ఇన్నింగ్స్లో నాలుగు వికెట్లు తీసిన సైమన్ హార్మర్.. రెండో ఇన్నింగ్స్లో మరో నాలుగు వికెట్లు తీసి మొత్తం ఎనిమిది వికెట్లతో చెలరేగాడు.
(AP)
4 / 7
Published on Nov 16, 2025 02:49 pm IST
లంచ్ తర్వాత జరిగిన ఆటలో హార్మర్ భారత బ్యాటింగ్ ఆర్డర్ను పూర్తిగా దెబ్బతీశాడు. ధ్రువ్ జురెల్ (13), రిషబ్ పంత్ (2), రవీంద్ర జడేజా (18), కుల్దీప్ యాదవ్ (1)లను ఔట్ చేశాడు.(AP)
5 / 7
Published on Nov 16, 2025 02:49 pm IST
వాషింగ్టన్ సుందర్ భారత ఇన్నింగ్స్ను నిలబెట్టడానికి ప్రయత్నించినా.. 92 బంతుల్లో 31 పరుగులు చేసి ఔటయ్యాడు.
(PTI)
6 / 7
Published on Nov 16, 2025 02:49 pm IST
అదే సమయంలో అక్షర్ పటేల్ 17 బంతుల్లో 26 పరుగులు చేశాడు.
(PTI)
7 / 7
Published on Nov 16, 2025 02:49 pm IST
మొదటి సెషన్లో టెంబా బవుమా 136 బంతుల్లో 55* పరుగులతో అజేయంగా నిలిచి, దక్షిణాఫ్రికాను 153 పరుగులకు చేర్చాడు.
(Sudipta Banerjee )
E-Paper

