In Pics : భద్రాచలంలో వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం.. అద్భుతమైన వేడుక ఫోటోలు ఇవే!

Published on Mar 27, 2026 01:51 pm IST

Sri Rama Navami 2026 : భద్రాచలలో వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇక్కడ చూడండి.

1 / 6
<p>భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్పించారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Mar 27, 2026 01:51 pm IST

భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్పించారు.

2 / 6
<p>ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Mar 27, 2026 01:51 pm IST

ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

3 / 6
<p>మిథిలా స్టేడియంలోని మండపంలో వేద మంత్రోచ్ఛరణల నడుమ సీతారాముల కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Mar 27, 2026 01:51 pm IST

మిథిలా స్టేడియంలోని మండపంలో వేద మంత్రోచ్ఛరణల నడుమ సీతారాముల కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.

4 / 6
<p>మెుదట శ్రీ సీతారాములను పల్లకిలో ఊరేగింపుగా మండపానికి తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు రాములవారి కళ్యాణ ఘట్టం ప్రారంభమైంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Mar 27, 2026 01:51 pm IST

మెుదట శ్రీ సీతారాములను పల్లకిలో ఊరేగింపుగా మండపానికి తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు రాములవారి కళ్యాణ ఘట్టం ప్రారంభమైంది.

5 / 6
<p>అభిజిత్ లగ్నంలో సీతారాముల శిరస్సుపై జీలకర్ర, బెల్లం పెట్టే ఘట్టం పూర్తైంది. ఆ తర్వాత సీతమ్మ మెడలో రాములవారు మాంగళ్యధారణ చేశారు. ఆ తర్వాత తలంబ్రాల వేడుక నిర్వహించారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Mar 27, 2026 01:51 pm IST

అభిజిత్ లగ్నంలో సీతారాముల శిరస్సుపై జీలకర్ర, బెల్లం పెట్టే ఘట్టం పూర్తైంది. ఆ తర్వాత సీతమ్మ మెడలో రాములవారు మాంగళ్యధారణ చేశారు. ఆ తర్వాత తలంబ్రాల వేడుక నిర్వహించారు.

6 / 6
<p>శ్రీసీతారాముల కళ్యాణం చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండ పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. శ్రీరామ నామస్మరణతో మిథిలా స్టేడియం ప్రాంగణం మార్గోగింది. సీతారాముల కళ్యాణం సందర్భంగా భద్రాచలం రాములవారి ఆలయంతోపాటుగా మిథిలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Mar 27, 2026 01:51 pm IST

శ్రీసీతారాముల కళ్యాణం చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండ పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. శ్రీరామ నామస్మరణతో మిథిలా స్టేడియం ప్రాంగణం మార్గోగింది. సీతారాముల కళ్యాణం సందర్భంగా భద్రాచలం రాములవారి ఆలయంతోపాటుగా మిథిలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!