In Pics : భద్రాచలంలో వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం.. అద్భుతమైన వేడుక ఫోటోలు ఇవే!
Sri Rama Navami 2026 : భద్రాచలలో వైభవంగా సీతారాముల కళ్యాణోత్సవం జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు ఇక్కడ చూడండి.
భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండువగా సాగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్పించారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
మిథిలా స్టేడియంలోని మండపంలో వేద మంత్రోచ్ఛరణల నడుమ సీతారాముల కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు.
మెుదట శ్రీ సీతారాములను పల్లకిలో ఊరేగింపుగా మండపానికి తీసుకొచ్చారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు రాములవారి కళ్యాణ ఘట్టం ప్రారంభమైంది.
అభిజిత్ లగ్నంలో సీతారాముల శిరస్సుపై జీలకర్ర, బెల్లం పెట్టే ఘట్టం పూర్తైంది. ఆ తర్వాత సీతమ్మ మెడలో రాములవారు మాంగళ్యధారణ చేశారు. ఆ తర్వాత తలంబ్రాల వేడుక నిర్వహించారు.
శ్రీసీతారాముల కళ్యాణం చూసేందుకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండ పలు రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. శ్రీరామ నామస్మరణతో మిథిలా స్టేడియం ప్రాంగణం మార్గోగింది. సీతారాముల కళ్యాణం సందర్భంగా భద్రాచలం రాములవారి ఆలయంతోపాటుగా మిథిలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు.
E-Paper

