రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తున్న స్మృతి మంధాన.. ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన స్టార్ బ్యాటర్

By Hari Prasad S, Hyderabad
Published on Oct 13, 2025 03:09 pm IST

మహిళల వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయినా.. స్మృతి మంధాన మాత్రం చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్ లో ఆమె 80 పరుగులు చేసి ఈ ఏడాది వన్డేల్లో 1000 పరుగుల మైలురాయిని దాటేసింది.

1 / 6
<p>ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో స్మృతి మంధాన 80 పరుగులు చేసి ఇండియన్ టీమ్ తరఫున టాప్ స్కోరర్ గా నిలిచిన విషయం తెలిసిందే.</p>(AP) expand-icon View Photos in a new improved layout
Published on Oct 13, 2025 03:09 pm IST

ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో స్మృతి మంధాన 80 పరుగులు చేసి ఇండియన్ టీమ్ తరఫున టాప్ స్కోరర్ గా నిలిచిన విషయం తెలిసిందే.

(AP)

2 / 6
<p>ఒక క్యాలెండర్ ఏడాదిలో వన్డేల్లో 1000 పరుగులు చేసిన తొలి మహిళా బ్యాటర్ గా స్మృతి మంధాన నిలిచింది. ఆదివారం ఆస్ట్రేలియాతో 17 పరుగుల దగ్గర ఈ ఘనత సాధించింది. అంతకుముందు ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక వన్డే పరుగులు చేసిన రికార్డు బెలిండా క్లార్క్ వద్ద ఉంది. 1997లో 970 రన్స్ చేసింది.</p>(AFP) expand-icon View Photos in a new improved layout
Published on Oct 13, 2025 03:09 pm IST

ఒక క్యాలెండర్ ఏడాదిలో వన్డేల్లో 1000 పరుగులు చేసిన తొలి మహిళా బ్యాటర్ గా స్మృతి మంధాన నిలిచింది. ఆదివారం ఆస్ట్రేలియాతో 17 పరుగుల దగ్గర ఈ ఘనత సాధించింది. అంతకుముందు ఒక క్యాలెండర్ సంవత్సరంలో అత్యధిక వన్డే పరుగులు చేసిన రికార్డు బెలిండా క్లార్క్ వద్ద ఉంది. 1997లో 970 రన్స్ చేసింది.

(AFP)

3 / 6
<p>మహిళల వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్ లో 5000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్ గానూ రికార్డు సృష్టించింది. కేవలం 112 ఇన్నింగ్స్ ల్లోనే ఈ రికార్డును సాధించింది. ఈ విషయంలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ స్టెఫానీ టేలర్ ను వెనక్కి నెట్టింది. టేలర్ 129 ఇన్నింగ్స్ ల్లో 5000 వన్డే పరుగులు పూర్తి చేసింది.</p>(PTI ) expand-icon View Photos in a new improved layout
Published on Oct 13, 2025 03:09 pm IST

మహిళల వన్డేల్లో అతి తక్కువ ఇన్నింగ్స్ లో 5000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్ గానూ రికార్డు సృష్టించింది. కేవలం 112 ఇన్నింగ్స్ ల్లోనే ఈ రికార్డును సాధించింది. ఈ విషయంలో వెస్టిండీస్ ఆల్ రౌండర్ స్టెఫానీ టేలర్ ను వెనక్కి నెట్టింది. టేలర్ 129 ఇన్నింగ్స్ ల్లో 5000 వన్డే పరుగులు పూర్తి చేసింది.

(PTI )

4 / 6
<p>విరాట్ కోహ్లిని కూడా స్మృతి వెనక్కి నెట్టడం విశేషం. కోహ్లి 114 ఇన్నింగ్స్ లో 5 వేల పరుగులు చేయగా.. స్మృతి మాత్రం 112 ఇన్నింగ్స్ లోనే చేసింది.</p>(PTI ) expand-icon View Photos in a new improved layout
Published on Oct 13, 2025 03:09 pm IST

విరాట్ కోహ్లిని కూడా స్మృతి వెనక్కి నెట్టడం విశేషం. కోహ్లి 114 ఇన్నింగ్స్ లో 5 వేల పరుగులు చేయగా.. స్మృతి మాత్రం 112 ఇన్నింగ్స్ లోనే చేసింది.

(PTI )

5 / 6
<p>మహిళల వన్డేల్లో 5 వేల పరుగులు చేసిన ఐదో బ్యాటర్ స్మృతి మంధాన. గతంలో మిథాలీ రాజ్, సీఎం ఎడ్వర్డ్స్, ఎస్డబ్ల్యూ బేట్స్, ఎస్ఆర్ టేలర్ ఈ ఘనత సాధించారు. మహిళా క్రికెటర్లలో అత్యధిక వన్డే పరుగులు చేసిన ప్లేయర్ మిథాలీ రాజ్ కాగా ఆమె 7805 పరుగులు చేసింది. కేవలం 29 ఏళ్ల వయసులోనే వన్డేల్లో 5000 పరుగులు చేసిన ఘనత సాధించిన స్మృతి మంధాన ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన వుమన్ క్రికెటర్ గా నిలిచింది.</p>(PTI ) expand-icon View Photos in a new improved layout
Published on Oct 13, 2025 03:09 pm IST

మహిళల వన్డేల్లో 5 వేల పరుగులు చేసిన ఐదో బ్యాటర్ స్మృతి మంధాన. గతంలో మిథాలీ రాజ్, సీఎం ఎడ్వర్డ్స్, ఎస్డబ్ల్యూ బేట్స్, ఎస్ఆర్ టేలర్ ఈ ఘనత సాధించారు. మహిళా క్రికెటర్లలో అత్యధిక వన్డే పరుగులు చేసిన ప్లేయర్ మిథాలీ రాజ్ కాగా ఆమె 7805 పరుగులు చేసింది. కేవలం 29 ఏళ్ల వయసులోనే వన్డేల్లో 5000 పరుగులు చేసిన ఘనత సాధించిన స్మృతి మంధాన ప్రపంచంలోనే అత్యంత పిన్న వయసులో ఈ ఘనత సాధించిన వుమన్ క్రికెటర్ గా నిలిచింది.

(PTI )

6 / 6
<p>ఆస్ట్రేలియా అంటనే స్మృతి చెలరేగిపోతోంది. ఆ టీమ్ తో ఆడిన చివరి ఐదు వన్డేల్లో ఆమె వరుసగా 80, 125, 117, 58, 105 పరుగులు కావడం విశేషం.</p>(PTI ) expand-icon View Photos in a new improved layout
Published on Oct 13, 2025 03:09 pm IST

ఆస్ట్రేలియా అంటనే స్మృతి చెలరేగిపోతోంది. ఆ టీమ్ తో ఆడిన చివరి ఐదు వన్డేల్లో ఆమె వరుసగా 80, 125, 117, 58, 105 పరుగులు కావడం విశేషం.

(PTI )

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    Hari Prasad S

    హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!