Southwest Monsoon Update : అండమాన్ లోకి నైరుతి రుతుపవనాలు - ఏపీలోకి ఎప్పుడు రావొచ్చంటే..?

Published on May 17, 2026 01:30 pm IST

Southwest Monsoon Updates 2026 : నైరుతి రుతుపవనాలు భారత్‌ను తాకాయి. అండమాన్ సముద్రం, బంగాళాఖాతంలోకి ప్రవేశించిన ఇవి…. మే 26 నాటికి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

1 / 6
<p>దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ రుతుపవనాలు దేశంలోకి అధికారికంగా ప్రవేశించాయి. మే 16 శనివారం నాటికే నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు విజయవంతంగా విస్తరించాయి. దీనితో పాటు నైరుతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాలు, అండమాన్ సముద్రంలోని అత్యధిక ప్రాంతాలు మరియు నికోబార్ దీవుల సమూహంలోకి ఇవి వేగంగా ముందుకు కదిలాయి.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 17, 2026 01:30 pm IST

దేశవ్యాప్తంగా ఎండ తీవ్రత, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు ఉపశమనం కలిగిస్తూ రుతుపవనాలు దేశంలోకి అధికారికంగా ప్రవేశించాయి. మే 16 శనివారం నాటికే నైరుతి రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు విజయవంతంగా విస్తరించాయి. దీనితో పాటు నైరుతి మరియు ఆగ్నేయ బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాలు, అండమాన్ సముద్రంలోని అత్యధిక ప్రాంతాలు మరియు నికోబార్ దీవుల సమూహంలోకి ఇవి వేగంగా ముందుకు కదిలాయి.

2 / 6
<p>సాధారణంగా అండమాన్ పరిసర ప్రాంతాల్లోకి మే 22వ తేదీ నాటికి రావాల్సిన రుతుపవనాలు…. ఈ ఏడాది అంతకంటే ముందే అంటే మే 16 నాటికే విస్తరించడం విశేషం. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారడం, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలలో వస్తున్న మార్పుల వల్ల రుతుపవనాల కదలికలు చురుగ్గా సాగుతున్నట్లు శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 17, 2026 01:30 pm IST

సాధారణంగా అండమాన్ పరిసర ప్రాంతాల్లోకి మే 22వ తేదీ నాటికి రావాల్సిన రుతుపవనాలు…. ఈ ఏడాది అంతకంటే ముందే అంటే మే 16 నాటికే విస్తరించడం విశేషం. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా మారడం, సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలలో వస్తున్న మార్పుల వల్ల రుతుపవనాల కదలికలు చురుగ్గా సాగుతున్నట్లు శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు.

3 / 6
<p>భారత ప్రధాన భూభాగానికి రుతుపవనాల రాకను సూచించే కేరళ ప్రవేశంపై కూడా ఐఎండీ స్పష్టతనిచ్చింది. ఈ ఏడాది మే 26వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అయితే వాతావరణ మార్పుల తీవ్రతను బట్టి దీనికి ప్లస్ లేదా మైనస్ 4 రోజులు (± 4 రోజులు) అటు ఇటుగా మార్పులు జరగొచ్చని అధికారులు స్పష్టం చేశారు. అంటే మే 22 నుంచి మే 30వ తేదీల మధ్యలో ఎప్పుడైనా రుతుపవనాలు కేరళలోకి అధికారికంగా ప్రవేశించవచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 17, 2026 01:30 pm IST

భారత ప్రధాన భూభాగానికి రుతుపవనాల రాకను సూచించే కేరళ ప్రవేశంపై కూడా ఐఎండీ స్పష్టతనిచ్చింది. ఈ ఏడాది మే 26వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అయితే వాతావరణ మార్పుల తీవ్రతను బట్టి దీనికి ప్లస్ లేదా మైనస్ 4 రోజులు (± 4 రోజులు) అటు ఇటుగా మార్పులు జరగొచ్చని అధికారులు స్పష్టం చేశారు. అంటే మే 22 నుంచి మే 30వ తేదీల మధ్యలో ఎప్పుడైనా రుతుపవనాలు కేరళలోకి అధికారికంగా ప్రవేశించవచ్చు.

4 / 6
<p>కేరళలోకి ప్రవేశించిన తర్వాత ఈ రుతుపవనాలు క్రమంగా దేశంలోని ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తాయి.రుతుపవనాలు కేరళలో ప్రవేశించిన తర్వాత.. ఏపీలోని రాయలసీమకు విస్తరిస్తాయి. ఆ తర్వాత రాష్ట్రమంతా అలాగే.. తెలంగాణకు విస్తరించి వర్షాలు కురిపిస్తాయి. ఐఎండి అంచనాన్ని బట్టి.. ప్రతిఏటా సాధారణంగా రుతుపవనాలు జూన్ 1న తాకిన తర్వాత పది రోజులకు ఏపీలోకి ప్రవేశిస్తాయని అంచనా. కానీ ఈసారి ఈ నెలాఖరు లోగానే కేరళకు తాకితే.. అప్పటి పరిస్థితులను బట్టి ఏపీలోకి ఇప్పుడు ప్రవేశిస్తుందనేది ఒక అంచనాకు రావొచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 17, 2026 01:30 pm IST

కేరళలోకి ప్రవేశించిన తర్వాత ఈ రుతుపవనాలు క్రమంగా దేశంలోని ఇతర రాష్ట్రాలకు విస్తరిస్తాయి.రుతుపవనాలు కేరళలో ప్రవేశించిన తర్వాత.. ఏపీలోని రాయలసీమకు విస్తరిస్తాయి. ఆ తర్వాత రాష్ట్రమంతా అలాగే.. తెలంగాణకు విస్తరించి వర్షాలు కురిపిస్తాయి. ఐఎండి అంచనాన్ని బట్టి.. ప్రతిఏటా సాధారణంగా రుతుపవనాలు జూన్ 1న తాకిన తర్వాత పది రోజులకు ఏపీలోకి ప్రవేశిస్తాయని అంచనా. కానీ ఈసారి ఈ నెలాఖరు లోగానే కేరళకు తాకితే.. అప్పటి పరిస్థితులను బట్టి ఏపీలోకి ఇప్పుడు ప్రవేశిస్తుందనేది ఒక అంచనాకు రావొచ్చు.

5 / 6
<p>ఏడాది రుతుపవనాలు ముందుగానే కదులుతుండటంతో… జూన్ మొదటి వారంలోనే తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 17, 2026 01:30 pm IST

ఏడాది రుతుపవనాలు ముందుగానే కదులుతుండటంతో… జూన్ మొదటి వారంలోనే తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

6 / 6
<p>దేశంలో సగానికి పైగా వ్యవసాయం ఈ నైరుతి రుతుపవనాల వర్షాలపైనే ఆధారపడి ఉండటంతో… వీటి రాక వార్త అటు అన్నదాతలకు, ఇటు ప్రభుత్వాలకు పెద్ద ఊరటనివ్వనుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 17, 2026 01:30 pm IST

దేశంలో సగానికి పైగా వ్యవసాయం ఈ నైరుతి రుతుపవనాల వర్షాలపైనే ఆధారపడి ఉండటంతో… వీటి రాక వార్త అటు అన్నదాతలకు, ఇటు ప్రభుత్వాలకు పెద్ద ఊరటనివ్వనుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!