AP Inter Spot Evaluation 2026: నేటి నుంచి ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం - ఇవిగో వివరాలు
AP Inter Spot Valuation 2026: నేటి నుంచి ఏపీ ఇంటర్ జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 25 కేంద్రాల్లో ఈ ప్రాసెస్ ఉంటుంది.ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.
నేటి నుంచి ఏపీ ఇంటర్ జవాబు పత్రాల స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 25 కేంద్రాల్లో ఈ ప్రాసెస్ ఉంటుంది.ఏప్రిల్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.
ముందుగా లాంగ్వేజెస్, మ్యాథమెటిక్స్, హిస్టరీ, మరియు ఎకనామిక్స్ పేపర్ల మూల్యాంకనం ఉండగా… వీటితో పాటు స్పెల్-1 కింద వచ్చే ఒకేషనల్ సబ్జెక్టుల పేపర్లను కూడా పూర్తి చేస్తారు. మిగతా సబ్జెక్టులను స్పెల్స్ వారీగా పూర్తి చేస్తారు.
ఇక స్పాట్ వాల్యూయేషన్ లో ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా ఏపీ ఇంటర్ బోర్డు పకడ్బందీ చర్యలు చేపట్టింది. పేపర్ వాల్యూయేషన్ తర్వాత సబ్జెక్ట్ ఎక్స్ పర్ట్ పరిశీలిస్తారు. ఆపై చీఫ్ ఎగ్జామినర్, అసిస్టెంట్ ఎగ్జామినర్, స్క్రూటినైజర్ దశలుంటాయి. ఒక్కో లెక్చరర్కు ఉదయం 15, మధ్యాహ్నం 15 జవాబు పత్రాలను మూల్యాంకనానికి ఇస్తారు.
మూల్యాంకన ప్రక్రియ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఆయా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంది. మూల్యాంకనంలో పొరపాట్లు వస్తే భారీగా జరిమానాలు ఉంటాయని ఇంటర్ బోర్డు హెచ్చరించింది.
ఏపీ ఇంటర్ ఫలితాలను ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేసే అవకాశం ఉంది. అది కూడా 10వ తేదీలోపే రిలీజ్ చేేసేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్పాట్ పూర్తి కాగానే… సాంకేతిక అంశాలను పరిశీలిస్తారు. అంతా ఒకే అయిన తర్వాత… ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతారు. సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే…. అధికారికంగా ఓ తేదీని ప్రకటిస్తారు.
గతేడాది ఏప్రిల్ 12వ తేదీన ఏపీ ఇంటర్ ఫలితాలను విడుదల చేశారు. ఈసారి కూడా ఏప్రిల్ రెండో వారంలోపే ఫలితాలను ప్రకటించే అవకాశం ఉంది.
E-Paper

