AP Ration Steam Rice : తక్కువ ధరకే నిత్యావసరాలు, త్వరలోనే 1,000 మినీ మార్టులు! రేషన్ షాపుల్లో స్టీమ్ రైస్ కూడా..!
ఏపీలో రేషన్ కార్డుదారులకు త్వరలో స్టీమ్ రైస్ పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అంతేకాకుండా ఎన్సీసీఎఫ్ సహకారంతో 1,000 మినీమార్టులను ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లోని రేషన్ వినియోగదారులకు నాణ్యమైన బియ్యం అందించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని రేషన్ దుకాణాల ద్వారా త్వరలోనే లబ్ధిదారులకు స్టీమ్ రైస్ (ఉడికించిన బియ్యం) అందించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామన పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని వివరించారు.
ఈ ఏడాది పైలట్ ప్రాజెక్టు కింద పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఈ స్టీమ్ రైస్ను సరఫరా చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.
ఈ ఏడాది పైలట్ ప్రాజెక్టు కింద పాఠశాలల్లో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకానికి కూడా ఈ స్టీమ్ రైస్ను సరఫరా చేయనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. నాణ్యమైన ఆహారాన్ని అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు.
రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన సరకులను అందుబాటు ధరల్లో అందించేందుకు జాతీయ సహకార వినియోగదారుల సమాఖ్య (NCCF) సహకారంతో త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా 1,000 మినీమార్టులను ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ మినీమార్టుల్లో కార్పొరేట్ సంస్థల సూపర్ మార్కెట్లతో పోటీపడేలా, మార్కెట్ ధరల కంటే చాలా తక్కువ ధరలకే నాణ్యమైన బియ్యం, ఇతర నిత్యావసర వస్తువులను విక్రయించేలా చర్యలు తీసుకుంటామని వివరించారు.
పేదలకు చెందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. బియ్యం మళ్లింపుపై ఉక్కుపాదం మోపుతూ ఇప్పటివరకు 5,354 కేసులు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుంటూ విజయవాడ, విశాఖపట్నం నగరాల్లో 'సీబీడీసీ' (డిజిటల్ రూపాయి) వాలెట్ విధానాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రవేశపెట్టబోతున్నామని వెల్లడించారు. దీని ద్వారా వినియోగదారులు తమకు నచ్చిన నిత్యావసర సరకులను కొనుగోలు చేసే వెసులుబాటు కలుగుతుందన్నారు.
నిల్వ ఉన్న బియ్యాన్ని కిలో రూ.23 చొప్పున ఇథనాల్ తయారీ పరిశ్రమలకు సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
E-Paper

