విశాఖపట్నం : అప్పన్న స్వామిని దర్శించుకున్న టీమిండియా క్రికెటర్లు - ఫొటోలు
విశాఖ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో టీ20 బుధవారం జరగనుంది. మ్యాచ్కు ముందు భారత క్రికెట్ జట్టు సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. ఫొటోలు ఇక్కడ చూడండి….
విశాఖ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో టీ20 బుధవారం జరగనుంది. మ్యాచ్కు ముందు భారత క్రికెట్ జట్టు సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు.
టీం ఇండియా కోచ్ గౌతమ్ గంభీర్, టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్ స్వామివారిని దర్శించుకున్నారు.
కప్పస్తంభం ఆలింగనం చేసుకొని అంతరాలయంలో స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా భారత జట్టుకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. సంప్రదాయ ప్రకారం కప్పస్తంభం ఆలింగనం చేసిన అనంతరం గర్భగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ అర్చకులు స్వామివారి విశిష్టత, ఆలయ చరిత్రను జట్టు సభ్యులకు వివరించారు. పూజ అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం అందజేయగా, స్వామివారి ప్రసాదంతో పాటు జ్ఞాపికలను ఆలయ అధికారులు భారత క్రికెట్ జట్టు సభ్యులకు అందజేశారు.
E-Paper

