భూముల రిజిస్ట్రేషన్ లో ఇకపై 'సర్వే మ్యాప్' తప్పనిసరి - ఎకరాల చొప్పున ఛార్జీలు..! ఇవిగో వివరాలు

Published on Oct 20, 2025 12:29 pm IST

తెలంగాణలోని మండలాలకు సర్వేయర్లు వచ్చేశారు. ఇకపై ఏ భూమి రిజిస్ట్రేషన్ జరగాలన్నా… సర్వే మ్యాప్ తప్పనిసరి. ఈ పనిని సర్వేయర్లు పూర్తి చేయాల్సి ఉంటుంది. అయితే ఛార్జీల వివరాలు ఎలా ఉంటాయో ఇక్కడ తెలుసుకోండి….

1 / 6
<p>తెలంగాణలోని మండలాలకు సర్వేయర్లు వచ్చేశారు. ఇకపై ఏ భూమి రిజిస్ట్రేషన్ జరగాలన్నా… సర్వే మ్యాప్ తప్పనిసరి. ఈ పనిని సర్వేయర్లు పూర్తి చేయాల్సి ఉంటుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 20, 2025 12:29 pm IST

తెలంగాణలోని మండలాలకు సర్వేయర్లు వచ్చేశారు. ఇకపై ఏ భూమి రిజిస్ట్రేషన్ జరగాలన్నా… సర్వే మ్యాప్ తప్పనిసరి. ఈ పనిని సర్వేయర్లు పూర్తి చేయాల్సి ఉంటుంది.

2 / 6
<p>భూ భారతి చట్టంలో భాగంగా ప్రతి మండలానికి సర్వేయర్లను నియమించారు. ఈ పోస్టుల కోసం ప‌దివేల మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా…. ఏడువేల మందికి శిక్ష‌ణ ఇచ్చారు. వీరిలో 3456 మంది క్షేత్ర‌స్ధాయిలో త‌ర్ఫీదు పొంది ఎంపిక‌య్యారు. వీరికి ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లైసెన్స్‌లు అంద‌జేశారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 20, 2025 12:29 pm IST

భూ భారతి చట్టంలో భాగంగా ప్రతి మండలానికి సర్వేయర్లను నియమించారు. ఈ పోస్టుల కోసం ప‌దివేల మంది ద‌ర‌ఖాస్తు చేసుకోగా…. ఏడువేల మందికి శిక్ష‌ణ ఇచ్చారు. వీరిలో 3456 మంది క్షేత్ర‌స్ధాయిలో త‌ర్ఫీదు పొంది ఎంపిక‌య్యారు. వీరికి ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా లైసెన్స్‌లు అంద‌జేశారు.

3 / 6
<p>భూ భారతి చట్టం అమల్లోకి రావటంతో… రాష్ట్రంలో భూముల నిర్వహణతో పాటు రిజిస్ట్రేషన్ల వంటి అంశాలన్నీ కూడా భూ భారతి పోర్టల్ ఆధారంగానే జరగనున్నాయి. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ వంటి ప్రక్రియలో ప్రభుత్వం పలు మార్పులను కూడా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 20, 2025 12:29 pm IST

భూ భారతి చట్టం అమల్లోకి రావటంతో… రాష్ట్రంలో భూముల నిర్వహణతో పాటు రిజిస్ట్రేషన్ల వంటి అంశాలన్నీ కూడా భూ భారతి పోర్టల్ ఆధారంగానే జరగనున్నాయి. రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ వంటి ప్రక్రియలో ప్రభుత్వం పలు మార్పులను కూడా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

4 / 6
<p>భూ భారతి చట్టం ప్రకారం… ఇకపై భూముల రిజిస్ట్రేషన్లు కావాలంటే సర్వే మ్యాప్‌ తప్పనిసరి కానుంది. సర్వే మ్యాప్ ఉంటేనే రిజిస్ట్రేషన్ జరుగుతుందని చట్టంలో పొందుపరిచారు. దీంతో సర్వేయర్ల పాత్ర కీలకంగా ఉండనుంది.భూమి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్‌కు ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరిపిస్తారు. మ్యాప్ తయారు చేస్తారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 20, 2025 12:29 pm IST

భూ భారతి చట్టం ప్రకారం… ఇకపై భూముల రిజిస్ట్రేషన్లు కావాలంటే సర్వే మ్యాప్‌ తప్పనిసరి కానుంది. సర్వే మ్యాప్ ఉంటేనే రిజిస్ట్రేషన్ జరుగుతుందని చట్టంలో పొందుపరిచారు. దీంతో సర్వేయర్ల పాత్ర కీలకంగా ఉండనుంది.భూమి రిజిస్ట్రేషన్, మ్యూటేషన్‌కు ముందు తప్పనిసరిగా భూమి సర్వే జరిపిస్తారు. మ్యాప్ తయారు చేస్తారు.

5 / 6
<p>ఈ సర్వే మ్యాప్ లో సదరు భూమి యొక్క హద్దులను వివరంగా పొందుపరుస్తారు. విక్రయించే భూమి లేదా హక్కుల మార్పిడి భూమి యొక్క విస్తీరణంతో పాటు ప్రతి అంశాన్ని ఇందులో వివరిస్తారు. మ్యాప్ ను జత చేసిన తర్వాతే… రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 20, 2025 12:29 pm IST

ఈ సర్వే మ్యాప్ లో సదరు భూమి యొక్క హద్దులను వివరంగా పొందుపరుస్తారు. విక్రయించే భూమి లేదా హక్కుల మార్పిడి భూమి యొక్క విస్తీరణంతో పాటు ప్రతి అంశాన్ని ఇందులో వివరిస్తారు. మ్యాప్ ను జత చేసిన తర్వాతే… రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.

6 / 6
<p>2 ఎకరాల విస్తీర్ణానికి సర్వే, పటం అందజేయడానికి రూ.వెయ్యి ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. 2 నుంచి 5 ఎకరాలు అయితే రూ. 2 వేలు, 5 - 10 ఎకరాలు అయితే రూ. 5 వేలు చెల్లించాలి. ఇప్పటికే లైసెన్స్‌ పత్రాలు అందజేసిన ప్రభుత్వం... త్వరలో నోటిఫికేషన్‌ తేదీని ప్రకటించనుంది. అప్పటి నుంచి భూభారతి చట్టం ప్రకారం సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియలో సర్వే మ్యాప్ జతచేయటం అమల్లోకి రానుంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Oct 20, 2025 12:29 pm IST

2 ఎకరాల విస్తీర్ణానికి సర్వే, పటం అందజేయడానికి రూ.వెయ్యి ఫీజు వసూలు చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. 2 నుంచి 5 ఎకరాలు అయితే రూ. 2 వేలు, 5 - 10 ఎకరాలు అయితే రూ. 5 వేలు చెల్లించాలి. ఇప్పటికే లైసెన్స్‌ పత్రాలు అందజేసిన ప్రభుత్వం... త్వరలో నోటిఫికేషన్‌ తేదీని ప్రకటించనుంది. అప్పటి నుంచి భూభారతి చట్టం ప్రకారం సాగు భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియలో సర్వే మ్యాప్ జతచేయటం అమల్లోకి రానుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!