In Pics : ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఫొటోలు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.
రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సదస్సును ప్రారంభించారు. సమ్మిట్లో ఒక ప్రత్యేక ఆకర్శణ ఇంటరాక్టివ్ రోబోట్, ఇది అతిథులను స్వాగతించడమే కాకుండా సమ్మిట్ లక్ష్యాలను కూడా వివరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా రోబోట్ పలకరించింది.
ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అనేక స్టాళ్లను పరిశీలించారు. సినీ నటుడు నాగార్జున ముఖ్యమంత్రితో పాటుగా ఉన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డిలతో పాటు వివిధ రంగాలకు చెందిన అనేక మంది జాతీయ, అంతర్జాతీయ అతిథులు హాజరయ్యారు.
2047 నాటికి జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతం ఉండాలని తాను కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చైనాలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన గువాంగ్-డాంగ్ ప్రావిన్స్ నమూనాను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలనుకుంటుందని అన్నారు.
2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు సీఎం రేవంత్.
తెలంగాణ ఏర్పడిన 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు భారతదేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారడానికి ప్రయత్నిస్తోందన్నారు రేవంత్ రెడ్డి. సేవలు, తయారీ, వ్యవసాయం కోసం మూడు స్పష్టమైన జోన్లుగా రాష్ట్రాన్ని విభజించామన్నారు. అవి క్యూర్, ప్యూర్, రేర్ అని చెప్పారు.
రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో ఈ సమావేశం జరుగుతోంది. ప్రారంభోత్సవానికి 44 దేశాల నుండి 154 మంది ప్రతినిధులు హాజరు అయ్యారు. విజన్ 2047 ప్రణాళిక, వ్యాపార అవకాశాలు, పెట్టుబడులకు ప్రభుత్వ మద్దతు, తెలంగాణ పాలన వ్యూహాలు, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి కీలక అంశాలను ఈ సమావేశం లక్ష్యంగా పెట్టుకుంది.
E-Paper

