In Pics : ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఫొటోలు

Published on Dec 08, 2025 05:52 pm IST

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రారంభమైంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

1 / 6
<p>రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సదస్సును ప్రారంభించారు. సమ్మిట్‌లో ఒక ప్రత్యేక ఆకర్శణ ఇంటరాక్టివ్ రోబోట్, ఇది అతిథులను స్వాగతించడమే కాకుండా సమ్మిట్ లక్ష్యాలను కూడా వివరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా రోబోట్ పలకరించింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 08, 2025 05:52 pm IST

రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సదస్సును ప్రారంభించారు. సమ్మిట్‌లో ఒక ప్రత్యేక ఆకర్శణ ఇంటరాక్టివ్ రోబోట్, ఇది అతిథులను స్వాగతించడమే కాకుండా సమ్మిట్ లక్ష్యాలను కూడా వివరించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా రోబోట్ పలకరించింది.

2 / 6
<p>ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అనేక స్టాళ్లను పరిశీలించారు. సినీ నటుడు నాగార్జున ముఖ్యమంత్రితో పాటుగా ఉన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డిలతో పాటు వివిధ రంగాలకు చెందిన అనేక మంది జాతీయ, అంతర్జాతీయ అతిథులు హాజరయ్యారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 08, 2025 05:52 pm IST

ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి అనేక స్టాళ్లను పరిశీలించారు. సినీ నటుడు నాగార్జున ముఖ్యమంత్రితో పాటుగా ఉన్నారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే.శివకుమార్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డిలతో పాటు వివిధ రంగాలకు చెందిన అనేక మంది జాతీయ, అంతర్జాతీయ అతిథులు హాజరయ్యారు.

3 / 6
<p>2047 నాటికి జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతం ఉండాలని తాను కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చైనాలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన గువాంగ్-డాంగ్ ప్రావిన్స్ నమూనాను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలనుకుంటుందని అన్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 08, 2025 05:52 pm IST

2047 నాటికి జాతీయ జీడీపీలో తెలంగాణ వాటా 10 శాతం ఉండాలని తాను కోరుకుంటున్నానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. చైనాలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన గువాంగ్-డాంగ్ ప్రావిన్స్ నమూనాను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలనుకుంటుందని అన్నారు.

4 / 6
<p>2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు సీఎం రేవంత్.</p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 08, 2025 05:52 pm IST

2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు సీఎం రేవంత్.

5 / 6
<p>తెలంగాణ ఏర్పడిన 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు భారతదేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారడానికి ప్రయత్నిస్తోందన్నారు రేవంత్ రెడ్డి. సేవలు, తయారీ, వ్యవసాయం కోసం మూడు స్పష్టమైన జోన్‌లుగా రాష్ట్రాన్ని విభజించామన్నారు. అవి క్యూర్, ప్యూర్, రేర్ అని చెప్పారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 08, 2025 05:52 pm IST

తెలంగాణ ఏర్పడిన 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు భారతదేశంలో అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మారడానికి ప్రయత్నిస్తోందన్నారు రేవంత్ రెడ్డి. సేవలు, తయారీ, వ్యవసాయం కోసం మూడు స్పష్టమైన జోన్‌లుగా రాష్ట్రాన్ని విభజించామన్నారు. అవి క్యూర్, ప్యూర్, రేర్ అని చెప్పారు.

6 / 6
<p>రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో ఈ సమావేశం జరుగుతోంది. ప్రారంభోత్సవానికి 44 దేశాల నుండి 154 మంది ప్రతినిధులు హాజరు అయ్యారు. విజన్ 2047 ప్రణాళిక, వ్యాపార అవకాశాలు, పెట్టుబడులకు ప్రభుత్వ మద్దతు, తెలంగాణ పాలన వ్యూహాలు, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి కీలక అంశాలను ఈ సమావేశం లక్ష్యంగా పెట్టుకుంది. </p> expand-icon View Photos in a new improved layout
Published on Dec 08, 2025 05:52 pm IST

రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల్లో ఈ సమావేశం జరుగుతోంది. ప్రారంభోత్సవానికి 44 దేశాల నుండి 154 మంది ప్రతినిధులు హాజరు అయ్యారు. విజన్ 2047 ప్రణాళిక, వ్యాపార అవకాశాలు, పెట్టుబడులకు ప్రభుత్వ మద్దతు, తెలంగాణ పాలన వ్యూహాలు, భారత్ ఫ్యూచర్ సిటీ వంటి కీలక అంశాలను ఈ సమావేశం లక్ష్యంగా పెట్టుకుంది.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!