Arunachalam Tour : అరుణాచలం ట్రిప్ - బడ్జెట్ ధరలోనే తెలంగాణ టూరిజం ప్యాకేజీ, జర్నీ తేదీలివే
TG Tourism Arunachalam Package : అరుణాచలం వెళ్లే భక్తుల కోసం తెలంగాణ టూరిజం ప్యాకేజీని తీసుకువచ్చింది. ఏప్రిల్ 10,17,27 తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. వివరాలపై ఓ లుక్కేయండి….
అరుణాచలేశ్వరుని భక్తులకు తెలంగాణ పర్యాటక శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. అరుణాచలానికి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వెళ్తుండగా.. వారికోసం టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం వెళ్లేవారి కోసం ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.
(image source pixel)
4 రోజులపాటు ఈ టూర్ ఉంటుంది. ప్రస్తుతం ఏప్రిల్ 10, 17, 27 తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్న వాళ్లు ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. ఆయా తేదీల్లో మీకు అనుకూలమైన తేదీలను ఎంచుకోవాలి.
(image source X)
HYDERABAD - ARUNACHALAM' పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. మొదటి రోజు సాయంత్రం 6:30 నుంచి హైదరాబాద్లోని బషీర్ బాగ్ నుంచి బస్సు బయల్దేరుతుంది. రెండో రోజు ఉదయం నేరుగా కాణిపాకం చేరుకుంటారు. ఉదయం 9 గంటలలోపు వినాయకున్ని దర్శనం పూర్తవుతుంది. అనంతరం.. తిరువనమలైకి వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అరుణాచలం చేరుకుంటారు. అక్కడ స్వామి వారిని దర్శించుకుంటారు. రాత్రికి అరుణాచలంలోనే బస చేస్తారు.
3వ రోజు టిఫిన్ తర్వాతా వేలూరుకు బయలుదేరతారు. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ సందర్శించి.. సాయంత్రం 4 గంటల తర్వాత తిరిగి హైదరాబాద్ బయల్దేరుతారు. నాలుగో రోజు ఉదయం 5 గంటలకు మళ్లీ హైదరాబాద్ చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.
ఈ ప్యాకేజీలో వెళ్లే వారికి ఒక్కొక్కరికీ.. పెద్దవాళ్లయితే రూ. 8000, పిల్లలైతే రూ. 6400చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీని పొందేందుకు తెలంగాణ టూరిజం అధికారిక వెబ్సైట్ https://tourism.telangana.gov.in/ లోకి వెళ్లి టికెట్లు బుకింగ్ చేసుకోవాలి.
ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్ను కూడా సంప్రదించవచ్చు. లేదా.. info@tstdc.in మెయిల్ ద్వారా సంప్రదించే అవకాశం ఉంది.
E-Paper

