Arunachalam Tour : అరుణాచలం ట్రిప్ - బడ్జెట్ ధరలోనే తెలంగాణ టూరిజం ప్యాకేజీ, జర్నీ తేదీలివే

Published on Apr 04, 2026 02:12 pm IST

TG Tourism Arunachalam Package : అరుణాచలం వెళ్లే భక్తుల కోసం తెలంగాణ టూరిజం ప్యాకేజీని తీసుకువచ్చింది. ఏప్రిల్ 10,17,27 తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. వివరాలపై ఓ లుక్కేయండి….

1 / 6
<p>అరుణాచలేశ్వరుని భక్తులకు తెలంగాణ పర్యాటక శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. అరుణాచలానికి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వెళ్తుండగా.. వారికోసం టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం వెళ్లేవారి కోసం ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.</p>(image source pixel) expand-icon View Photos in a new improved layout
Published on Apr 04, 2026 02:12 pm IST

అరుణాచలేశ్వరుని భక్తులకు తెలంగాణ పర్యాటక శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. అరుణాచలానికి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వెళ్తుండగా.. వారికోసం టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలం వెళ్లేవారి కోసం ఈ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది.

(image source pixel)

2 / 6
<p>4 రోజులపాటు ఈ టూర్ ఉంటుంది. ప్రస్తుతం ఏప్రిల్ 10, 17, 27 తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్న వాళ్లు ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. ఆయా తేదీల్లో మీకు అనుకూలమైన తేదీలను ఎంచుకోవాలి. </p>(image source X) expand-icon View Photos in a new improved layout
Published on Apr 04, 2026 02:12 pm IST

4 రోజులపాటు ఈ టూర్ ఉంటుంది. ప్రస్తుతం ఏప్రిల్ 10, 17, 27 తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఆసక్తి ఉన్న వాళ్లు ముందుగానే టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. ఆయా తేదీల్లో మీకు అనుకూలమైన తేదీలను ఎంచుకోవాలి.

(image source X)

3 / 6
<p> HYDERABAD - ARUNACHALAM' పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. మొదటి రోజు సాయంత్రం 6:30 నుంచి హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ నుంచి బస్సు బయల్దేరుతుంది. రెండో రోజు ఉదయం నేరుగా కాణిపాకం చేరుకుంటారు. ఉదయం 9 గంటలలోపు వినాయకున్ని దర్శనం పూర్తవుతుంది. అనంతరం.. తిరువనమలైకి వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అరుణాచలం చేరుకుంటారు. అక్కడ స్వామి వారిని దర్శించుకుంటారు. రాత్రికి అరుణాచలంలోనే బస చేస్తారు. </p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 04, 2026 02:12 pm IST

HYDERABAD - ARUNACHALAM' పేరుతో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. మొదటి రోజు సాయంత్రం 6:30 నుంచి హైదరాబాద్‌లోని బషీర్ బాగ్ నుంచి బస్సు బయల్దేరుతుంది. రెండో రోజు ఉదయం నేరుగా కాణిపాకం చేరుకుంటారు. ఉదయం 9 గంటలలోపు వినాయకున్ని దర్శనం పూర్తవుతుంది. అనంతరం.. తిరువనమలైకి వెళ్తారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో అరుణాచలం చేరుకుంటారు. అక్కడ స్వామి వారిని దర్శించుకుంటారు. రాత్రికి అరుణాచలంలోనే బస చేస్తారు.

4 / 6
<p>3వ రోజు టిఫిన్ తర్వాతా వేలూరుకు బయలుదేరతారు. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ సందర్శించి.. సాయంత్రం 4 గంటల తర్వాత తిరిగి హైదరాబాద్ బయల్దేరుతారు. నాలుగో రోజు ఉదయం 5 గంటలకు మళ్లీ హైదరాబాద్ చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 04, 2026 02:12 pm IST

3వ రోజు టిఫిన్ తర్వాతా వేలూరుకు బయలుదేరతారు. శ్రీపురం గోల్డెన్ టెంపుల్ సందర్శించి.. సాయంత్రం 4 గంటల తర్వాత తిరిగి హైదరాబాద్ బయల్దేరుతారు. నాలుగో రోజు ఉదయం 5 గంటలకు మళ్లీ హైదరాబాద్ చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

5 / 6
<p>ఈ ప్యాకేజీలో వెళ్లే వారికి ఒక్కొక్కరికీ.. పెద్దవాళ్లయితే రూ. 8000, పిల్లలైతే రూ. 6400చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీని పొందేందుకు తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్ <a href="https://tourism.telangana.gov.in/home" target="_blank">https://tourism.telangana.gov.in/ </a>లోకి వెళ్లి టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. </p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 04, 2026 02:12 pm IST

ఈ ప్యాకేజీలో వెళ్లే వారికి ఒక్కొక్కరికీ.. పెద్దవాళ్లయితే రూ. 8000, పిల్లలైతే రూ. 6400చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీని పొందేందుకు తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్ https://tourism.telangana.gov.in/ లోకి వెళ్లి టికెట్లు బుకింగ్ చేసుకోవాలి.

6 / 6
<p>ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్‌ను కూడా సంప్రదించవచ్చు. లేదా.. info@tstdc.in మెయిల్ ద్వారా సంప్రదించే అవకాశం ఉంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Apr 04, 2026 02:12 pm IST

ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా సందేహాలు ఉంటే 9848540371 ఫోన్ నెంబర్‌ను కూడా సంప్రదించవచ్చు. లేదా.. info@tstdc.in మెయిల్ ద్వారా సంప్రదించే అవకాశం ఉంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Live Score
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!