TG DOST Registration 2026 : తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ - 'దోస్త్' రిజిస్ట్రేషన్లు ప్రారంభం, ఇదిగో లింక్
TG DOST Registration 2026 : తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ మొదలైంది. ఇందులో భాగంగా నేటి నుంచి దోస్త్ ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు షురూ అయ్యాయి. https://dost.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వార్ ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.
తెలంగాణలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ కోసం దోస్త్ -2026 నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ్టి నుంచి దోస్త్ ఫస్ట్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు షురూ అయ్యాయి. https://dost.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వార్ ఈ ప్రాసెస్ పూర్తి చేసుకోవాలి.
తొలి విడత రిజిస్ట్రేషన్లు ఏప్రిల్ 15 నుంచి మే 7వ తేదీ వరకు ఉంటాయి. ఏప్రిల్ 30 నుంచి మే 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి. సీట్ల కేటాయింపు మే 14వ తేదీన ఉంటుంది. ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ మే 15 నుంచి 23వ తేదీ వరకు ఉంటుంది.
రిజిస్ట్రేషన్ ఫీజు మొదటి విడతకు రూ. 200 చెల్లించాలి. ఒకవేళ రెండో విడత నుంచి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుంటే రూ. 400 పేమెంట్ చేయాలి. గత ఏడాది లెక్కల ప్రకారం దోస్త్, నాన్-దోస్త్, రెసిడెన్షియల్ కళాశాలల్లో కలిపి రాష్ట్రంలో మొత్తం 4.40 లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి.
దోస్త్ నోటిఫికేషన్ ద్వారా తెలంగాణలోని ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ వర్సిటీ, తెలంగాణ వర్సిటీ, పాలమూరు వర్సిటీ, మహాత్మాగాంధీ, శాతవాహన విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో సీట్లను భర్తీ చేస్తారు. అంతేకాకుండా చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ, కొత్తగూడెంలోని మన్మోహన్సింగ్ ఎర్త్ సైన్సెస్ వర్సిటీ, జేఎన్టీయూ పరిధిలోని కాలేజీల్లో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఎస్డబ్ల్యూ వంటి కోర్సుల్లో సీట్లను ఈ ప్రక్రియ ద్వారా భర్తీ చేస్తారు.
త విద్యాసంవత్సరం (2025-26)లో మొత్తం 4.40 లక్షల సీట్లు ఉండగా, 2.05 లక్షల సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది ఇంటర్ ఫలితాల శాతం పెరగడంతో డిగ్రీలో చేరే విద్యార్థుల సంఖ్య కూడా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
అర్హులైన అభ్యర్థులు https://dost.cgg.gov.in/Authatication.do లింక్ పై క్లిక్ చేసి వెబ్ సైట్ ద్వారా దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈసారి మొత్తం మూడు విడతల ద్వారా డిగ్రీ సీట్లను భర్తీ చేస్తారు. జులై 1వ తేదీ నుంచి మొదటి సెమిస్టర్ తరగతులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.
E-Paper

