TG TET Exams 2026 : ఇవాళ్టి నుంచి తెలంగాణ టెట్ పరీక్షలు - షెడ్యూల్ వివరాలు తెలుసుకోండి
TG TET Exams 2026 : తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్షలు నేటి (జూన్ 16) నుంచి ప్రారంభమవుతాయి. ఈ నెల 22 వరకు మొత్తం 5 రోజుల పాటు ఆన్లైన్ విధానంలో ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరగనున్నాయి.
తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్షలు నేటి (జూన్ 16) నుంచి ప్రారంభమవుతాయి. ఈ నెల 22 వరకు మొత్తం 5 రోజుల పాటు ఆన్లైన్ విధానంలో ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షలు జరగనున్నాయి.
(Pixel image)
రెండు షిఫ్టుల్లో పరీక్షల నిర్వహణఈ పరీక్షలు ప్రతిరోజూ రెండు సెషన్లలో జరగనున్నాయి. అభ్యర్థులు తమకు కేటాయించిన సమయాలను సరిచూసుకుని పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
మొదటి సెషన్ (షిఫ్ట్ 1): ఉదయం 9:00 గంటల నుంచి ఉదయం 11:30 గంటల వరకు. రెండూ సెషన్ (షిఫ్ట్ 2): మధ్యాహ్నం 2:00 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.
ఇవాళ(జూన్ 16) రెండు షిఫ్టుల్లోనూ ఇంగ్లీష్, తెలుగు మీడియం అభ్యర్థులకు పేపర్-I పరీక్ష జరగనుంది. ఈరోజు ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, మెదక్, ములుగు, నల్గొండ, నారాయణపేట్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కుమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్నగర్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల పరిధిలోని అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.
అభ్యర్థులు తమ హాల్ టికెట్లతో పాటు నిబంధనల ప్రకారం పరీక్షా కేంద్రానికి సకాలంలో చేరుకోవాలని… పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు https://schooledu.telangana.gov.in వెబ్సైట్ను ఫాలో అవ్వాలని అధికారులు స్పష్టం చేశారు.
https://tgtet.aptonline.in/UI/HomePage/HomePage.aspx వెబ్ సైట్ లోకి వెళ్లి తెలంగాణ టెట్ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. https://tgtet.aptonline.in/Documents/ExamScheduleTGTET-June-2026.pdf లింక్ పై క్లిక్ చేసి…. ఎగ్జామ్ షెడ్యూల్ టైమింగ్స్ వివరాలను తెలుసుకోవచ్చు.
రీక్షకు హాజరయ్యే వారు హాల్ టికెట్తో పాటు ఏదైనా ఒక ప్రభుత్వ గుర్తింపు కార్డును తప్పనిసరిగా వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దానిపై ఉన్న అభ్యర్థి పేరు, ఫోటో, సంతకం, పరీక్షా కేంద్రం వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏవైనా తప్పులు ఉంటే వెంటనే టెట్ కన్వీనర్ కార్యాలయాన్ని సంప్రదించి సరిచేసుకోవాల్సి ఉంటుంది.
(image istock)
ఈ విడత టెట్ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,36,418 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో పేపర్ I కోసం 32,779 మంది అభ్యర్థులు, పేపర్ II కోసం 86,305 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. రెండు పేపర్లకు (పేపర్ I మరియు పేపర్ II) కలిపి 17,334 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
E-Paper

