GI ఆన్ వీల్స్.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే తొలిసారిగా
దేశంలో ఎక్కడా జరగని విధంగా తొలిసారిగా జీఐ ఆన్ వీల్స్ కార్యక్రమం నిర్వహించడం అభినందించదగ్గ విషయం అని గవర్నర్, జిష్ణుదేవ్ వర్మ అన్నారు. ఒక్కో బస్సుపై ఒక్కో ప్రత్యేక ఉంటుందన్నారు.
హైదరాబాద్ ఎంజీబీఎస్ బస్ స్టేషన్లో టీజీఎస్ఆర్టీసీ దేశంలోనే మొట్టమొదటిసారిగా 'GI (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ఆన్ వీల్స్' జీఐ ద్వారా గుర్తించిన సాంస్కృతిక, కళాత్మక చిత్రాలతో రూపొందించిన బస్సులను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు.
జీఐ ఆన్ వీల్స్ కార్యక్రమం ఆలోచన గురించి తొలిసారిగా మంత్రి పొన్నం ప్రభాకర్కు చెప్పిన వెంటనే స్పందించారని గవర్నర్ తెలిపారు. ఒక్కో బస్సుపై ఒక్కో ప్రత్యేక జీఐ వర్క్తో విస్తృత ప్రచారం నిర్వహించడం అభినందనీయమన్నారు.
జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ అనేది మన చరిత్ర, గుర్తింపు, సంప్రదాయమని, జీఐ ట్యాగ్స్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని గవర్నర్ జిష్ణు దేవ్ అన్నారు.
బస్సులపై జీఐ ఆర్ట్ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయ కళలు చేతిపనులపై అవగాహనను తెస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పర్యాటక అభివృద్ధి చేతివృత్తులవారిని ప్రోత్సహిస్తుందని చెప్పారు.
6జీఐ ఆర్ట్ వర్క్ ఉన్న 6 జిల్లాలకు 6 ఎక్స్ప్రెస్ బస్సులు ప్రారంభించామని పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. సంస్కృతిని, కళాకారులను, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం లక్ష్యమన్నారు.
E-Paper

