Kazipet RMU : సిద్ధమవుతున్న కాజీపేట రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ - త్వరలోనే ప్రారంభం..! ఈ ఫొటోలు చూడండి
తెలంగాణలోని కాజీపేటలో నిర్మిస్తున్న రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ (RMU) పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 85 శాతం పనులు పూర్తయ్యాయి.ఈ యూనిట్ త్వరలో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి షేర్ చేశారు.
తెలంగాణలోని కాజీపేటలో నిర్మిస్తున్న రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్ (RMU) పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు 85 శాతం పనులు పూర్తయ్యాయి.ఈ యూనిట్ త్వరలో ప్రారంభం కానుంది.
ఈ యూనిట్ పూర్తి కావటం ద్వారా రైల్వే సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా పారిశ్రామిక వృద్ధికి కూడా పెద్ద పీట వేయనుంది. ఇప్పటికే 85 శాతం పనులు పూర్తయ్యాయి.
ఈ ప్రాజెక్ట్ ఖర్చు మొత్తం రూ. 521.36 కోట్లుగా ఉంది. ఇప్పటికే వేగంగా పనులు జరుగుతుండగా... మిగిలిన పనులను కూడా త్వరితగతిన పూర్తి చేయనున్నారు.
ప్రస్తుతం ప్రధాన షాప్ (Main Shop) ,టెస్ట్ షాప్, పెయింట్ షాప్ అండ్ అడ్మినిస్ట్రేషన్ భవనాలు, అంతర్గత రైల్వే ట్రాక్ లు, ఇతర సౌకర్యాలు కల్పించే పనులు కొనసాగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
160 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ యూనిట్.... అధునాతన ఇంటర్సిటీ రైళ్లను తయారు చేసే విధంగా రూపుదిద్దుకుంటోంది. ఈ యూనిట్ను ప్రధాన రైల్వే లైన్లతో అనుసంధానించడానికి 13.15 కి.మీ పొడవైన అంతర్గత రైల్వే ట్రాకులను ఏర్పాటు చేశారు.
ఈ యూనిట్ వల్ల భారత రైల్వేలకు కొత్త కోచ్లు అందుబాటులోకి రావడమే కాకుండా, తెలంగాణలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. అంతేకాకుండా RMU చుట్టూ చిన్న తరహా పరిశ్రమలు అభివృద్ధి చెంది.... ఈ ప్రాంత ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది.
E-Paper

