Tirumala Srivari Darshan Rush : తిరుమలలో భక్తజన సంద్రం - ఒకే రోజు రికార్డు స్థాయిలో దర్శనం..!

Published on May 03, 2026 12:02 pm IST

Tirumala Srivari Darshan Rush : వేసవి సెలవుల రద్దీ వేళ తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. మే 2వ తేదీన రికార్డు స్థాయిలో 91,005 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకుండా టీటీడీ అన్నప్రసాదం, పాలు, మజ్జిగ పంపిణీలో పకడ్బందీ ఏర్పాట్లు చేసింది.

1 / 6
<p>కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రం భక్తజన సంద్రమైంది. వేసవి సెలవులకు తోడు వారాంతం (వీకెండ్) కలిసి రావడంతో దేశం నలుమూలల నుండి భక్తులు భారీగా తిరుమలకు తరలివచ్చారు. దీంతో తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి. </p> expand-icon View Photos in a new improved layout
Published on May 03, 2026 12:02 pm IST

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమల క్షేత్రం భక్తజన సంద్రమైంది. వేసవి సెలవులకు తోడు వారాంతం (వీకెండ్) కలిసి రావడంతో దేశం నలుమూలల నుండి భక్తులు భారీగా తిరుమలకు తరలివచ్చారు. దీంతో తిరుమల గిరులు గోవింద నామస్మరణతో మారుమోగుతున్నాయి.

2 / 6
<p>శనివారం(మే 2) ఒక్కరోజే రికార్డు స్థాయిలో 91,005 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వేసవి సెలవుల కారణంగా సామాన్య భక్తుల రద్దీ ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. స్వామివారికి మొక్కులు చెల్లించుకునే క్రమంలో 36,257 మంది భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు దర్శన సమయాలను, క్యూలైన్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 03, 2026 12:02 pm IST

శనివారం(మే 2) ఒక్కరోజే రికార్డు స్థాయిలో 91,005 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వేసవి సెలవుల కారణంగా సామాన్య భక్తుల రద్దీ ఊహించిన దానికంటే ఎక్కువగా ఉంది. స్వామివారికి మొక్కులు చెల్లించుకునే క్రమంలో 36,257 మంది భక్తులు కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ అధికారులు దర్శన సమయాలను, క్యూలైన్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

3 / 6
<p>ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు… తిరుమలలో సామాన్య భక్తులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. వీఐపీ సంస్కృతిని తగ్గించి, గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించే దిశగా టీటీడీ యంత్రాంగం పని చేస్తోందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.</p><p> </p> expand-icon View Photos in a new improved layout
Published on May 03, 2026 12:02 pm IST

ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు… తిరుమలలో సామాన్య భక్తులకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నారు. వీఐపీ సంస్కృతిని తగ్గించి, గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉండే సామాన్య భక్తులకు మెరుగైన సేవలు అందించే దిశగా టీటీడీ యంత్రాంగం పని చేస్తోందని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు ఓ ప్రకటన ద్వారా తెలిపారు.

4 / 6
<p>ఎండల తీవ్రత దృష్ట్యా క్యూలైన్లలో ఉన్న భక్తులకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శ్రీవారి సేవకుల సహకారంతో భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, పాలు, చల్లని మజ్జిగ మరియు తాగునీటిని అందజేస్తున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందేలా క్యూలైన్లలో ఫ్యాన్లు, కూలర్లను ఏర్పాటు చేయడంతో పాటు, భక్తులకు అవసరమైన సమాచారాన్ని అనౌన్స్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 03, 2026 12:02 pm IST

ఎండల తీవ్రత దృష్ట్యా క్యూలైన్లలో ఉన్న భక్తులకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. శ్రీవారి సేవకుల సహకారంతో భక్తులకు నిరంతరాయంగా అన్నప్రసాదాలు, పాలు, చల్లని మజ్జిగ మరియు తాగునీటిని అందజేస్తున్నారు. వేడి నుంచి ఉపశమనం పొందేలా క్యూలైన్లలో ఫ్యాన్లు, కూలర్లను ఏర్పాటు చేయడంతో పాటు, భక్తులకు అవసరమైన సమాచారాన్ని అనౌన్స్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారు.

5 / 6
<p>శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలోనూ భక్తులకు ఎలాంటి లోటు రాకుండా టీటీడీ జాగ్రత్తలు తీసుకుంది. బఫర్ స్టాక్‌ను అందుబాటులో ఉంచి, దర్శనం ముగించుకుని వచ్చే ప్రతి భక్తుడికి లడ్డూలు అందేలా కౌంటర్ల వద్ద సిబ్బందిని అప్రమత్తం చేసింది. (File/PTI)</p> expand-icon View Photos in a new improved layout
Published on May 03, 2026 12:02 pm IST

శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలోనూ భక్తులకు ఎలాంటి లోటు రాకుండా టీటీడీ జాగ్రత్తలు తీసుకుంది. బఫర్ స్టాక్‌ను అందుబాటులో ఉంచి, దర్శనం ముగించుకుని వచ్చే ప్రతి భక్తుడికి లడ్డూలు అందేలా కౌంటర్ల వద్ద సిబ్బందిని అప్రమత్తం చేసింది. (File/PTI)

6 / 6
<p>రద్దీ ఎంత ఉన్నా సేవల్లో నాణ్యత తగ్గకుండా టీటీడీ సిబ్బంది, పోలీసులు మరియు శ్రీవారి సేవకులు సమన్వయంతో పనిచేస్తున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on May 03, 2026 12:02 pm IST

రద్దీ ఎంత ఉన్నా సేవల్లో నాణ్యత తగ్గకుండా టీటీడీ సిబ్బంది, పోలీసులు మరియు శ్రీవారి సేవకులు సమన్వయంతో పనిచేస్తున్నారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!