తిరుమల : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల - ఈనెల 24న అంగ ప్రదక్షిణ టోకెన్లు
తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లు విడుదలయ్యాయి. https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ కోరింది.
2026 ఫిబ్రవరి నెల దర్శన టికెట్లకు సంబంధించి టీటీడీ ఇటీవలే షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ(నవంబర్ 21, 2025) ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసింది.
ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా టికెట్లు అందుబాటులోకి వస్తాయి. ఈ మేరకు టీటీడీ ప్రకటన చేసింది.
ఇక నవంబర్ 24న అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదలవుతాయి. ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటా నవంబర్ 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను నవంబర్ 24న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నవంబర్ 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఇక తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. ఈ టికెట్లన్నీ https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని.. ఇతర సైట్లను నమ్మవద్దని టీటీడీ భక్తులను కోరింది.
E-Paper

