తిరుమల : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల - ఈనెల 24న అంగ ప్రదక్షిణ టోకెన్లు

Published on Nov 21, 2025 11:54 am IST

తిరుమల శ్రీవారి భక్తులకు అప్డేట్. ఇవాళ ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లు విడుదలయ్యాయి. https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శ‌న టికెట్లు బుక్ చేసుకోవాల‌ని టీటీడీ కోరింది.

1 / 5
<p>2026 ఫిబ్రవరి నెల దర్శన టికెట్లకు సంబంధించి టీటీడీ ఇటీవలే షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ(నవంబర్ 21, 2025) ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 21, 2025 11:54 am IST

2026 ఫిబ్రవరి నెల దర్శన టికెట్లకు సంబంధించి టీటీడీ ఇటీవలే షెడ్యూల్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ(నవంబర్ 21, 2025) ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసింది.

2 / 5
<p>ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా టికెట్లు అందుబాటులోకి వస్తాయి. ఈ మేరకు టీటీడీ ప్రకటన చేసింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 21, 2025 11:54 am IST

ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటా టికెట్లు అందుబాటులోకి వస్తాయి. ఈ మేరకు టీటీడీ ప్రకటన చేసింది.

3 / 5
<p><strong>ఇక నవంబర్ 24న అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదలవుతాయి.</strong> ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటా నవంబర్ 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 21, 2025 11:54 am IST

ఇక నవంబర్ 24న అంగ ప్రదక్షిణ టోకెన్లు విడుదలవుతాయి. ఉదయం 10 గంటలకు ఆన్ లైన్ లో అందుబాటులోకి వస్తాయి. అంతేకాకుండా శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటా నవంబర్ 24న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.

4 / 5
<p>వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను నవంబర్ 24న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 21, 2025 11:54 am IST

వ‌యోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులున్న‌వారు తిరుమల శ్రీ‌వారిని ద‌ర్శించుకునేందుకు వీలుగా ఉచిత‌ ప్ర‌త్యేక ద‌ర్శ‌నం టోకెన్ల కోటాను నవంబర్ 24న మధ్యాహ్నం 3 గంట‌ల‌కు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుద‌ల చేయ‌నుంది.

5 / 5
<p>ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నవంబర్ 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఇక తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఈ టికెట్లన్నీ <a href="https://ttdevasthanams.ap.gov.in" target="_blank">https://ttdevasthanams.ap.gov.in</a> వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని.. ఇతర సైట్లను నమ్మవద్దని టీటీడీ భక్తులను కోరింది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Nov 21, 2025 11:54 am IST

ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను నవంబర్ 25న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయ‌నుంది. ఇక తిరుమల, తిరుపతిల‌లో గదుల కోటాను 25న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఈ టికెట్లన్నీ https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుకింగ్ చేసుకోవాలని.. ఇతర సైట్లను నమ్మవద్దని టీటీడీ భక్తులను కోరింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!