తిరుమల : భక్తులకు అలర్ట్ - ఇవాళ శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు విడుదల
తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. ఇవాళ (ఫిబ్రవరి 18) ఆర్జిత సేవా టికెట్లు అందుబాటులోకి వస్తాయి. ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.ఈనెల 24న ఉదయం పది గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదలవుతాయి.
తిరుమల శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం అప్డేట్ ఇచ్చింది. ఇవాళ (ఫిబ్రవరి 18) ఆర్జిత సేవా టికెట్లు అందుబాటులోకి రానున్నాయి. ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఫిబ్రవరి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు ఫిబ్రవరి 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి టికెట్లు మంజూరవుతాయి.
ఫిబ్రవరి 21వ తేదీన ఆర్జిత సేవా టికెట్ల విడుదలవుతాయి. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను 21న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.
ఫిబ్రవరి 23వ తేదీన అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను 23న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నారు.శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను 23న ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు.
ఫిబ్రవరి 24వ తేదీన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది.తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.
https://ttdevasthanams.ap.gov.in వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్జితసేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు ఓ ప్రకటన ద్వారా సూచించారు. ఫేక్ వెబ్ సైట్లను నమ్మి మోసపోవద్దని కోరారు..
E-Paper

