ఆస్ట్రేలియాలో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 ఇండియన్ బ్యాటర్లు వీళ్లే.. రోహిత్ రికార్డుపై కన్నేసిన కెప్టెన్ సూర్య
ఆస్ట్రేలియాతో బుధవారం (అక్టోబర్ 29) నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కంగారూ గడ్డపై టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 5 ఇండియన్ బ్యాటర్లు ఎవరో ఇక్కడ చూడండి.
టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించాడు. ఈ స్టార్ బ్యాటర్ ఆస్ట్రేలియాలో 16 ఇన్నింగ్స్ ల్లో 747 పరుగులు చేశాడు. అతడు మినహా ఏ భారత ఆటగాడు కూడా 300 మార్కును దాటలేకపోయాడు.
(AFP)
ఈ జాబితాలో రోహిత్ శర్మ రెండో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాలో 13 టీ20 ఇన్నింగ్స్ ల్లో 297 పరుగులు చేశాడు. అతని రికార్డు ఇప్పుడు ప్రమాదంలో ఉంది.
(AP)
ఆస్ట్రేలియా గడ్డపై మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్ 271 పరుగులు చేశాడు. అతను ఎనిమిది ఇన్నింగ్స్ ఆడాడు. ధావన్ గతేడాది అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు.
(Reuters)
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాలో ఇప్పటి వరకు 6 ఇన్నింగ్స్ ల్లో 239 పరుగులు చేశాడు. బుధవారం నుంచి ఆస్ట్రేలియా వేదికగా ప్రారంభమయ్యే ఐదు టీ20ల సిరీస్ లో రోహిత్ ను వెనక్కి నెట్టే సువర్ణావకాశం సూర్యకు ఉంది. రాబోయే సిరీస్ లో 59 పరుగులు చేస్తే అతను రెండవ స్థానానికి చేరుకుంటాడు.
(AP)
ఈ జాబితాలో కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన 11 టీ20 ఇన్నింగ్స్ లో 236 పరుగులు చేశాడు. రాహుల్ చాలా కాలంగా టీ20 టీమ్ లో లేడు. అతను చివరిసారిగా నవంబర్ 2022లో భారత్ తరఫున టీ20 మ్యాచ్ ఆడాడు.
(AP)
E-Paper

