In Pics : వైభవంగా శ్రీవారి స్వర్ణ రథం ఊరేగింపు.. గోవింద నామస్మరణతో మార్మోగిన తిరుగిరులు
తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు వైభవంగా చేశారు. ఈ సందర్భంగా తిరుమల స్వర్ణ రథోత్సవం వైభవంగా నిర్వహించారు.
తిరుమలలో వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని స్వర్ణ రథోత్సవం వైభవంగా జరిగింది. రథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేశారు.
మరోవైపు ఉత్తర ద్వార దర్శనం కోసం తిరుమలకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. కొండపై భక్తుల రద్దీ నెలకొన్నది.
తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలు మంగళవారం తెల్లవారుజాము నుంచి ప్రారంభమయ్యాయి. 10 రోజులపాటు ద్వార దర్శనాలు ఉండనున్నాయి. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లను చేసింది.
వైకుంఠ ఏకాదశి పురస్కరించుకుని ప్రముఖులు శ్రీవారి దర్శనానికి తరలివచ్చారు. తిరుమల శ్రీవారి నామస్మరణతో మార్మోగిపోతోంది.
వైకుంఠ ఏకాదశి తిరుమలలో అత్యంత ముఖ్యమైన వార్షిక పండుగలలో ఒకటి, వైకుంఠ ద్వారం గుండా వెళితే పునర్జన్మ చక్రం నుండి విముక్తి లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు.
భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని, టీటీడీ ప్రత్యేక దర్శనం, రద్దీ నిర్వహణ, భద్రతా ఏర్పాట్లను ఏర్పాటు చేసింది. దర్శన షెడ్యూల్ ప్రకారం.. మొదటి మూడు రోజులలో వైకుంఠ ద్వార దర్శనం ముందుగా జారీ చేసిన టోకెన్లను కలిగి ఉన్న భక్తులకు మాత్రమే అవకాశం ఉంటుంది.
E-Paper

