తెలంగాణ విద్యార్థులకు అలర్ట్ - స్కాలర్షిప్ దరఖాస్తుల గడువు పొడిగింపు, చివరి తేదీ ఇదే
విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమైన అప్డేట్ ఇచ్చింది. 2025- 2026 విద్యా సంవత్సరానికి గానూ ఉపకార వేతనాలు, బోధన రుసుముల కోసం దరఖాస్తుల గడువును పొడిగించింది. డిసెంబరు 31 వరకు పొడిగించినట్లు తాజాగా ప్రకటన విడుదలైంది.
రాష్ట్రంలో 2025-26 విద్యాసంవత్సరానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ విద్యార్థుల ఉపకార వేతనాలు, బోధన ఫీజుల దరఖాస్తులపై కీలక అప్డేట్ వచ్చేసింది. ఇప్పటికే గడువు పూర్తి కాగా… తాజాగా అధికారులు ప్రకటన విడుదల చేశారు. ఈ గడువు డిసెంబర్ 31వ తేదీ వరకు పొడిగించారు.
కేవలం కొత్త విద్యార్థులే కాకుండా పాతవారు కూడా రెన్యూవల్ చేసుకోవచ్చు.రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ, దివ్యాంగ విద్యార్థుల బోధన ఫీజులు, స్కాలర్ షిప్స్ కోసం జూలై 1వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నారు.
అర్హత కలిగిన విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రెన్యూవల్ చేసుకోలేని విద్యార్థులు కూడా ఇదే వెబ్ సైట్ లో ప్రాసెస్ చేసుకోవచ్చు. కొత్త విద్యార్థులు అయితే 'ఫ్రెష్ రిజిస్ట్రేషన్' అనే ఆప్షన్ పై నొక్కాలి. అప్పుడు బ్రౌజర్లో మీ స్కాలర్ షిప్ సంబంధిత అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
మీ వివరాలను ఎంటర్ చేసి.. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి. ఇక చివరగా.. అప్లికేషన్లో మీరు నమోదు చేసిన వివరాలను సమీక్షించుకుని "సబ్మిట్" చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ రిఫరెన్స్ నంబర్ను నోట్ చేసుకోవాలి.
అర్హులైన విద్యార్థులు https://telanganaepass.cgg.gov.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా… దరఖాస్తు చేసుకున్నవాళ్లు ఇదే వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు.
E-Paper

