తెలంగాణ : ట్రై కలర్, గ్రీన్ కలర్...! ఈ 2 రకాల రేషన్ కార్డుల గురించి తెలుసా..?

Published on Jul 19, 2025 04:09 pm IST

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే అర్హులుగా గుర్తించిన వారికి సంబంధిత పత్రాలను(కార్డు) కూడా పంపిణీ చేస్తున్నారు. జూలై 14 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే దరఖాస్తుదారుల స్థితిగతుల ఆధారంగా 2 రకాల కార్డులను ఇస్తున్నారు.

1 / 8
<p>రాష్ట్రవ్యాప్తంగా జూలై 13 వరకు వచ్చిన దరఖాస్తులన్నింటిని పరిశీలించి అప్రూవ్ చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. సుమారు 5 లక్షల మందికి కొత్త కార్డులు ఇచ్చేందుకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగా జూలై 14 నుంచి కొత్త కార్డుల పంపిణీని ప్రారంభించింది..</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 19, 2025 04:09 pm IST

రాష్ట్రవ్యాప్తంగా జూలై 13 వరకు వచ్చిన దరఖాస్తులన్నింటిని పరిశీలించి అప్రూవ్ చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. సుమారు 5 లక్షల మందికి కొత్త కార్డులు ఇచ్చేందుకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగా జూలై 14 నుంచి కొత్త కార్డుల పంపిణీని ప్రారంభించింది..

2 / 8
<div><p>తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే అర్హులైన వారికి జూలై 14వ తేదీ నుంచి కార్డుల పంపిణీ ప్రారంభమైంది. తుంగతుర్తిలో ఈ ప్రక్రియ ప్రారంభం కాగా… రాష్ట్రవ్యాప్తంగానూ లబ్ధిదారులకు వీటిని పంపిణీ చేస్తున్నారు.</p></div> expand-icon View Photos in a new improved layout
Published on Jul 19, 2025 04:09 pm IST

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే అర్హులైన వారికి జూలై 14వ తేదీ నుంచి కార్డుల పంపిణీ ప్రారంభమైంది. తుంగతుర్తిలో ఈ ప్రక్రియ ప్రారంభం కాగా… రాష్ట్రవ్యాప్తంగానూ లబ్ధిదారులకు వీటిని పంపిణీ చేస్తున్నారు.

3 / 8
<p>నిజానికి కొత్త రేషన్ కార్డులు స్మార్ట్ కార్డుల రూపంలోనే ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది.</p><p>కొత్త కార్డులతో పాటు, ఇప్పటికే ఉన్న కార్డుల స్థానంలో క్యూఆర్‌ కోడ్‌తో ఉన్న స్మార్ట్‌ రేషన్‌కార్డులను అందించే దిశగా పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. అయితే ఈ ప్రక్రియ ఆలస్యం కావటంతో… ప్రస్తుతం పత్రాల రూపంలోనే అందజేస్తోంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 19, 2025 04:09 pm IST

నిజానికి కొత్త రేషన్ కార్డులు స్మార్ట్ కార్డుల రూపంలోనే ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది.

కొత్త కార్డులతో పాటు, ఇప్పటికే ఉన్న కార్డుల స్థానంలో క్యూఆర్‌ కోడ్‌తో ఉన్న స్మార్ట్‌ రేషన్‌కార్డులను అందించే దిశగా పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. అయితే ఈ ప్రక్రియ ఆలస్యం కావటంతో… ప్రస్తుతం పత్రాల రూపంలోనే అందజేస్తోంది.

4 / 8
<p>మరోవైపు కొత్త రేషన్ కార్డుల స్టేటస్ ను తెలుసుకునేందుకు పౌరసరఫరాల శాఖ వెబ్ సైట్ (<a href="https://epds.telangana.gov.in/FoodSecurityAct/" target="_blank"><strong>https://epds.telangana.gov.in/FoodSecurityAct/</strong></a>) ను సంప్రదింవచ్చు. ఏమైనా మార్పులు చేర్పులు కూడా మీసేవా కేంద్రాల ఆధారంగా సవరించుకోవచ్చు.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 19, 2025 04:09 pm IST

మరోవైపు కొత్త రేషన్ కార్డుల స్టేటస్ ను తెలుసుకునేందుకు పౌరసరఫరాల శాఖ వెబ్ సైట్ (https://epds.telangana.gov.in/FoodSecurityAct/) ను సంప్రదింవచ్చు. ఏమైనా మార్పులు చేర్పులు కూడా మీసేవా కేంద్రాల ఆధారంగా సవరించుకోవచ్చు.

5 / 8
<p>త్వరలోనే అందించబోయే స్మార్ట్ రేషన్‌ కార్డులు గతంలో కంటే భిన్నంగా ఉండనున్నాయి. కొత్త కార్డులపై కుటుంబ పెద్ద పేరు మినహా ఎవరి ఫొటోలు ఉండే అవకాశం లేదు. ఏటీఎమ్‌ కార్డు సైజులో ఉంటుందని తెలుస్తోంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 19, 2025 04:09 pm IST

త్వరలోనే అందించబోయే స్మార్ట్ రేషన్‌ కార్డులు గతంలో కంటే భిన్నంగా ఉండనున్నాయి. కొత్త కార్డులపై కుటుంబ పెద్ద పేరు మినహా ఎవరి ఫొటోలు ఉండే అవకాశం లేదు. ఏటీఎమ్‌ కార్డు సైజులో ఉంటుందని తెలుస్తోంది.

6 / 8
<div><p>ఈ కొత్త కార్డులు రెండు రకాలుగా ఉండనున్నాయి. బీపీఎల్( దారిద్య్ర రేఖకు దిగువ) కుటుంబాలకు మూడు రంగులతో ఉన్న కార్డును అందజేస్తారు. ఏపీఎల్ (దారిద్య్ర రేఖకు ఎగువ) కుటుంబాలకు పచ్చ రంగులో ఉండే కార్డును ఇస్తారు. ఇదే విషయాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలుమార్లు చెప్పారు. అంటే దరఖాస్తుదారుడి ఆదాయ స్థితిగతుల ఆధారంగా… ఈ కార్డులను నిర్ణయిస్తారు.</p></div> expand-icon View Photos in a new improved layout
Published on Jul 19, 2025 04:09 pm IST

ఈ కొత్త కార్డులు రెండు రకాలుగా ఉండనున్నాయి. బీపీఎల్( దారిద్య్ర రేఖకు దిగువ) కుటుంబాలకు మూడు రంగులతో ఉన్న కార్డును అందజేస్తారు. ఏపీఎల్ (దారిద్య్ర రేఖకు ఎగువ) కుటుంబాలకు పచ్చ రంగులో ఉండే కార్డును ఇస్తారు. ఇదే విషయాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలుమార్లు చెప్పారు. అంటే దరఖాస్తుదారుడి ఆదాయ స్థితిగతుల ఆధారంగా… ఈ కార్డులను నిర్ణయిస్తారు.

7 / 8
<p>స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులను ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ టెండర్లను కూడా ఆహ్వానించింది. పలు సంస్ఖలు టెండర్లు కూడా దాఖలు చేశాయి. అర్హత సాధించిన వారికి కార్డుల ముద్రణ బాధ్యతలు అప్పగిస్తారు. అయితే ఈ ప్రక్రియలో ఓ సంస్థ… కోర్టును ఆశ్రయించటంతో ఈ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. త్వరలోనే ఈ ప్రక్రియ ముగియగానే… కార్డుల ముద్రణ ఉంటుంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 19, 2025 04:09 pm IST

స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులను ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ టెండర్లను కూడా ఆహ్వానించింది. పలు సంస్ఖలు టెండర్లు కూడా దాఖలు చేశాయి. అర్హత సాధించిన వారికి కార్డుల ముద్రణ బాధ్యతలు అప్పగిస్తారు. అయితే ఈ ప్రక్రియలో ఓ సంస్థ… కోర్టును ఆశ్రయించటంతో ఈ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. త్వరలోనే ఈ ప్రక్రియ ముగియగానే… కార్డుల ముద్రణ ఉంటుంది.

8 / 8
<p>ఏటీఎం రూపంలో ఉండే స్మార్ రేషన్ కార్డుకు ఒకవైపు ప్రభుత్వ లోగో ఉంటుందని సమాచారం. కుటుంబ పెద్ద వివరాలు, హోలోగ్రామ్‌, కార్డుదారుడి పూర్తి చిరునామా, క్యూఆర్‌ కోడ్‌ ముద్రిస్తారని తెలుస్తోంది. మరోవైపు జిల్లా పేరు, మండలం, గ్రామం, క్యూ ఆర్‌ కోడ్‌, రేషన్‌ కార్డుదారుడి చిరునామా ఉండేలా రూపొందిస్తారని సమాచారం. త్వరలోనే ఈ స్మార్ట్ రేషన్ కార్డును ఆవిష్కరించే అవకాశం ఉంటుంది. దీనిపై పౌరసరఫరాల శాఖ ప్రకటన చేయాల్సి ఉంది.</p> expand-icon View Photos in a new improved layout
Published on Jul 19, 2025 04:09 pm IST

ఏటీఎం రూపంలో ఉండే స్మార్ రేషన్ కార్డుకు ఒకవైపు ప్రభుత్వ లోగో ఉంటుందని సమాచారం. కుటుంబ పెద్ద వివరాలు, హోలోగ్రామ్‌, కార్డుదారుడి పూర్తి చిరునామా, క్యూఆర్‌ కోడ్‌ ముద్రిస్తారని తెలుస్తోంది. మరోవైపు జిల్లా పేరు, మండలం, గ్రామం, క్యూ ఆర్‌ కోడ్‌, రేషన్‌ కార్డుదారుడి చిరునామా ఉండేలా రూపొందిస్తారని సమాచారం. త్వరలోనే ఈ స్మార్ట్ రేషన్ కార్డును ఆవిష్కరించే అవకాశం ఉంటుంది. దీనిపై పౌరసరఫరాల శాఖ ప్రకటన చేయాల్సి ఉంది.

  • author-default-90x90
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!