తెలంగాణ : ట్రై కలర్, గ్రీన్ కలర్...! ఈ 2 రకాల రేషన్ కార్డుల గురించి తెలుసా..?
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే అర్హులుగా గుర్తించిన వారికి సంబంధిత పత్రాలను(కార్డు) కూడా పంపిణీ చేస్తున్నారు. జూలై 14 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే దరఖాస్తుదారుల స్థితిగతుల ఆధారంగా 2 రకాల కార్డులను ఇస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా జూలై 13 వరకు వచ్చిన దరఖాస్తులన్నింటిని పరిశీలించి అప్రూవ్ చేసే దిశగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. సుమారు 5 లక్షల మందికి కొత్త కార్డులు ఇచ్చేందుకు సన్నద్ధమైంది. ఇందులో భాగంగా జూలై 14 నుంచి కొత్త కార్డుల పంపిణీని ప్రారంభించింది..
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే అర్హులైన వారికి జూలై 14వ తేదీ నుంచి కార్డుల పంపిణీ ప్రారంభమైంది. తుంగతుర్తిలో ఈ ప్రక్రియ ప్రారంభం కాగా… రాష్ట్రవ్యాప్తంగానూ లబ్ధిదారులకు వీటిని పంపిణీ చేస్తున్నారు.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే అర్హులైన వారికి జూలై 14వ తేదీ నుంచి కార్డుల పంపిణీ ప్రారంభమైంది. తుంగతుర్తిలో ఈ ప్రక్రియ ప్రారంభం కాగా… రాష్ట్రవ్యాప్తంగానూ లబ్ధిదారులకు వీటిని పంపిణీ చేస్తున్నారు.
నిజానికి కొత్త రేషన్ కార్డులు స్మార్ట్ కార్డుల రూపంలోనే ఇవ్వాలని సర్కార్ నిర్ణయించింది.
కొత్త కార్డులతో పాటు, ఇప్పటికే ఉన్న కార్డుల స్థానంలో క్యూఆర్ కోడ్తో ఉన్న స్మార్ట్ రేషన్కార్డులను అందించే దిశగా పౌరసరఫరాల శాఖ కసరత్తు చేస్తోంది. అయితే ఈ ప్రక్రియ ఆలస్యం కావటంతో… ప్రస్తుతం పత్రాల రూపంలోనే అందజేస్తోంది.
మరోవైపు కొత్త రేషన్ కార్డుల స్టేటస్ ను తెలుసుకునేందుకు పౌరసరఫరాల శాఖ వెబ్ సైట్ (https://epds.telangana.gov.in/FoodSecurityAct/) ను సంప్రదింవచ్చు. ఏమైనా మార్పులు చేర్పులు కూడా మీసేవా కేంద్రాల ఆధారంగా సవరించుకోవచ్చు.
త్వరలోనే అందించబోయే స్మార్ట్ రేషన్ కార్డులు గతంలో కంటే భిన్నంగా ఉండనున్నాయి. కొత్త కార్డులపై కుటుంబ పెద్ద పేరు మినహా ఎవరి ఫొటోలు ఉండే అవకాశం లేదు. ఏటీఎమ్ కార్డు సైజులో ఉంటుందని తెలుస్తోంది.
ఈ కొత్త కార్డులు రెండు రకాలుగా ఉండనున్నాయి. బీపీఎల్( దారిద్య్ర రేఖకు దిగువ) కుటుంబాలకు మూడు రంగులతో ఉన్న కార్డును అందజేస్తారు. ఏపీఎల్ (దారిద్య్ర రేఖకు ఎగువ) కుటుంబాలకు పచ్చ రంగులో ఉండే కార్డును ఇస్తారు. ఇదే విషయాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలుమార్లు చెప్పారు. అంటే దరఖాస్తుదారుడి ఆదాయ స్థితిగతుల ఆధారంగా… ఈ కార్డులను నిర్ణయిస్తారు.
ఈ కొత్త కార్డులు రెండు రకాలుగా ఉండనున్నాయి. బీపీఎల్( దారిద్య్ర రేఖకు దిగువ) కుటుంబాలకు మూడు రంగులతో ఉన్న కార్డును అందజేస్తారు. ఏపీఎల్ (దారిద్య్ర రేఖకు ఎగువ) కుటుంబాలకు పచ్చ రంగులో ఉండే కార్డును ఇస్తారు. ఇదే విషయాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పలుమార్లు చెప్పారు. అంటే దరఖాస్తుదారుడి ఆదాయ స్థితిగతుల ఆధారంగా… ఈ కార్డులను నిర్ణయిస్తారు.
స్మార్ట్ కార్డుల రూపంలో కొత్త రేషన్ కార్డులను ఇచ్చేందుకు తెలంగాణ సర్కార్ టెండర్లను కూడా ఆహ్వానించింది. పలు సంస్ఖలు టెండర్లు కూడా దాఖలు చేశాయి. అర్హత సాధించిన వారికి కార్డుల ముద్రణ బాధ్యతలు అప్పగిస్తారు. అయితే ఈ ప్రక్రియలో ఓ సంస్థ… కోర్టును ఆశ్రయించటంతో ఈ ప్రక్రియకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. త్వరలోనే ఈ ప్రక్రియ ముగియగానే… కార్డుల ముద్రణ ఉంటుంది.
ఏటీఎం రూపంలో ఉండే స్మార్ రేషన్ కార్డుకు ఒకవైపు ప్రభుత్వ లోగో ఉంటుందని సమాచారం. కుటుంబ పెద్ద వివరాలు, హోలోగ్రామ్, కార్డుదారుడి పూర్తి చిరునామా, క్యూఆర్ కోడ్ ముద్రిస్తారని తెలుస్తోంది. మరోవైపు జిల్లా పేరు, మండలం, గ్రామం, క్యూ ఆర్ కోడ్, రేషన్ కార్డుదారుడి చిరునామా ఉండేలా రూపొందిస్తారని సమాచారం. త్వరలోనే ఈ స్మార్ట్ రేషన్ కార్డును ఆవిష్కరించే అవకాశం ఉంటుంది. దీనిపై పౌరసరఫరాల శాఖ ప్రకటన చేయాల్సి ఉంది.
E-Paper

