Virat Kohli T20 Records : టీ20ల్లో 14,000 పరుగులు... తొలి ఇండియన్ క్రికెటర్ గా నిలిచిన విరాట్ కోహ్లీ! మరిన్ని రికార్డులు

Published on May 14, 2026 11:31 am IST

Virat Kohli IPL T20 Records : ఐపీఎల్‌ చరిత్రతోపాటు టీ20ల్లో అరుదైన రికార్డులను విరాట్ కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ టీ20 క్రికెట్‌లో 14వేలకు పైగా పరుగులు చేసిన ఆరో బ్యాటర్ విరాట్ కోహ్లీ నిలవగా… తొలి ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు. కోహ్లీ సాధించిన తాజా రికార్డులపై ఓ లుక్కేయండి…

1 / 7
<p>ఐపీఎల్‌ చరిత్రతోపాటు టీ20ల్లో అరుదైన రికార్డులను విరాట్ కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ టీ20 క్రికెట్‌లో 14వేలకు పైగా పరుగులు చేసిన ఆరో బ్యాటర్ విరాట్ కోహ్లీ నిలవగా… తొలి ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు.</p>(ANI Pic Service) expand-icon View Photos in a new improved layout
Published on May 14, 2026 11:31 am IST

ఐపీఎల్‌ చరిత్రతోపాటు టీ20ల్లో అరుదైన రికార్డులను విరాట్ కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రపంచ టీ20 క్రికెట్‌లో 14వేలకు పైగా పరుగులు చేసిన ఆరో బ్యాటర్ విరాట్ కోహ్లీ నిలవగా… తొలి ఇండియన్ క్రికెటర్ గా నిలిచాడు.

(ANI Pic Service)

2 / 7
<p>బుధవారం రాత్రి రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో కోహ్లీ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.ఈ మ్యాచ్‌లో 78వ పరుగు పూర్తి చేయగానే కోహ్లీ 14 వేల పరుగుల క్లబ్‌లో చేరాడు.</p>(ANI Pic Service) expand-icon View Photos in a new improved layout
Published on May 14, 2026 11:31 am IST

బుధవారం రాత్రి రాయ్‌పూర్‌లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఐపీఎల్ 2026 మ్యాచ్‌లో కోహ్లీ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.ఈ మ్యాచ్‌లో 78వ పరుగు పూర్తి చేయగానే కోహ్లీ 14 వేల పరుగుల క్లబ్‌లో చేరాడు.

(ANI Pic Service)

3 / 7
<p>ప్రపంచవ్యాప్తంగా ఈ మైలురాయిని అందుకున్న ఆరో బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. అయితే, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా కోహ్లీ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించడం విశేషం. </p>(ANI Pic Service) expand-icon View Photos in a new improved layout
Published on May 14, 2026 11:31 am IST

ప్రపంచవ్యాప్తంగా ఈ మైలురాయిని అందుకున్న ఆరో బ్యాటర్‌గా కోహ్లీ నిలిచాడు. అయితే, అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఆటగాడిగా కోహ్లీ సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించడం విశేషం.

(ANI Pic Service)

4 / 7
<p>కేవలం 409 ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ ఈ మార్కును చేరుకోగా, గతంలో 'యూనివర్స్ బాస్' క్రిస్ గేల్ 423 ఇన్నింగ్స్‌ల్లో సాధించిన రికార్డును కోహ్లీ తుడిచిపెట్టాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రిస్ గేల్ (14,562), కీరన్ పొలార్డ్ (14,482), అలెక్స్ హేల్స్ (14,449), డేవిడ్ వార్నర్ (14,284), జోస్ బట్లర్ (14,200) మాత్రమే పరుగుల వేటలో కోహ్లీ కంటే ముందున్నారు.</p>(ANI Pic Service) expand-icon View Photos in a new improved layout
Published on May 14, 2026 11:31 am IST

కేవలం 409 ఇన్నింగ్స్‌ల్లోనే విరాట్ ఈ మార్కును చేరుకోగా, గతంలో 'యూనివర్స్ బాస్' క్రిస్ గేల్ 423 ఇన్నింగ్స్‌ల్లో సాధించిన రికార్డును కోహ్లీ తుడిచిపెట్టాడు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా క్రిస్ గేల్ (14,562), కీరన్ పొలార్డ్ (14,482), అలెక్స్ హేల్స్ (14,449), డేవిడ్ వార్నర్ (14,284), జోస్ బట్లర్ (14,200) మాత్రమే పరుగుల వేటలో కోహ్లీ కంటే ముందున్నారు.

(ANI Pic Service)

5 / 7
<p>ప్రస్తుతం జరుగతున్న ఐపీఎల్ టీ20 టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న కోహ్లీ, కేకేఆర్‌పై తన ప్రతాపం చూపాడు. కేవలం 60 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇది కోహ్లీకి ఐపీఎల్‌లో 9వ సెంచరీ కాగా, ఓవరాల్ టీ20 క్రికెట్‌లో 10వ సెంచరీ. తద్వారా టీ20 ఫార్మాట్‌లో 10 సెంచరీలు బాదిన తొలి భారతీయుడిగా విరాట్ నిలిచాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో క్రిస్ గేల్ (22), బాబర్ ఆజం (13) తర్వాత డేవిడ్ వార్నర్‌తో కలిసి కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.</p><p> </p>(ANI Pic Service) expand-icon View Photos in a new improved layout
Published on May 14, 2026 11:31 am IST

ప్రస్తుతం జరుగతున్న ఐపీఎల్ టీ20 టోర్నీలో వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌట్ అయి తీవ్ర ఒత్తిడిలో ఉన్న కోహ్లీ, కేకేఆర్‌పై తన ప్రతాపం చూపాడు. కేవలం 60 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 105 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇది కోహ్లీకి ఐపీఎల్‌లో 9వ సెంచరీ కాగా, ఓవరాల్ టీ20 క్రికెట్‌లో 10వ సెంచరీ. తద్వారా టీ20 ఫార్మాట్‌లో 10 సెంచరీలు బాదిన తొలి భారతీయుడిగా విరాట్ నిలిచాడు. టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన జాబితాలో క్రిస్ గేల్ (22), బాబర్ ఆజం (13) తర్వాత డేవిడ్ వార్నర్‌తో కలిసి కోహ్లీ మూడో స్థానంలో ఉన్నాడు.

(ANI Pic Service)

6 / 7
<p>ఐపీఎల్‌లో విరాట్ 9 సెంచరీలు బాదగా…. ఇందులో ఛేజింగ్‌ సమయంలో చేసినవి 3. భారత్‌ తరఫున అత్యధిక ఛేజింగ్‌ సెంచరీలు చేసిన క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఓవరాల్‌గా రెండో బ్యాటర్. </p>(ANI Pic Service) expand-icon View Photos in a new improved layout
Published on May 14, 2026 11:31 am IST

ఐపీఎల్‌లో విరాట్ 9 సెంచరీలు బాదగా…. ఇందులో ఛేజింగ్‌ సమయంలో చేసినవి 3. భారత్‌ తరఫున అత్యధిక ఛేజింగ్‌ సెంచరీలు చేసిన క్రికెటర్ విరాట్ కోహ్లీ. ఓవరాల్‌గా రెండో బ్యాటర్.

(ANI Pic Service)

7 / 7
<p>ఐపీఎల్‌లో రెండు వేర్వేరు జట్లపై రెండేసి సెంచరీలు చేసిన తొలి భారత ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ రికార్డు సాధించాడు. గుజరాత్ లయన్స్‌, కేకేఆర్‌పై కోహ్లీ రెండేసి శతకాలు బాదాడు. జోస్‌ బట్లర్ కూడా కేకేఆర్, ఆర్సీబీపై రెండేసి సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే.</p>(ANI Pic Service) expand-icon View Photos in a new improved layout
Published on May 14, 2026 11:31 am IST

ఐపీఎల్‌లో రెండు వేర్వేరు జట్లపై రెండేసి సెంచరీలు చేసిన తొలి భారత ఆటగాడిగా కూడా విరాట్ కోహ్లీ రికార్డు సాధించాడు. గుజరాత్ లయన్స్‌, కేకేఆర్‌పై కోహ్లీ రెండేసి శతకాలు బాదాడు. జోస్‌ బట్లర్ కూడా కేకేఆర్, ఆర్సీబీపై రెండేసి సెంచరీలు సాధించిన సంగతి తెలిసిందే.

(ANI Pic Service)

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE
Story Saved
Saved Articles
Following
My Reads
Sign out
Get App
crown-icon
Subscribe Now!