Krishna River : జూరాలకు భారీగా పెరుగుతున్న వరద -10 గేట్లు ఎత్తివేత, శ్రీశైలానికి కృష్ణమ్మ పరుగులు
Krishna River Flood Updates : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా వరద నీరు వచ్చి చేరుతోంది.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 10 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా వరద నీరు వచ్చి చేరుతోంది.
ప్రస్తుతం జూరాల ప్రాజెక్ట్లోకి 90,000 క్యూసెక్కుల ఇన్ ఫ్లో (వరద నీరు) వచ్చి చేరుతోంది. ప్రాజెక్ట్ భద్రత మరియు నీటి నిల్వలను సమతుల్యం చేయడానికి అధికారులు అవుట్ ఫ్లో పెంచారు.
ఎత్తిన 10 గేట్ల ద్వారా 39,080 క్యూసెక్కుల నీటిని నేరుగా నదిలోకి వదులుతున్నారు. దీనికి అదనంగా, ప్రాజెక్ట్ వద్ద ఉన్న జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని ముమ్మరం చేస్తూ యూనిట్ల ద్వారా 38,272 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపుతున్నారు.
గేట్ల ద్వారా మరియు జలవిద్యుత్ ఉత్పత్తి ద్వారా కలిపి మొత్తంగా ప్రాజెక్ట్ నుంచి దిగువన ఉన్న శ్రీశైలం జలాశయానికి 77,352 క్యూసెక్కుల నీరు చేరుతోంది.
ఎగువ క్యాచ్మెంట్ ప్రాంతాల్లో వర్షాలు ఇలాగే కొనసాగి/// జూరాలకు వచ్చే వరద ప్రవాహం మరింత పెరిగితే అధికారులు మరిన్ని గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు, రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి దిగవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
E-Paper

