ఏపీ వెదర్ రిపోర్ట్ :నేడు ఈ జిల్లాలకు వర్ష సూచన – పిడుగుపాటు హెచ్చరికలు
ఏపీకి ఐఎండీ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే సూచనలున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
ఏపీకి వాతావరణశాఖ రెయిన్ అలర్ట్ ఇచ్చింది. ఇవాళ(జూలై 20) పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మరికొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే సూచనలున్నాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
సోమవారం (జూలై 20, 2026) రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం ప్రధానంగా మేఘావృతమై ఉంటుంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, పోలవరం ప్రాంతం, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, మరియు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులు పడే అవకాశంతో పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఏపీలోని మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
వర్షాలు పడే సమయంలో పిడుగులు సంభవించే ముప్పు ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఆశ్రయం పొందకుండా సురక్షితమైన భవనాల్లో ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
వర్షాలు పడే సమయంలో పిడుగులు సంభవించే ముప్పు ఉన్నందున ప్రజలు, ముఖ్యంగా రైతులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఆశ్రయం పొందకుండా సురక్షితమైన భవనాల్లో ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
రానున్న 3 రోజులు మేఘావృతమైన వాతావరణం ఉండటంతో పాటు పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. తీరం వెంబడి ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.
E-Paper

