41 రోజులు అయ్యప్ప దీక్ష వలన కలిగే లాభాలు, నల్ల దుస్తులు ఎందుకు ధరించాలో తెలుసుకోవడంతో పాటు ఎవరు మాల వేసుకోకూడదు చూడండి!

కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి దాకా చాలా మంది అయ్యప్ప స్వామి భక్తులు మాల ధరించి అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుంటారు. 41 రోజులు కఠిన నియమ నిష్టలతో, భక్తి శ్రద్దలతో అయ్యప్ప దీక్షను పాటిస్తారు. అయ్యప్ప మాలను ధరిస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి? మాల వేసిన వారిని ఎందుకు “స్వామి” అని పిలుస్తారు? 

Published on: Oct 14, 2025, 13:30:08 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి దాకా చాలా మంది అయ్యప్ప స్వామి భక్తులు మాల ధరించి అయ్యప్ప స్వామి వారిని దర్శించుకుంటారు. 41 రోజులు కఠిన నియమ నిష్టలతో, భక్తి శ్రద్దలతో అయ్యప్ప దీక్షను పాటిస్తారు.

అయ్యప్ప దీక్ష (pinterest)
అయ్యప్ప దీక్ష (pinterest)

ఈ సమయంలో నేల మీద నిద్రపోవడం, చల్లటి నీటితో మాత్రమే స్నానం చేయడం, చెప్పులు వేసుకోకుండా ఉండడం, నల్లని దుస్తులు మాత్రమే ధరించడం వంటి నియమాలను ఎన్నో పాటిస్తూ ఉంటారు. అయితే, అయ్యప్ప మాలను ధరిస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయి? మాల వేసిన వారిని ఎందుకు “స్వామి” అని పిలుస్తారు? వంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

స్వామి అని ఎందుకు పిలవాలి?

అయ్యప్ప మాల వేసుకున్నాక ప్రతి ఒక్కరిలో “నేను” అన్న భావన పోతుంది. శరీరానికి ఉండే పేరు ఉండదు. ధరించే దుస్తులు, ఆహారం, ఆచార వ్యవహారాలు, అయ్యప్ప దీక్ష చేపట్టగానే అన్నీ కూడా మారతాయి. అందుకే ఆ వ్యక్తిని అంతర్దానంలో భగవంతుడు స్వరూపంగా భావించి, మనుషులందరిలో దేవుడు ఉన్నాడనే భావనతో “స్వామి” అని పిలుస్తారు.

ఎలాంటి మాలలు ధరిస్తారు?

అయ్యప్ప దీక్ష మణిమాలతో మొదలవుతుంది. ఈ దీక్షను 41 రోజులు పాటు కొనసాగిస్తారు. అయ్యప్ప దీక్ష చేపట్టేవారు తులసి మాల, రుద్రాక్ష మాల, చందనం మాల, స్పటిక మాల, పగడాల మాల, తామర పూసల మాలలు వంటివి ధరిస్తారు. వీటిని ధరించడం వలన శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం రెండూ బాగుంటాయి. ఈ 41 రోజుల పాటు దీక్షను చేపడితే సంతోషంగా ఉండొచ్చని, స్వామివారి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. ఆ తర్వాత 18 మెట్లు ఎక్కి స్వామి వారిని దర్శించుకుంటారు.

ఎవరు మాల వేసుకోకూడదు?

కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు 41 రోజుల పాటు అయ్యప్ప మాలను వేసుకుంటారు. ఒకవేళ తల్లిదండ్రుల్లో ఎవరైనా మరణిస్తే, ఏడాది పాటు మాల వేసుకోకూడదు. భార్య చనిపోయిన సందర్భంలో కూడా ఆరు నెలల పాటు అయ్యప్ప దీక్షకు దూరంగా ఉండాలని పండితులు చెబుతున్నారు.

ఎందుకు నల్ల దుస్తులు ధరించాలి?

అయ్యప్ప దీక్ష చేపట్టే వారంతా నల్లని దుస్తులు మాత్రమే ధరిస్తారు. శని దేవుడికి నలుపు రంగు అంటే ఎంతో ఇష్టం. ఆ రంగు బట్టలు వేసుకుంటే శని ప్రభావం తగ్గుతుంది. చలికాలంలోనే అయ్యప్ప మాలను వేసుకుంటారు. ఆ సమయంలో నల్లని దుస్తులు వెచ్చగా ఉంటాయి.

జనార్ధన సుతం దేవం వాసవేశం మనోహరం

వనవాస ప్రియం దేవం నమామి జగదీశ్వరం..

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More