...
...
Next Story

సెప్టెంబర్ 7న చంద్ర గ్రహణం, 5 రాశుల వారికి శుభ ఫలితాలు.. డబ్బు, పదోన్నతులు, ఇల్లు, వాహనాలతో పాటు ఎన్నో!

చంద్రగ్రహణం: ఈ ఏడాది రెండో, చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్లో ఏర్పడనుంది. చంద్ర గ్రహణం అనేది ఖగోళ దృగ్విషయం, ఇది మతపరమైన ప్రభావాన్ని కూడా కలిగి ఉంటుంది. సంవత్సరంలో చివరి చంద్రగ్రహణం కొన్ని రాశులపై శుభ ప్రభావాన్ని చూపుతుంది. చంద్రగ్రహణం వల్ల ఏయే రాశుల వారిపై ప్రభావం ఉంటుందో తెలుసుకోండి.

Published on: Aug 21, 2025, 10:30:04 IST
By , , Hyderabad
Prefer HTon Google
Advertisement

చంద్ర గ్రహణం 2025 రాశిఫలాలు: ఈ సంవత్సరంలో రెండవ, చివరి చంద్రగ్రహణం సెప్టెంబర్ 07న జరుగుతుంది. ఈ గ్రహణం కుంభరాశిలోని పూర్వ భాద్రపద నక్షత్రంలో జరగబోతోంది. గ్రహణ కాలంలో కుంభరాశిలో సూర్య చంద్రుల కలయిక ఏర్పడుతుంది. చంద్ర గ్రహణం ఖగోళ సంఘటన అయినప్పటికీ, కొన్ని రాశులపై కూడా ప్రభావం చూపుతుంది.

చంద్ర గ్రహణం 2025
చంద్ర గ్రహణం 2025

జ్యోతిషలెక్కల ప్రకారం చంద్రగ్రహణం కొన్ని రాశులపై మంచి ప్రభావం చూపుతుందని, ఈ రాశుల వారికి ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయని అంటున్నారు. దీనితో పాటు సంపద పెరిగి భూమి, భవనం, వాహనం లభిస్తాయి. సెప్టెంబర్ లో వచ్చే చంద్రగ్రహణం వల్ల ఏయే రాశుల వారిపై ప్రభావం ఉంటుందో తెలుసుకోండి.

చంద్రగ్రహణం వేళ ఈ రాశులకు బోలెడు లాభాలు

1. మేష రాశి - మేష రాశి వారికి చంద్రగ్రహణం శుభదాయకంగా ఉంటుంది. గ్రహణం ప్రభావం వల్ల ఆకస్మిక ధనం పొందవచ్చు. వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తుంది. పెట్టిన పెట్టుబడి త్వరగానే వస్తుంది. ఆరోగ్యం మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. మానసిక స్థిరత్వం సాధించవచ్చు. కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయి.

2. మిథున రాశి - మిథున రాశి వారికి చంద్రగ్రహణం వల్ల ప్రయోజనం కలుగుతుంది. దాని ప్రభావం వల్ల మీరు చిక్కుకుపోయిన డబ్బును పొందవచ్చు. పెద్దల ఆశీస్సులు పొందుతారు. ఆరోగ్య సంబంధ సమస్యలను అధిగమిస్తారు. పెట్టుబడులకు మంచి రాబడులు లభించే సూచనలు ఉన్నాయి.

3. కన్యా రాశి : కన్యా రాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు. కోర్టులో విజయం సాధిస్తారు. పనిప్రాంతంలో పదోన్నతితో ఆదాయంలో పెరుగుదలను పొందవచ్చు. సంతానానికి సహాయసహకారాలు లభిస్తాయి.

5. ధనుస్సు రాశి - చంద్రగ్రహణం ప్రభావం ధనుస్సు రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో, మీ సంపద పెరుగుతుంది. తోబుట్టువుల సంబంధాలు మునుపటి కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగ, వృత్తి పరిస్థితి మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

 
ABOUT THE AUTHOR
HT Telugu Desk

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe