గురు పౌర్ణమి నాడు ఈ 5 పసుపు వస్తువులను గురువుకు సమర్పించండి.. పితృ దోషాలు తొలగిపోతాయి, గురు గ్రహం అనుగ్రహం కలుగుతుంది!
ఆషాఢ మాసం పౌర్ణమి నాడు గురు పౌర్ణమిని జరుపుకుంటాం. ఈసారి జూలై 10న వచ్చింది. గురు పౌర్ణమి నాడు గురువు పట్ల భక్తిని తెలియజేస్తాము. ఈ రోజున గురువును ఆరాధించడం వలన పితృ దోషం, గురు గ్రహం యొక్క చెడు ఫలితాలు తొలగిపోతాయి. గురు పౌర్ణమి నాడు ఈ 5 పసుపు వస్తువులను గురువుకు సమర్పించడం చాలా మంచిది.
ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం పౌర్ణమి నాడు గురు పౌర్ణమిని జరుపుకుంటాం. ఈసారి జూలై 10న వచ్చింది. గురు పౌర్ణమి నాడు గురువు పట్ల భక్తిని తెలియజేస్తాము, వారికి కృతజ్ఞతలు చెబుతాము. సనాతన ధర్మంలో గురువుకు భగవంతునితో సమానమైన హోదా ఉంది.

“గురు బ్రహ్మా, గురు విష్ణుః, గురు దేవో మహేశ్వరః.”
ఈ రోజున గురువును ఆరాధించడం వలన పితృ దోషం, గురు గ్రహం యొక్క చెడు ఫలితాలు తొలగిపోతాయి. జ్ఞానం, శ్రేయస్సు, ఆధ్యాత్మిక పురోగతిని పొందవచ్చు.
గురు పౌర్ణమి నాడు ఈ ఐదు పసుపు వస్తువులను గురువుకు ఇవ్వడం మంచిది:
1.పసుపు రంగు దుస్తులు:
పసుపు రంగు దుస్తులను గురు పౌర్ణమి నాడు గురువుకు ఇవ్వడం మంచిది. ఇది నిజానికి శుభ ఫలితాలను అందిస్తుంది. గురు గ్రహాన్ని సంతోషపెట్టేలా చేస్తుంది, జ్ఞానాన్ని పెంచుతుంది. ఇలా పసుపురంగు వస్త్రాలను గురువుకు దానం చేస్తే కెరీర్లో సక్సెస్ను కూడా పొందవచ్చు.
2.పసుపు రంగు మిఠాయిలు:
పసుపు రంగులో ఉండే స్వీట్లను గురువుకు ఈరోజు ఇవ్వడం మంచిది. అలా చేయడం వలన గురుగ్రహం అనుకూలంగా ఉంటుంది. పితృ దోషాల నుండి బయటపడేందుకు ఉపయోగపడుతుంది. అనుకున్న పనులు పూర్తవుతాయి, సంతోషాన్ని పొందవచ్చు.
3.పసుపు:
గురువుకు పసుపును ఇవ్వడం కూడా శుభప్రదం. పసుపు స్వచ్ఛతకు చిహ్నం. పసుపును గురువుకు ఇవ్వడం వలన అనారోగ్య సమస్యలు, పేదరికం, జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయి. వైవాహిక జీవితం సంతోషంగా, ప్రశాంతంగా ఉంటుంది.
4.పసుపు రంగు పండ్లు:
పసుపు రంగు పండ్లను గురు పౌర్ణమి నాడు గురువుకు ఇవ్వడం మంచిది. అరటి పండ్లు, మామిడి పండ్లు వంటి వాటిని గురువుకు ఇవ్వడం వలన గురు గ్రహ అనుగ్రహం లభిస్తుంది. తేటలు పెరుగుతాయి, అదృష్టం కూడా వస్తుంది.
5.పసుపు పూలు:
పసుపు రంగులో ఉండే సంపంగి పూలు, చామంతి పూలు వంటి పూలను గురువుకు ఇవ్వండి. వీటిని గురువుకు ఇవ్వడం వలన ఆధ్యాత్మికపురోగతి కలుగుతుంది. మెదడు ప్రశాంతంగా మారుతుంది, గురు గ్రహం అనుగ్రహం పొందవచ్చు.
గురు పౌర్ణమి నాడు ఇలా ఈ ఐదు వస్తువులను గురువుకు ఇవ్వడం వలన జీవితంలో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి, సంతోషంగా ఉండవచ్చు, పూర్వీకుల ఆశీర్వాదాలు లభిస్తాయి, గురు గ్రహం నుండి శుభ ఫలితాలను పొందవచ్చు, జీవితం సంతోషంగా ఉంటుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper



