...
...
Next Story

నేటి పంచాంగం: ఈరోజు ద్వాదశి వేళ వర్జ్యం, అమృత ఘడియలు, రాహుకాలం వివరాలు తెలుసుకోండి!

హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కాలగణనలో పంచాంగానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంగాల కలయికే పంచాంగం. ఏప్రిల్ 28, మంగళవారం నాటి గ్రహ గతులు, వర్జ్యం మరియు ఇతర కీలక సమయాలను మన పాఠకుల కోసం ప్రత్యేకంగా విశ్లేషిస్తున్నాం.

Published on: Apr 28, 2026, 03:00:36 IST
Advertisement

పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.

నేటి పంచాంగం: ఈరోజు ద్వాదశి వేళ వర్జ్యం, అమృత ఘడియలు, రాహుకాలం
నేటి పంచాంగం: ఈరోజు ద్వాదశి వేళ వర్జ్యం, అమృత ఘడియలు, రాహుకాలం

శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు

మాసం (నెల): వైశాఖ మాసం

పక్షం: శుక్లపక్షం

వారం: మంగళవారం

తిథి: ద్వాదశి సాయంత్రం 6:55 వరకు తర్వాత త్రయోదశి

నక్షత్రం: ఉత్తర రాత్రి 10:34 వరకు తర్వాత హస్త

యోగం: వ్యాఘాతా రాత్రి 9:02 వరకు

కరణం: బవ ఉదయం 6.31 వరకు భాలవ సాయంత్రం 6:55 వరకు

అమృత కాలం: మధ్యాహ్నం 2:59 నుంచి సాయంత్రం 4:40 వరకు

వర్జ్యం: తెల్లవారుజామున 4:53 నుంచి ఉదయం 6:34 వరకు

దుర్ముహుర్తం: మధ్యాహ్నం 8:26 నుంచి ఉదయం 9:17 వరకు రాత్రి 11:05 నుంచి రాత్రి 11:50 వరకు

రాహుకాలం: మధ్యాహ్నం 3.22 నుంచి సాయంత్రం 4.57 వరకు

యమగండం: ఉదయం 9.04 నుంచి ఉదయం 10.39 వరకు

పంచాంగం సమాప్తం

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe