జూలై 21న కామిక ఏకాదశి.. ప్రాముఖ్యత, పూజా విధానం, పరిహారాల పూర్తి వివరాలు ఇవిగో!

కామిక ఏకాదశి నాడు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ రోజున ప్రత్యేకించి లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని ఆరాధించడం వలన సంతోషంగా ఉండొచ్చు, సకల బాధలు తీరుతాయి. కామిక ఏకాదశి తేదీ, సమయంతో పాటు ప్రాముఖ్యత, పూజా విధానం, పరిహారాల పూర్తి వివరాలు తెలుసుకోండి.

Published on: Jul 17, 2025, 15:00:14 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఏకాదశికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రతి నెల శుక్ల పక్షంలో, కృష్ణ పక్షంలో రెండు ఏకాదశులు వస్తాయి. ఆషాడమాసం కృష్ణ పక్ష ఏకాదశి కామిక ఏకాదశి అని అంటారు. కామిక ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ సంవత్సరం కామిక ఏకాదశి ఎప్పుడు వచ్చింది? కామిక ఏకాదశి శుభ సమయం, పరిహారాలు గురించి తెలుసుకుందాం.

జూలై 21న కామిక ఏకాదశి (pinterest)
జూలై 21న కామిక ఏకాదశి (pinterest)

ఈ ఏడాది కామిక ఏకాదశి ఎప్పుడు వచ్చింది?

ఈ ఏడాది కామిక ఏకాదశిజూలై 20న వచ్చిందా, 21న వచ్చిందా అనే సందేహం చాలా మందిలో ఉంది. పంచాంగం ప్రకారం చూసినట్లయితే జూలై 20 మధ్యాహ్నం 12 గంటలకు ఏకాదశి తిథి మొదలవుతుంది, జూలై 21 ఉదయం 9:38 వరకు ఉంటుంది. ఈ లెక్కన జూలై 21న కామిక ఏకాదశిని జరుపుకోవాలి.

విష్ణువు, లక్ష్మీదేవిని ఆరాధించండి

కామిక ఏకాదశి నాడు విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని ఆరాధిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఈ రోజున ప్రత్యేకించి లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని ఆరాధించడం వలన సంతోషంగా ఉండొచ్చు, సకల బాధలు తీరుతాయి. ఏకాదశి ఉపవాసం ఉన్నవారు జూలై 20 మధ్యాహ్నం మొదలుపెట్టి జూలై 21 ఉదయం వరకు ఉండొచ్చు. జూలై 22 ఉదయం 5:37 నుంచి 7:05 గంటల మధ్య ఉపవాసాన్ని విరమించవచ్చు.

కామిక ఏకాదశి నాడు ఏ విధంగా పూజ చేయాలి?

కామిక ఏకాదశి నాడు ఉదయాన్నే తలస్నానం చేసి, విష్ణువు స్వరూపమైన కృష్ణుడిని పూజించాలి. నెయ్యితో దీపారాధన చేసి శ్రీకృష్ణుడిని ఆరాధించాలి. ఈ రోజు విష్ణు సహస్రనామం మంత్రాలను జపిస్తే మంచి జరుగుతుంది. శివకేశవులు అనుగ్రహం కలగాలంటే భజనలు చేయడం మంచిది. ఉపవాసం ఉండేవారు దేవాలయాలను సందర్శించడం వలన కూడా ప్రయోజనాలను పొందవచ్చు.

కామిక ఏకాదశి విశిష్టత:

పాపాల నుంచి విముక్తి పొందడానికి కామిక ఏకాదశి ఎంతో మంచిది. ఆ రోజున ఏకాదశి వ్రతం చేస్తే మోక్షం కలుగుతుంది. ఉపవాసం ఉంటే అశ్వమేధ యాగం చేసినంత పుణ్యంకలుగుతుంది. ఆ రోజున విష్ణుమూర్తిని ఆరాధించడం వలన పితృదేవతలు సంతృప్తి చెందుతారు.

ఎలాంటి పరిహారాలు పాటించాలి?

  • శుభకార్యాలు చేయడానికి కామిక ఏకాదశి అనుకూలంగా ఉంటుంది. ఏదైనా పనిని మొదలు పెడితే అది విజయవంతంగా పూర్తవుతుంది. ఆర్థిక శ్రేయస్సు, ఐశ్వర్యం కూడా కలుగుతుంది.
  • శివలింగానికి అభిషేకం చేసి ఉమ్మెత్త పూలు, బిల్వపత్రాలు, జమ్మి పత్రాలను సమర్పిస్తే కూడా మంచిది.
  • 'ఓం నమః శివాయ' మంత్రాన్ని జపిస్తే ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.
  • అదే విధంగా మహామృత్యుంజయ మంత్రం, శివ చాలీసా, రుద్రాష్టకం పఠిస్తే కూడా ఎంతో మంచి ఫలితాన్ని పొందవచ్చు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More