గురువు-చంద్రుని కలయికతో గజకేసరి రాజయోగం, ఈ మూడు రాశులకు బోలెడు లాభాలు.. ఇల్లు, వాహనాలు, విజయాలు, వాహనాలు ఇలా ఎన్నో!

గ్రహాల మార్పు 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. గ్రహాలు శుభయోగాలను, అశుభయోగాలను కూడా తీసుకువస్తూ ఉంటాయి. త్వరలో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. గురువు-చంద్రుని కలయికతో ఈ రాజయోగం ఏర్పడుతుంది. ఇది చాలా శక్తివంతమైనది. ఇది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. 

Published on: Jul 16, 2025 3:00 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. గ్రహాలమార్పు 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. గ్రహాలు శుభయోగాలను, అశుభయోగాలను కూడా తీసుకువస్తూ ఉంటాయి. త్వరలో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. గురువు-చంద్రుని కలయికతో ఈ రాజయోగం ఏర్పడుతుంది. ఇది చాలా శక్తివంతమైనది.

గజకేసరి యోగం (pixabay)
గజకేసరి యోగం (pixabay)

గజకేసరి రాజయోగం

జూలై 22 ఉదయం 8:14కు చంద్రుడుమిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. గురువు ఇప్పటికే ఈ రాశిలో ఉండడం వలన గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. ఇది అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కానీ మూడు రాశుల వారికి మాత్రం మంచి జరుగుతుంది. ఈ గజకేసరి రాజయోగంతో ఈ రాశులకే బోలెడు లాభాలు.

1.మిథున రాశి:

గజకేసరి రాజయోగం మిథునరాశిలో ఏర్పడుతుంది. మిథున రాశి వారికి ఇది శుభ ఫలితాలను అందిస్తుంది. ఇన్వెస్ట్మెంట్ చేస్తే భారీగా లాభాలు పొందుతారు. విదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది. విజయవంతమైన జీవితాన్ని గడుపుతారు. వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు కూడా తీరిపోతాయి. మీ తండ్రి సహాయంతో సక్సెస్‌ను సులభంగా అందుకుంటారు.

2.సింహ రాశి:

సింహ రాశి వారికి గజకేసరి రాజయోగం శుభ ఫలితాలను తీసుకువస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారు సంతోషంగా ఉంటారు. ఉద్యోగస్తులకు పని ప్రదేశంలో సంతోషం ఉంటుంది. పిల్లలకు సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం కూడా బాగుంటుంది. జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది. ఇల్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు.

3.కన్య రాశి:

కన్య రాశివారికి కూడా గజకేసరి రాజయోగం శుభ ఫలితాలను అందిస్తుంది. ఈ సమయంలో కన్య రాశి వారు సక్సెస్‌ను అందుకుంటారు. అనుకున్న ప్రతి వాటిలో విజయాన్ని పొందుతారు. విద్యార్థులు కూడా సక్సెస్‌ను పొందుతారు. కెరీర్‌లో కూడా కలిసి వస్తుంది. భాగస్వామి నుంచి శుభవార్త వింటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

  • HT Telugu Desk
    ABOUT THE AUTHOR
    HT Telugu Desk

    హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More