కార్తీక మాసంలో శివుడిని ఆరాధించేటప్పుడు ఏ రాశి వారు ఏ మంత్రాలను జపించాలి? ఇలా చేస్తే కష్టాలు తీరుతాయి, సంతోషంగా ఉంటారు!

కార్తీకమాసంలో శివుడిని ప్రత్యేకించి ఆరాధిస్తారు. శివుడిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. కార్తీక మాసంలో శివుడిని ఆరాధించేటప్పుడు మీ రాశి ప్రకారం ఈ మంత్రాలను చదువుకుంటే మంచి జరుగుతుంది. మీ రాశి ప్రకారం ఈ మంత్రాలను చదివి శివుడిని పూజించడం వలన శివుని అనుగ్రహంతో సకల సంతోషాలను పొందవచ్చు.

Published on: Oct 23, 2025, 15:00:07 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కార్తీకమాసంలో శివుడిని ప్రత్యేకించి ఆరాధిస్తారు. శివుడిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని నమ్ముతారు. ఈ పవిత్రమైన మాసంలో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలను కూడా చేస్తారు. కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉంటారు. అలాగే ఏకాదశి, ద్వాదశి, పౌర్ణమి ఈనాడు కూడా శివుడిని ప్రత్యేకించి ఆరాధిస్తారు. శక్తి సామర్థ్యాల మేరకు శివునికి జలాభిషేకం, పాలు, పెరుగు, తేనే, నెయ్యితో అభిషేకం కూడా చేస్తారు.

కార్తీక మాసంలో శివుడిని ఆరాధించేటప్పుడు ఏ రాశి వారు ఏ మంత్రాలను జపించాలి? (pinterest)
కార్తీక మాసంలో శివుడిని ఆరాధించేటప్పుడు ఏ రాశి వారు ఏ మంత్రాలను జపించాలి? (pinterest)

ఇది ఇలా ఉంటే, ఈ కార్తీక మాసంలో శివుడిని ఆరాధించేటప్పుడు మీ రాశి ప్రకారం ఈ మంత్రాలను చదువుకుంటే మంచి జరుగుతుంది. మీ రాశి ప్రకారం ఈ మంత్రాలను చదివి శివుడిని పూజించడం వలన శివుని అనుగ్రహంతో సకల సంతోషాలను పొందవచ్చు, ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మరి ఏ రాశి వారు ఏ మంత్రాన్ని జపిస్తే బాగా కలిసి వస్తుందో ఇప్పుడే తెలుసుకుందాం.

కార్తీక మాసంలో శివుడిని ఆరాధించేటప్పుడు ఏ రాశి వారు ఏ మంత్రాలను జపించాలి?

మేష రాశి:

మేష రాశి వారు కార్తీకమాసంలో “ఓం మహాకాలాయ నమః”, “ఓం నమః శివాయ” అనే మంత్రాలను జపిస్తే బాగా కలిసి వస్తుంది. ముఖ్యంగా సోమవారం నాడు ఈ మంత్రాలను జపించేలా చూడండి. దీంతో శివయ్య అనుగ్రహం కలుగుతుంది.

వృషభ రాశి:

వృషభ రాశి వారు శివుని అనుగ్రహాన్ని పొందడానికి “ఓం విశ్వనాథాయ నమః”, “ఓం నాగేశ్వరాయ నమః” అనే మంత్రాలను జపించండి. దీంతో శివుని అనుగ్రహంతో సంతోషంగా ఉండవచ్చు, కష్టాలన్నీ తొలగిపోతాయి.

మిథున రాశి:

మిథున రాశి వారు ఈ కార్తీకమాసంలో చంద్రుడుని ప్రసన్నం చేసుకోవాలంటే “ఓం విస్తారాయ నమః” మంత్రాన్ని జపించండి. ఇలా చేయడం వలన సులభంగా కార్తీకమాసంలో చంద్రుని ప్రసన్నం చేసుకోవచ్చు.

కర్కాటక రాశి:

కర్కాటక రాశి వారు కార్తీకమాసంలో “ఓం చంద్రమౌళీశ్వరాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే, శివయ్య అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.

సింహ రాశి:

ఈ రాశి వారు “ఓం రుద్రనాథాయ నమః” అనే మంత్రాన్ని కార్తీకమాసంలో జపిస్తే మంచిదే. ముఖ్యంగా కార్తీక సోమవారం నాడు జపించేలా చూసుకోండి.

కన్యా రాశి:

కన్యా రాశి వారు “ఓం త్రిపురారాయ నమః” మంత్రాన్ని పాటించాలి. ఈ మంత్రాన్ని పఠించడం వలన శివుని అనుగ్రహంతో అన్నింట్లో విజయాలు కలుగుతాయి.

తులా రాశి:

తులా రాశి వారు “ఓం దిననాథాయ నమః”, “ఓం నందీశ్వరాయ నమః” అనే మంత్రాలను జపిస్తే బాగా కలిసి వస్తుంది. శివుని అనుగ్రహంతో ఎల్లవేళలా సంతోషం ఉంటుంది.

వృశ్చిక రాశి:

వృశ్చిక రాశి వారు కార్తీకమాసంలో “ఓం మహేశ్వరాయ నమః” అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని జపించడం వలన శివయ్య అనుగ్రహంతో ఇబ్బందులు తొలగిపోతాయి.

ధనుస్సు రాశి:

ధనుస్సు రాశి వారు “ఓం దేవదీశ్వరాయ నమః”, “ఓం నమః శివాయ” మంత్రాలను జపించాలి. ఈ మంత్రాలను జపిస్తే శివుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది.

మకర రాశి:

మకర రాశి వారు కార్తీకమాసంలో “ఓం శివదానీశ్వరాయ నమః” అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని పఠిస్తే శివుని అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు.

కుంభ రాశి:

కుంభ రాశి వారు కార్తీకమాసంలో “ఓం పాతాళేశ్వరాయ నమః” అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వలన మానసిక ఒత్తిడి కూడా తొలగిపోతుంది.

మీన రాశి:

మీన రాశి వారు “ఓం మహాదేవాయ నమః” అనే మంత్రాన్ని పఠించాలి. దీంతో శివుని అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండొచ్చు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More