వాస్తు ప్రకారం ఈ గుర్తులు ఇంటి ముఖద్వారంపై ఉంటే అదృష్టం కలిసి వస్తుంది.. సానుకూల శక్తి ప్రవహిస్తుంది!
హిందూ మతం ప్రకారం కొన్ని ఫోటోలు, చిహ్నాలు సానుకూల శక్తిని తీసుకొచ్చి ప్రతికూల శక్తిని తొలగిస్తాయి. అయితే, వాటిని ఇంటి సరైన దిశలో ఉంచితే చక్కటి ఫలితం కనబడుతుంది, ఎన్నో మార్పులు చూడొచ్చు.ఈరోజు వాటికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. ఇంటి ప్రధాన ద్వారానికి ఈ గుర్తులు ఉంటే మంచి జరుగుతుంది.
వాస్తు ప్రకారం పాటించడం వలన సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. వాస్తు ప్రకారం పాటించడం వలన ఇబ్బందుల నుంచి కూడా బయటపడొచ్చు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ గుర్తులు ఇంటికి ఉన్నట్లయితే, సానుకూల శక్తి వ్యాపించడంతో పాటుగా అనేక లాభాలని పొందవచ్చు.

వాస్తుప్రకారం, హిందూ మతం ప్రకారం కొన్ని ఫోటోలు, చిహ్నాలు సానుకూల శక్తిని తీసుకొచ్చి ప్రతికూల శక్తిని తొలగిస్తాయి. అయితే, వాటిని ఇంటి సరైన దిశలో ఉంచితే చక్కటి ఫలితం కనబడుతుంది, ఎన్నో మార్పులు చూడొచ్చు.ఈరోజు వాటికి సంబంధించిన ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. ఇంటి ప్రధాన ద్వారానికి ఈ గుర్తులు ఉంటే మంచి జరుగుతుంది.
1.ఓంకారం:
ఓంకారం ఇంటి తలుపుకు ఉండడం వలన శుభఫలితాలు కనపడతాయి, సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. కాబట్టి, కచ్చితంగా ఇంటి ప్రధాన ద్వారానికి ఓంకారం ఉండేటట్టు చూసుకోండి.
2.పంచశూల:
వాస్తు ప్రకారం, ఇది సానుకూలశక్తిని ప్రవహించేలా చేసి, ప్రతికూల శక్తిని తొలగిస్తుంది. ఇంటి ప్రధాన దగ్గర, ప్రధాన ద్వారం దగ్గర ఇది ఉంటే సంతోషం, శాంతి కలుగుతాయి.
3.స్వస్తిక్:
ఇంటిప్రధాన ద్వారానికి స్వస్తిక్ గుర్తు ఉంటే చాలా మంచి జరుగుతుంది. ఈ గుర్తు సానుకూల శక్తిని తీసుకురావడమే కాక, వాస్తు దోషాలను తొలగిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు కూడా ఉండవు.
4.కమలం పువ్వు:
హిందూపురాణాల ప్రకారం, కమలం పువ్వు ఇంటి ప్రధాన ద్వారం దగ్గర ఉంటే మంచి జరుగుతుంది. కమలం గుర్తుని ఇంటి ప్రధాన ద్వారం మీద వేయడం వలన సిరి సంపదలకు లోటు ఉండదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు.
5.త్రిశూలం:
త్రిశూలం గుర్తు ప్రధాన ద్వారం పై ఉంటే చాలా మంచి జరుగుతుంది. దుష్ట శక్తులు రాకుండా చేస్తుంది.
6.కలశం:
సముద్ర మథనం సమయంలో చివర్లో ధన్వంతరి దేవుడు అమృతంతో కూడిన కుండతో ఉద్భవించాడు. దానికి ప్రతీకగా కలశం ఆనందం, శ్రేయస్సు, సంపదను తీసుకువస్తుంది. కలశం నోట్లో విష్ణువు, మెడలో రుద్రుడు, మూలాధారంలో బ్రహ్మ, మధ్యలో శక్తి దేవి నివసిస్తారు అని అంటారు. కలశం పైనకొబ్బరికాయను పెడుతుంటాము. ఆ కలశం విష్ణువు, వరుణ దేవుళ్లను సూచిస్తుంది, కొబ్బరికాయ లక్ష్మీదేవికి చిహ్నంగా పరిగణించబడుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper



