...
...
Next Story

Today Panchangam: ఈరోజు పంచాంగం.. ఆదివారం, ద్వాదశి వేళ దుర్ముహూర్తం, అమృతకాలం వివరాలు!

హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కాలగణనలో పంచాంగానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. తిథి, వారం, నక్షత్రం, యోగం, కరణం అనే ఐదు అంగాల కలయికే పంచాంగం. జూలై 26, ఆదివారం నాటి గ్రహ గతులు, వర్జ్యం మరియు ఇతర కీలక సమయాలను మన పాఠకుల కోసం ప్రత్యేకంగా విశ్లేషిస్తున్నాం.

Published on: Jul 26, 2026, 03:00:59 IST
Advertisement

పంచాంగం ప్రకారం పంచాంగంలో 5 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అవి తిథి, వారం, నక్షత్రం, కరణం, యోగం. బవ తదితర కరణాలు 11 ఉంటాయి. తిథిలో సగభాగంగా వీటిని లెక్కిస్తారు. రెండు కరణాలు ఒక యోగం.

ఈరోజు రాశిఫలాలు: కెరీర్, ప్రేమ, ధనయోగం ఎలా ఉంది? మీ రాశి ఫలితం తెలుసుకోండి
ఈరోజు రాశిఫలాలు: కెరీర్, ప్రేమ, ధనయోగం ఎలా ఉంది? మీ రాశి ఫలితం తెలుసుకోండి

శ్రీ పరాభవ నామ సంవత్సరం, దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు

మాసం (నెల): ఆషాడ మాసం

పక్షం: శుక్ల పక్షం

వారం: ఆదివారం

తిథి: ద్వాదశి మధ్యాహ్నం 1:57 వరకు తర్వాత త్రయోదశి

నక్షత్రం: జ్యేష్ఠ ఉదయం 7:27 వరకు

యోగం: ఇంద్ర రాత్రి 9:54 వరకు

కరణం: భాలవ 1:57 వరకు కౌలవా తెల్లవారుజామున 3:07 వరకు

అమృత కాలం: తెల్లవారుజామున 3:22 నుంచి తెల్లవారుజామున 5:10 వరకు

వర్జ్యం: సాయంత్రం 4:32 నుంచి సాయంత్రం 6:20 వరకు

దుర్ముహుర్తం: సాయంత్రం 5:04 నుంచి సాయంత్రం 5:56 వరకు

రాహుకాలం: సాయంత్రం 5.11 నుంచి సాయంత్రం 6.47 వరకు

యమగండం: మధ్యాహ్నం 12.22 నుంచి మధ్యాహ్నం 1.58 వరకు

పంచాంగం సమాప్తం

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe