జ్యేష్ఠ మాసంలో ముఖ్యమైన వట సావిత్రి వ్రతం.. వ్రతాచరణ విధానం తెలుసా?
వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్ఠు, మాంగల్యభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వటవృక్షం (మర్రి చెట్టు) పూజతో పాటు, సతీమతుల అయిన సావిత్రీ దేవిని ఈ రోజున అత్యంత భక్తితో ఆరాధిస్తారు. ప్రముఖ పంచాంగకర్త, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ ఈ వ్రత విశిష్టతను వివరించారు.

వటసావిత్రి వ్రతం జ్యేష్ఠ మాసంలో అత్యంత ముఖ్యమైన వ్రతంగా పరిగణించబడుతుంది. వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్ఠు, మాంగల్యభాగ్యం కోసం ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వటవృక్షం (మర్రి చెట్టు) పూజతో పాటు, సతీమతుల అయిన సావిత్రీదేవిని ఈ రోజున అత్యంత భక్తితో ఆరాధిస్తారు.
ప్రముఖ పంచాంగకర్త, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ ఈ వ్రత విశిష్టతను వివరిస్తూ, సావిత్రీ యమధర్మరాజునే ఓడించి, తన భర్త సత్యవానిని తిరిగి బ్రతికించిన ఘనతను గుర్తు చేశారు. ఆమె ధైర్యం, భక్తి, నిశ్ఛల ప్రేమకు ఇది చిరస్మరణీయ గుర్తుగా నిలుస్తుంది.
వ్రత పద్ధతి:
వ్రతాచరణలో క్షమ, దయ, దానం, శౌచం, ఇంద్రియనిగ్రహం, దేవపూజ, అగ్నిహోత్రం, సంతోషం వంటి విలువలను పాటించడం అత్యవసరం. వ్రతమేదైనా సరే, సంకల్పం ప్రధానమైనదిగా భావిస్తారు. వ్రతఆచరణ ద్వారా ఉన్నత జీవితం గడపడానికి అర్హత చేకూరుతుంది.
ప్రతాలలో ముఖ్యంగా మూడు అంశాలకు ప్రాధాన్యం ఉంటుంది:
- నియమ – సంయమనం
- దేవతా ఆరాధన
- లక్ష్యప్రాప్తి
జ్యేష్ఠ మాసం విశిష్టత:
జ్యేష్ఠ మాసం నక్షత్రంతో కూడిన పూర్ణిమగల మాసం. జ్యేష్ఠా నక్షత్రానికి అధిపతి ఇంద్రుడు. ఈ మాసంలో వటసావిత్రి వ్రతంతో పాటు రంభావ్రతం వంటి ఇతర వ్రతాలు కూడా ప్రాధాన్యత కలిగి ఉన్నాయి.
వటవృక్షం – ఒక దేవవృక్షం. ఇందులో వట మూలంలో బ్రహ్మా మధ్య భాగంలో శ్రీమహావిష్ణువు అగ్ర భాగంలో శివుడు నివసిస్తారని పూరాణాల వివరణ.
శ్లోకం:
"వట మూలే స్థితో బ్రహ్మా వట మధ్య జనార్దనః
వటాగ్రేతు శివో దేవః సావిత్రీ పట సంశ్రితాః"
వ్రతాచరణ విధానం:
- జ్యేష్ఠమాసంలో వటవృక్షం కింద సావిత్రీ మాతా ప్రతిమను ప్రతిష్ఠించి, రాత్రంతా జాగారం చేసి పూజించాలి.
- మహిళలు ఉపవాసం ఉండి, పవిత్ర జలంతో వటవృక్షాన్ని తడపాలి.
- వృక్షం చుట్టూ 108 సార్లు పసుపు/ఎరుపు దారం చుట్టాలి.
- అనంతరం నీరు, బియ్యం, పూలతో వృక్షరాజాన్ని పూజించాలి.
- మర్రిచెట్టు అందుబాటులో లేనివారు దాని రూపాన్ని పళ్లెంలో ఉంచి పూజించవచ్చు.
- మూడురోజులు పూజించి, చివర రోజుఉపవాసం విరమించి, ముత్తయిదువల ఆశీర్వాదం తీసుకోవాలి.
- ప్రసాదం నివేదించి, బంధువులతో పంచుకోవాలి. శక్తిమేరకు అన్నదానం, వస్త్రదానం చేయాలి.
- గర్భిణులు, వృద్ధులు వంటి వారు ఉపవాసం చేయలేకపోయినా, వ్రతాన్ని ఆచరించడం వల్ల సరైన ఫలితం దక్కుతుందని చిలకమర్తి తెలిపారు.
పంచాంగ కర్త: బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ - 9494981000
ABOUT THE AUTHORHT Telugu Deskహెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.Read More

E-Paper












