...
...
Next Story

ఇంట్లో చేసిన చివరి రొట్టెను కుక్కకే ఎందుకు పెట్టాలి? ఆర్థిక సమస్యలు పోతాయా?

కొన్ని నమ్మకాల ప్రకారం.. ఇంట్లోని మొదటి రొట్టెను ఆవుకు, చివరి రొట్టెను కుక్కకు ఇవ్వాలి. దీనివల్ల రాహు, కేతు, శని దోషాలు, ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి.

Published on: May 17, 2026, 19:35:07 IST
Advertisement

భారతీయ సంస్కృతిలో, సనాతన ధర్మంలో అన్నదానానికి చాలా ఉన్నత స్థానం ఉంది. మన పెద్దలు ఇంట్లో వంట చేసేటప్పుడు కొన్ని ప్రత్యేక నియమాలను, సంప్రదాయాలను కచ్చితంగా పాటించేవారు. వాటిలో అత్యంత ముఖ్యమైనది, ఇంట్లో చేసిన మొదటి రొట్టెను లేదా చపాతిని ఆవుకు ఇవ్వడం. ఇలా చేయడం వల్ల దేవతలందరి ఆశీస్సులు లభిస్తాయని బలంగా నమ్ముతారు.

కుక్కకు చివరి రొట్టె ఎందుకు పెట్టాలి?
కుక్కకు చివరి రొట్టె ఎందుకు పెట్టాలి?

అయితే ఇంట్లో తయారుచేసిన చివరి రొట్టెను ఎవరికి ఇవ్వాలనే దానిపై కూడా ఒక నియమం ఉంది. జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లోని చివరి రొట్టెను కుక్కకే ఇవ్వాలి. దీని వెనుక ఉన్న ముఖ్యమైన ఆధ్యాత్మిక కారణాల గురించి ఇక్కడ తెలుసుకోండి.

హిందూమతంలో కుక్కలను కాలభైరవుని వాహనంగా భావిస్తారు. ప్రతిరోజూ ఇంట్లో చేసిన చివరి రొట్టెను కుక్కకు పెట్టడం వల్ల మీ కుటుంబానికి కాలభైరవుని సంపూర్ణ ఆశీస్సులు లభిస్తాయి. శాస్త్రాల ప్రకారం.. భైరవుని ఆశీస్సులతో అకాల మరణం, ఆకస్మిక ప్రమాదాలు లేదా కుటుంబానికి సంభవించే ఏవైనా పెద్ద ఆపదలు సులభంగా పోతాయి. అంతేకాకుండా కుక్కకు క్రమం తప్పకుండా రొట్టె లేదా ఆహారం పెట్టడం ద్వారా, ఇంట్లోని చెడు, ప్రతికూల శక్తులు నశించి, ఇంటి వాస్తు దోషాలు కూడా పూర్తిగా తొలగిపోతాయి.

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు, కేతు, శని గ్రహాలతో కుక్కలకు సంబంధం ఉందని విశ్లేషించారు. జాతకంలో రాహు, కేతువులలో దోషం ఉంటే, ఆ వ్యక్తి జీవితంలో అనేక అడ్డంకులు, తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు, కుటుంబంలో అనవసరమైన కలహాలను ఎదుర్కొంటారు. ఈ దోషాలను తొలగించడానికి అత్యంత సులభమైన, ప్రభావవంతమైన మార్గం ఏంటంటే.. ఇంట్లో మిగిలిపోయిన చివరి రొట్టెలో కొద్దిగా ఆవనూనె లేదా నెయ్యి వేసి నల్ల కుక్కకు పెట్టడం మంచిదని చెబుతారు. దీనివల్ల శని దేవుని చెడు దృష్టి కూడా తొలగిపోయి, శని దోషం, ఏడున్నర శని, అష్టమ శని వంటి కష్టాల నుండి సులభంగా బయటపడుతారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe