రేపు శనివారం+యోగినీ ఏకాదశి+అశ్విని నక్షత్రం.. ఈ 5 పనులు చేసారంటే, ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి!

ప్రతి ఏకాదశి రోజున శ్రీ విష్ణుమూర్తిని ఆరాధించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. యోగినీ ఏకాదశి నాడు భక్తితో ఉపవాసం ఉంటే, 88 వేల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యం లభిస్తుంది. రేపు శనివారం+యోగినీ ఏకాదశి+అశ్విని నక్షత్రం. ఈ 5 పనులు చేసారంటే, ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి.

Published on: Jun 20, 2025 12:00 PM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

జేష్ఠ మాసం కృష్ణ పక్షంలో వచ్చే ఏకాదశిని యోగినీ ఏకాదశి అంటారు. హిందూ మతంలో యోగినీఏకాదశికి ఎంతో ప్రత్యేకత ఉంది. ప్రతి ఏకాదశి రోజున శ్రీ విష్ణుమూర్తిని ఆరాధించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. యోగినీ ఏకాదశి నాడు భక్తితో ఉపవాసం ఉంటే, 88 వేల మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టిన పుణ్యం లభిస్తుంది.

రేపు శనివారం+యోగినీ ఏకాదశి+అశ్విని నక్షత్రం (pinterest)
రేపు శనివారం+యోగినీ ఏకాదశి+అశ్విని నక్షత్రం (pinterest)

యోగినీ ఏకాదశి సమయం:

యోగినీ ఏకాదశి జూన్ 21 శనివారంనాడు వచ్చింది. జ్యేష్ఠ మాసం కృష్ణ పక్ష ఏకాదశి జూన్ 21 ఉదయం 7:18కి మొదలవుతుంది, జూన్ 22 ఉదయం 4:27తో ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం చూడాలి కనుక జూన్ 21న యోగినీ ఏకాదశిని జరుపుకోవాలి.

శనివారం + యోగినీ ఏకాదశి + అశ్విని నక్షత్రం

శనివారం నాడు యోగినీ ఏకాదశి రావడం శుభప్రదం. ఈరోజు శ్రీ విష్ణుమూర్తిని భక్తి, శ్రద్ధలతో ఆరాధించడం వలన విశేష ఫలితాలను పొందవచ్చు. యోగినీ ఏకాదశినాడు ఈ పనులు కచ్చితంగా చేయండి.

యోగినీ ఏకాదశి అదీ శనివారం వచ్చినందున, ఈరోజు సరిగ్గా వినియోగించుకుంటే సమస్యలన్నీ తీరిపోతాయి. ఈ ఏడాది మొదలైనప్పటి నుంచి ప్రతికూల శక్తితో ఇబ్బంది పడుతున్నవారు, ఆర్థికఇబ్బందులతో సతమతమవుతున్నవారు, ఏదో ఒక ఇబ్బంది వస్తున్నట్లు అనిపిస్తున్నవారు ఈ పరిహారాలను పాటించండి. ఇలా చేయడం వలన సానుకూల శక్తి ప్రవహించి, ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా బయటపడవచ్చు.

యోగినీ ఏకాదశి నాడు చేయవలసిన ముఖ్యమైన పనులు:

  1. తులసి మొక్క చుట్టూ ప్రదక్షిణలు చేయండి.
  2. తులసి మొక్క ఎదుట దీపారాధన చేయండి.
  3. తులసిఆకులను శ్రీ విష్ణుమూర్తికి సమర్పించండి.
  4. విష్ణుమూర్తికి చేసిన ప్రసాదంలో తులసి ఆకులను వేసి నైవేద్యంగా సమర్పించండి.
  5. శ్రీ విష్ణుమూర్తికి తులసి అంటే ఎంతో ఇష్టం కనుక, యోగినీ ఏకాదశి నాడు తులసిని సమర్పించండి.
  6. తులసి మాలతో విష్ణుమూర్తిని అలంకరించండి. అలాగే విష్ణుమూర్తికి సంబంధించి ఏ ఆలయానికైనా వెళ్లండి.

ఈ మంత్రాన్ని జపించండి

"ఓం నమో భగవతే వాసుదేవాయ" అనే మంత్రాన్ని 108 సార్లు భక్తి శ్రద్ధలతో జపించండి. అలా చేయడం వలన శ్రీ విష్ణువు అనుగ్రహం లభించి, సమస్యలన్నీ తీరిపోతాయి. సంతోషంగా ఉండవచ్చు. కష్టాలన్నీ తొలగిపోతాయి.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.