కోకాపేటలో ఎకరం రూ.137 కోట్లు.. మరోసారి వేలంలో రికార్డు ధర!

హైదరాబాద్‌లో భూమి బంగారంలా మారింది. తాజాగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్‌ మరోసారి రికార్డు సృష్టించింది. కోకాపేటలో ఎకరం భూమి రూ.137 కోట్లు పలికింది.

Published on: Nov 24, 2025, 18:23:50 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

రంగారెడ్డి జిల్లా కోకాపేటలో భూముల ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి కోకాపేట భూమి రికార్డు సృష్టించింది. తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన భూముల ఈ వేలంలో ప్లాట్లు ఊహించని ధరలు పలికాయి. ప్రభుత్వం నిర్వహించిన ఈ వేలంలో ఎకరం రూ.137 కోట్లు పలికింది.

కోకాపేటలో ఎకరం రూ.137 కోట్లు
కోకాపేటలో ఎకరం రూ.137 కోట్లు

నియోపొలీస్ లేఅవుట్‌లో హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) నిర్వహించిన వేలంలో ఎకరం భూమికి రికార్డు స్థాయిలో రూ.137.25 కోట్ల ధర పలికింది. మెుత్తం 9.90 ఎకరాల ప్లాట్‌ను రూ.1355.33 కోట్లకు కొనుగోలు చేశారు.

అధికారులు ఈ లేఅవుట్‌ను అంతర్జాతీయ సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. వేలంలో చూసుకుంటే మెుదటి రౌండ్‌లో రెండు ప్లాట్లు అమ్ముడుపోయాయి. ప్లాట్ నెంబర్ 17లో 4.59 ఎకరాలకు గానూ ఎకరానికి రూ.136.50 కోట్లకు, ప్లాట్ నెంబర్ 18లో ఎకరానికి రూ.137.25 కోట్ల చొప్పున 5.31 ఎకరాలు అమ్ముడుపోయాయి. హెచ్ఎండీఏ మెుదటి బిడ్ కనీస ధర రూ.99గా నిర్ధారించి డైరెక్ట్ బిడ్డింగ్ నిర్వహించింది. ఈ లేఅవుట్ 40 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దీని అభివృద్ధి కోసం దాదాపు రూ.300 కోట్లను ఖర్చు చేశారు.

అయితే కోకాపేట భూములకు ఇప్పుడే కాదు.. గతంలోనే రెక్కలు వచ్చాయి. ఎవరూ ఊహించిని విధంగా ఒక్కసారిగా ధరలు భారీగా పెరిగాయి. 2023లో కోకాపేటలో ఎకరం భూమి రూ.100.75 కోట్లకు అమ్ముడైంది. ఇప్పుడు చూస్తే అంతకుమించి ధర పలికింది.

హెచ్‌డీంఏ మెుత్తం వేలం నుంచి రూ.5000 కోట్లకు పైగా ఆదాయం రావాలని ఆశిస్తుంది. కోకాపేట నియోపోలీస్ ప్లాట్‌లకు రూ.99 కోట్లు, గోల్డెన్ మైల్‌కు రూ.70 కోట్లు, మూసాపేట ప్లాట్‌లకు రూ.75 కోట్లు కనీస ధరలను నిర్ధారించిన విషయం తెలిసిందే. మిగిలిన ప్లాట్లకు వేలం నవంబర్ 28, డిసెంబర్ 3, 5 తేదీల్లో జరగనున్నాయి. ఈ వేలాలు కూడా రికార్డు ధరలు వస్తాయని అధికారులు అనుకుంటున్నారు.

మెున్నటికి మెున్న రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోనూ టీఎస్ఐఐసీ నిర్వహించిన ఈ వేలంలో 18.67 ఎకరాల ప్రభుత్వ భూములు రూ.3135 కోట్లకు అమ్ముడైన విషయం తెలిసిందే. ఇక్కడ ఎకరానికి రూ.177 కోట్ల ధర పలికింది. అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ధర అత్యధికం. ఈ భూమి ఐటీ కంపెనీల మధ్య ఉండటంతో పోటీ ఎక్కువ ఉంది. ఇక ఇప్పుడు మళ్లీ కోకాపేటలోనూ రికార్డు స్థాయిలో భూములకు ధరలు పలికాయి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More