Siddipet Car Accident : సిద్దిపేటలో ఘోర ప్రమాదం - బావిలోకి దూసుకెళ్లిన కారు, నలుగురు మృతి
Siddipet Car Accident : సిద్దిపేట జిల్లా అప్పన్నపల్లి వద్ద అర్ధరాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బంధువు దశ దినకర్మ ముగించుకుని వస్తుండగా కారు బావిలోకి దూసుకెళ్లి ఇద్దరు చిన్నారులతో సహా దంపతులు ప్రాణాలు కోల్పోయారు.
Siddipet Car Accident : సిద్దిపేట జిల్లాలో అర్ధరాత్రి వేళ తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు, తిరిగి వస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పసిపిల్లలు కూడా ఉండటంతో స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది.

దుబ్బాక మండలం బల్వంతాపూర్కు చెందిన దండుగుల రాజు (30) ఇసుక వ్యాపారం చేస్తున్నారు. ఆయన తన భార్య భాగ్య (25), కుమారుడు నిహాన్ష్ (4), కుమార్తె శాన్విక (2)తో కలసి సిద్దిపేటలో జరిగిన ఒక బంధువు దశ దినకర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమం ముగిసిన తర్వాత అర్థరాత్రి వేళ స్వగ్రామానికి కారులో బయలుదేరారు.
వాహనం దుబ్బాక మండలం అప్పన్నపల్లి శివారుకు చేరుకోగానే ఊహించని ప్రమాదం జరిగింది. రాజు తోలుతున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న ఒక లోతైన బావిలోకి దూసుకెళ్లింది. అర్ధరాత్రి కావడం, ఆ ప్రాంతంలో జనసంచారం లేకపోవడంతో ప్రమాదం జరిగిన విషయాన్ని మొదట్లో ఎవరూ గుర్తించలేకపోయారు.
క్రేన్ సాయంతో కారు బయటకు….
కొంత సమయం తర్వాత గమనించిన స్థానిక గ్రామస్థులు వెంటనే పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న రెస్క్యూ సిబ్బంది క్రేన్, జేసీబీ సాయంతో తీవ్ర శ్రమకోర్చి బావిలో మునిగిపోయిన కారును బయటకు తీశారు.
కారు లోపల ఉన్న రాజు, భాగ్యలతో పాటు వారిద్దరి చిన్నారులు నిహాన్ష్, శాన్వికలు నీటిలో మునిగి అక్కడికక్కడే ఊపిరాడక మరణించారు. పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం దుబ్బాకలోని 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు…. ముఖ్యంగా ఇద్దరు చిన్న పిల్లలు ప్రమాదంలో దుర్మరణం చెందడంతో బల్వంతాపూర్ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

